అన్వేషించండి

MP Dharmapuri Arvind : అన్ని పార్టీలను వీక్ చేయడమే మా లక్ష్యం - బీజేపీ ఎంపీ అర్వింద్

MP Dharmapuri Arvind : అన్ని పార్టీలను వీక్ చేయడమే తమ లక్ష్యమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బీజేపీలోకి ఎవరొచ్చినా తీసుకుంటామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో ఉంటారేమో అన్నారు.

MP Dharmapuri Arvind : బెజవాడను వంగవీటి గడ్డగా అభివర్ణించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఒక అభిమానిగా తన అభిమానాన్ని చాటుకున్నానని, అందుకే వంగవీటి గడ్డ అని అన్నానని ఆయ‌న క్లారిటీ కూడా ఇచ్చారు. అంతే కాదు ప్రధాని మోదీ మీద ఎంత అభిమానం ఉందో... అదే అభిమానం వంగవీటి మీద ఉందన్నారు. విజయవాడ వచ్చి తన అభిమానాన్ని చాటుకోపోతే ఎలా అని వ్యాఖ్యానించారు. చైతన్యం, ఆతిథ్యం, దాతృత్వం, అమృత్వం అన్నీ కలిస్తే విజయవాడ అన్నారు. ఇక తెలుగు రాష్ట్రల్లో వ‌ర్తమాన రాజ‌కీయాలపై బీజేపీ ఎంపీ అర్వింద్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. బీజేపిలోకి  ఎవరొచ్చినా తీసుకుంటామ‌న్నారు. 

ఎంఐఎం చేతుల్లో లా అండ్ ఆర్డర్ 

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎంఐఎం చేతుల్లో ఉన్నట్టుగా అసదుద్దీన్ కామెంట్లు చేస్తున్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. అసద్ కామెంట్లను మంత్రులు తప్పు పట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తామంతా గల్లీలో సైనికులమని, దిల్లీలో చాణుక్యులున్నారన్నారు.  ఏపీలో బీజేపీ వైసీపీ, టీడీపీలతో సమాన దూరమే పాటిస్తుంద‌ని వెల్లడించారు. అన్ని పార్టీలను వీక్ చేయడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమ‌న్నారు. వచ్చే ఎన్నికల నాటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో ఉంటారేమో అని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడంలో భాగంగానే బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు  కుమ్మక్కయ్యాయంటూ రేవంత్ ఏదేదో కామెంట్లు చేస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడడంలో రేవంత్ రెడ్డి విఫలం అవుతున్నార‌ని చెప్పారు. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ గుడ్ ఫ్రస్ట్రేటేడ్ ఫ్రెండ్ అని వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో కేంద్రం మీటింగ్ పెడితే కొన్ని సందర్భాల్లో కేసీఆర్ వెళ్లరని, కొన్ని సార్లు జగన్ వెళ్లరని ఇంకెం చేస్తామ‌ని ఎంపీ అర్వింద్  పశ్నించారు. షర్మిళ తెలంగాణలో కష్టపడుతున్నారని, ఆమెకు ఆల్ ద బెస్ట్ అంటూనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని జోస్యం చెప్పారు. 

బెజ‌వాడ లో అర్వింద్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ 

ఎంపీ అర‌వింద్ బెజ‌వాడ‌లో త‌న పుట్టిన రోజు వేడుకలు జ‌రుపుకున్నారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుటుంబ స‌మేతంగా గురువారం ద‌ర్శించుకున్నారు. అమ్మవారి స‌న్నిధికి వ‌చ్చిన అర్వింద్ కు ఆల‌య అధికారులు స్వాగ‌తం ప‌లికారు. అమ్మవారి ద‌ర్శనం అనంత‌రం అర్వింద్ దంపతులకు వేద ఆశీర్వచనం, ప్రసాదం అందచేశారు.

పార్టీ కార్యక‌ర్తల‌తో స‌మావేశం 

ఏపీ బీజేపీ పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చిన ఎంపీ అర్వింద్ పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప‌రిస్థితులు గురించి ఆయ‌న వాక‌బు చేశారు. అర్వింద్ ను క‌ల‌సి జ‌న్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్ కు  త‌ర‌లివ‌చ్చారు.  

ఎమ్మెల్సీ కవితపై కామెంట్స్ 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతిసారీ ప్రైవేట్ జెట్లల్లో ప్రయాణించ‌టంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర‌వింద్ అన్నారు. కవిత ప్రైవేట్ జెట్లతో తిరిగిన ఖర్చు ఎవరు పెట్టారని దిల్లీ బీజేపీ వాళ్లు అడిగారన్నారు. వాటికి సమాధానం చెప్పకుండా కోర్టుకెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారన్నారు.  సీఎం ఇంటి సభ్యురాలుగా ఉన్న కవిత మరింత బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎంఐఎం చేతుల్లో ఉన్నట్టుగా అసదుద్దీన్ కామెంట్లు చేస్తున్నారన్నారు. అసద్ కామెంట్లను మంత్రులు తప్పు పట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తాము గల్లీలో సైనికులం, దిల్లీలో చాణుక్యులున్నారన్నారు. 

Also Read : మతపిచ్చి లేపే తెలంగాణ కావాలా -పంటలు పండే తెలంగాణ కావాలా: కేసీఆర్

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Musical horn: భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
Mahesh Babu: మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Embed widget