అన్వేషించండి

UN SDG Summit: UNO సదస్సులో పది మంది ఏపీ విద్యార్థులు - సర్కారు సంస్కరణలపై ప్రసంగం

UN SDG Summit: ఎస్డీజీ యాక్ష‌న్ వీకెండ్ స‌ద‌స్సులో.. ఏపీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ గళం వినిపించారు. సర్కారు సంస్కరణలపై ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు.

UN SDG Summit: ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా న్యూయార్క్‌లో జ‌రుగుతున్న ఎస్డీజీ యాక్ష‌న్ వీకెండ్ స‌ద‌స్సులో.. ఏపీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. శనివారం రోజు జనరల్ అసెంబ్లీలో జరిగిన సదస్సులో ఏపీ విద్యార్థులు తమ గళం వినిపించారు. తొలిరోజు దడాల జ్యోత్స్న, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, మోతుకూరి చంద్రలేఖ, షేక్ అమ్మాజాన్, వంజివాకు యోగేశ్వర్ మాట్లాడారు. 2030 నాటికి భవిష్యత్ తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించాలన్న నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు సుస్థిరాభివృద్ధిలో యువత ప్రాధాన్యం చాలా అవసరం అని అన్నారు. అభివృద్ధికి యువత టార్చ్ బేరర్ గా బాధ్యత తీసుకోవడం ఎంతో అవసరం అని పేర్కొన్నారు.

అయితే యూఎన్ఓ స‌ద‌స్సులో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు పాల్గొన‌డం దేశ చ‌రిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులను లీడర్లను చేసేలా విద్యా వ్యవస్థలో సీఎం జగన్ అనేక సంస్కరణలు చేపట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయన తీసుకొస్తున్న అద్భుతమైన పథకాల వల్లే సర్కారు బడిలో చదివే పిల్లలకు యూఎన్ఓ సదస్సులో స్థానం దక్కిందని అంటున్నారు. 

మరోవైపు మంత్రి బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ..  ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, కొలంబియా విశ్వవిద్యాలయం వంటి ప్రపంచ వేదికలపై మన విద్యార్థులు ప్రకాశిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దార్శనికతతో ఏపీ విద్యా వ్యవస్థలో సాధించిన అద్వితీయ విజయాలను ప్రపంచానికి వివరించబోతోందని అన్నారు. యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మాట్లాడేందుకు అమెరికా వెళుతున్న 10 మంది విద్యార్థులతో మాట్లాడటం ఆనందంగా ఉందని చెప్పారు. శనివారం రోజు విద్యార్థులను కలిసిన మంత్రి బొత్స విద్యార్థుల కుటుంబ నేపథ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతో ప్రతిభావంతులైన ఈ విద్యార్థులు అసాధారణ కుటుంబాలకు చెందినవారు కావడం స్ఫూర్తిదాయకం అంటూ మంత్రి చెప్పుకొచ్చారు.

జులైలో జరిగిన ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్‌లో రోజువారీ కార్యక్రమానికి సంబంధించిన స్టాల్స్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాఠశాలల పునరుద్ధరణ, విద్యా ఆశీర్వాదాలు, వసతి దీవెనలు, విద్యా బహుమతులు, డిజిటలైజేషన్ వంటి ఇతర విద్యా పథకాల వివరాలను యూఎన్ఓ ప్రతినిధులు కోరగా.. ఏపీలో "సమాన విద్య - అందరికీ విద్య అందుబాటులో"కి ఆకర్షితులయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏపీలో అమలవుతున్న సంస్కరణలను అందరికీ తెలిపేందుకు ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ఆహ్వానించారని వెల్లడించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నాలుగేళ్లలో అనేక విద్యా సంస్కరణలు, పథకాలకు శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయిని పరిగణలోకి తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి దృఢమైన నాయకత్వం, ప్రభుత్వ స్వచ్ఛమైన మనస్సు అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాయని వివరించారు. ఏపీ విద్యా వ్యవస్థ పటిష్టంగా రూపుదిద్దుకుంటోందని.. నేడు పేద ప్రజల జీవితాల్లో విద్య వెలుగులు పంచుతోందన్నారు. విద్యలో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు ఏపీ విద్యా పథకాలు, కార్యక్రమాలు పరిష్కారం కాబోతున్నాయని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget