అన్వేషించండి

Polavaram : పోలవరం నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ - ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు

Andhra Pradesh : పోలవరంకు అవసరమైన నిధులు విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెండింగ్ నిధులతో పాటు ఆర్ అండ్ ఆర్ చెల్లింపుల కోసం రూ. 12500 కోట్లు రిలీజ్ చేయనున్నారు.

Union Cabinet has decided to release Polavaram funds :  పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులతో జరిపిన చర్చల ఫలితంగా.. పెండింగ్ నిధులతో పాటు రూ. 12500 కోట్లను విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

ఐదేళ్ల పాటు పెద్దగా సాగని పోలవరం పనులు                    

2014 -19 మధ్య పరుగులు పెట్టిన  పోలవరం ప్రాజెక్టు తర్వాత ఆగిపోయింది. ఐదేళ్ల సమయం వృధా అయింది. రివర్స్ టెండర్లకు వెళ్లి కాంట్రాక్టర్లను మార్చడంతో పనులు ఆగిపోయాయి. గైడ్  బండ్ కుంగిపోయింది. డయాఫ్రంవాల్  కూడా దెబ్బతిన్నది.  చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరాన్ని ఎలా గట్టెక్కించాలా అన్నదనిపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో అంచనాలు వేశారు. తర్వాత పలుమార్లు కేంద్రాన్ని కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై వివరించారు. డీపీఆర్‌ను ఆమోదించాలని.. తక్షణం పనుల కొనసాగింపులకు రూ. 12500 కోట్లను విడుదల చేయడంతో పాటు పాత బిల్లులు రీఎంబర్స్ చేయాలని కోరారు. కేంద్రం తాజా కేబినెట్ భేటీలో ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

పోలవం జాతీయ ప్రాజెక్టు.. ఖర్చంతా కేంద్రానిదే         

విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం .. జాతీయ హోదా ఇచ్చింది. సాధారణంగా జాతీయ హోదా ప్రాజెక్టుల్లో 90 శాతం కేంద్రం.. పది శాతం రాష్ట్రం పెట్టుకుంటాయి. అయితే తర్వాత ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఆ పది శాతం కూడా తామే పెట్టుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు ముందుగా ప్రభుత్వం పనులు చేయించి  బిల్లులు పెడితే.. కేంద్రం మంజూరు చేస్తూ వస్తోంది. గత ఐదేళ్లుగా ఈ బిల్లింగ్ సైకిల్  గాడి తప్పింది. పనులేమీ చేయకపోవడంతో పెద్దగా బిల్లులు రావాల్సిన అవసరం లేకపోయింది.

ప్రధానిని పలుమార్లు కలిసిన చంద్రబాబు 

అయితే ఇప్పుడు ప్రాజెక్టును గాడిన పెట్టాలనుకున్న చంద్రబాబు.. పలుమార్లు కేంద్ర మంత్రులని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రధాన మంత్రి  కార్యాయం  ఆదేశాల మేరకు ఆర్థికశాఖ  పోలవరం నిధుల విషయాన్ని  మంత్రిమండలి ముందు ఉంచింది.  పోలవరం తొలి దశకు అవసరమయ్యే పూర్తి నిధులను అంచనా వేసి పోలవరం డీపీఆర్‌ను రూపొందించడంతో..  అవసరమయ్యే పూర్తి నిధులకు పలు స్థాయిలలో ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్ంచినందున వెంటనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.

చంద్రబాబు ప్రయత్నాలతో నిధుల విడుదల                         

పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు.  2016 తర్వాత నాబార్డుతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. పోలవరంకు అయ్యే ఖర్చు నాబార్డు ఇస్తుంది.  అయితే కేంద్రానికి రుణం రూపంలో ఇస్తుంది.. అది  ఏపీరాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వబోయే 12 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరుతున్నారు. ఆ నిధులు వస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
The Raja Saab Release Trailer : ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది - టైం స్టార్ట్ అయ్యింది డార్లింగ్స్
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల! మీరు ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి!
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
Embed widget