అన్వేషించండి

Srikakulam News: పదవుల కోసం చూస్తున్న ఎచ్చెర్ల టీడీపీ నేతలు - చంద్రబాబు కనికరిస్తారా ?

Srikakulam; పదవుల్లో ప్రాధాన్యత కోసం ఎచ్చెర్ల టీడీపీ నేతలు చూస్తున్నారు. సీటు త్యాగం చేసినందున ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు.

Etcherla TDP leaders are looking for priority in posts:  ఎచ్చెర్ల టీడీపీ నేతలు పదవుల్లో ప్రాధాన్యం కోసం చూస్తున్నారు.  నవ్యాంధ్రలో టీడీపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కాలంలో (2014-19 )లో ఇక్కడి శాసనసభ్యుడు కిమిడి కళా వెంకటరావుకు తొలుత రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఇంధన శాఖా మంత్రిని చేసి గౌరవించారు. అలాగే చౌదరి బాబ్జీ  సతీమణి ధనలక్ష్మికి జడ్పీ పీఠాన్ని కేటాయించారు.ఇంతకు మించి ఆ కాలంలో కూడా పెద్దగా పదవులేమీ రాలేదు.1983-2004 టీడీపీ ఆవిర్భావం నుంచి ఎచ్చెర్లకు పదవులు వరించడంలో స్వర్ణ యుగమేనని చెప్పాలి. 1983 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన కావలి ప్రతిభాభారతికి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది. అలాగే ఆమె స్పీకర్ గా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే డీసీఎంఎస్ ఛైర్మన్ గా డి. సత్యేంద్రవర్మ వ్యవహరించారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ గా చౌదరి బాబ్జీ వ్యవహరించారు.

విజయనగరం ఎంపీగా కలిశెట్టి 

విజయనగరం ఎంపీ టిక్కెట్‌ను ఎచ్చెర్లకు  చెందిన కలిశెట్టి అప్పలనాయుడికి ఇచ్చి గెలిపించుకోవడంతో పార్టీ కోసం పనిచేసేవారికి అందలమెక్కిస్తారని రుజువైంది. అయితే గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడిన పార్టీ శ్రేణులు తమకు ప్రాధాన్యత ఉంటుందని ఎంతో ఆశించారు. పదవుల పందేరంలో ఎచ్చెర్లకు అగ్ర తాంబూలం ఉంటుదని అంతా భావించారు. ఇప్పటి వరకు కేవలం రెండు కార్పోరేషన్ డైరెక్టర్ పదవులతో సరిపెట్టారు. కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గా సీనియర్ న్యాయవాది అన్నెపు భవనేశ్వరరావుకు, రణస్థలం మండలానికి చెందిన గురజాల రాముకు రజక కార్పోరేషన్ డైరెక్టర్ పదవి కట్టబెట్టారు. జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తికి డైరెక్టర్ పదవిని ప్రకటించి.. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. జిల్లా స్థాయి పదవులు చేపట్టినా ఎలాంటి ప్రాధాన్యం లేని డైరెక్టర్ పదవి ప్రకటించడంతో పార్టీలో తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగింది. 

ఎచ్చెర్లలో బీజేపీ ఎమ్మెల్యే 
 
ఎచ్చెర్లలో కూటమిలో భాగంగా బిజెపి నుండి   ఈశ్వరరావును ఎంపిక చేయగా మెజార్టీతో గెలవడం జరిగింది. టిడిపి నుండి ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు ఇద్దరి మధ్యన కొంత గ్యాప్ అనేది ఉందని అయితే వాళ్ల వల్ల టిడిపి కార్యకర్తలు తీవ్రంగా నలిగిపోతున్నారని అంటున్నారు.  బిజెపి కూటమి ఎమ్మెల్యే అయిన దగ్గరికి వెళ్తే ఏ పని అవటం లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగని ఎంపీ పూర్తిస్థాయిలో చేయగలుగుతారంటే చేయలేని పరిస్థితి ఉందని కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎన్నో ఇబ్బందులు పడి పార్టీని గెలిపించుకొని చేసిన చివరికి మాత్రం మా పరిస్థితి ధైర్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తొలినాళ్లలో...

జిల్లా చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న గొర్లె శ్రీరాములునాయుడు ఇదే నియోజకవర్గం నుంచే రాజకీయాలు నెరిపారు. జడ్పీ చైర్మన్ గా, డీసీసీబీ ఛైర్మన్ గా, ఎంఎల్ సీ గా, మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. డీసీసీ అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పనిచేసి, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా అన్ని పార్టీల మద్దతుతో ఎంఎల్సీగా ఎన్నికైన గొర్లె హరిబాబునాయుడు కూడా ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇంతటి రాజకీయ వైభవం గల ఎచ్చెర్లకు ఎందుచేతనో మరి పాలకుల చిన్న చూపునకు గురవుతున్నట్టుగా అనిపిస్తుంది.గతమెంతో ఘనకీర్తి, మనకెందుకీ అపకీర్తి అన్నట్టుగా పార్టీ క్యాడర్ అంతర్మథనం చెందుతున్నారు. ఇకనైనా పదవుల పంపకంలో ఎచ్చెర్లకు సముచిత స్థానం కల్పించేలా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Embed widget