అన్వేషించండి

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - జనవరి 5న ఆ టోకెన్లు జారీ, ఎక్కడ ఇస్తారంటే?

TTD: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5న టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మహతి ఆడిటోరియం, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

TTD Tokens Issued To Locals For Srivari Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. శ్రీవారి దర్శనం కోసం వచ్చే స్థానికులకు వచ్చే ఏడాది జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ (TTD) తెలిపింది. కాగా, ఇటీవల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతీ నెల మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి 7న మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డులు చూపించి టోకెన్లు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ నెల 25న..

మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను ఈ నెల 25న ఉదయం 11 గంటలకు, మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 26న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను సైతం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మార్పును భక్తులు గమనించాలని.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.gov.in లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు.

భక్తులకు గుడ్ న్యూస్

మరోవైపు, తిరుమలలో ఆధ్యాత్మిక, పర్యావరణ, వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యత, సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలందించేలా కసరత్తు చేస్తున్నట్లు ఈవో జె.శ్యామలరావు తాజాగా వెల్లడించారు. గత 6 నెలలుగా టీటీడీ చేపట్టిన కార్యక్రమాలతో పాటు సీఎం చంద్రబాబు విజన్ - 2047 ఆధునిక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని ప్రకటించారు. తుడా మాస్టర్ ప్లాన్‌లో భాగంగా.. ప్రస్తుత అవసరాలకు వసతులు సరిపోవడం లేదని అన్నారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం ద్వారా 18 ప్రాజెక్టులకు సంబంధించి ప్రణాళికలు అందించేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానించామని చెప్పారు.

గడిచిన 6 నెలల్లో లడ్డూ ప్రసాదం రుచి పెంచడం సహా నెయ్యి పరీక్షలు చేయడం, బయటి ల్యాబుల్లో ముడిసరుకు నాణ్యతను మెరుగుపరచడం, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు నాన్ స్టాప్ అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. తిరుమలలోని హోటళ్లలో రుచికరమైన వంటకాలు, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం వంటివి చేపట్టామని అన్నారు. దాతల విశ్రాంతి గృహాలకు దేవుళ్ల పేర్లు మాత్రమే ఉంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. టీటీడీ సేవల్లో పారదర్శకత, సామర్థ్యం పెంచేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. యాత్రికుల వసతి, దర్శనం, ఇతర సేవలు వేగవంతం చేసేందుకు మాన్యువల్ కార్యకలాపాలకు బదులుగా ఆటోమేషన్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సేవ కోసం ఏఐ చాట్ బాట్‌ను కూడా పరిచయం చేయాలని ఆలోచిస్తున్నట్లు వివరించారు.

Also Read: Christmas Holidays 2024 Telangana And Andhra Pradesh: ఏపీ, తెలంగాణలో క్రిస్మస్ హాలిడేస్ ఎప్పటి నుంచి? ఎన్ని రోజులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు - జగన్ సన్నిహితుల విచారణ - ఏం జరుగుతోంది?
ఏపీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు - జగన్ సన్నిహితుల విచారణ - ఏం జరుగుతోంది?
Chief Minister Chandrababu Naidu: బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget