అన్వేషించండి

Tirumala News: తిరుమలలో వన్యమృగాల సంచారం - అత్యాధునిక టెక్నాలజీ ట్రాప్ కెమెరాలతో నిఘా

Andhra News: తిరుమలలో వన్య మృగాల సంచారంపై టీటీడీ అప్రమత్తమైంది. ట్రాప్ కెమెరాలకు అధునాతన టెక్నాలజీ సాయంతో వన్యమృగాల కదలికలను గుర్తించనుంది.

TTD Installed Trap Cameras in Tirumala Footpath Route: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) వెంకటేశ్వరుడి క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దాదాపు 50 నుంచి 60 శాతం భక్తులు కాలిబాట మార్గంలోనే గోవింద నామస్మరణ చేసుకుంటూ వెంకటేశుని దర్శనం చేసుకుంటారు. అయితే, ఇటీవల కాలినడక మార్గంలో వన్యమృగాల సంచారం భక్తులను ఆందోళనకు గురి చేసింది. నడకమార్గాల్లో తినుబండారాలు సాధు జంతువులకు అందించడం, వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ వదిలెయ్యడం వల్ల మిగిలిన జంతువుల కోసం వన్యమృగాలు కాలిబాట మార్గం వద్దకు చేరుకోవడం అధికమైంది. ఈ క్రమంలో టీటీడీ (TTD) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాలిబాట మార్గంలో వెళ్తున్న బాలుడు కౌశిక్ పై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇది మరువక ముందే నెల రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో మరో బాలిక లక్షితపై దాడి చేసిన చిరుత తీవ్రంగా గాయపరిచి అటవీ ప్రాంతంలో చంపేసింది. ఈ నేపథ్యంలో అలిపిరి (Alipiri) కాలినడక మార్గంలో వెళ్లాలంటేనే భక్తులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ భక్తులకు కర్రలు అందించడం, రాత్రి పూట నడక మార్గాన్ని మూసేయడం, గ్రూపులుగా భద్రతా సిబ్బందితో కలిసి పంపించడం వంటి చర్యలు చేపట్టింది. అలాగే, వన్యమృగాల సంచారాన్ని పసిగట్టేలా నడక మార్గంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసింది. అనంతరం 6 చిరుతలను బంధించింది. తాజాగా, అదే నడక మార్గంలో ఇటీవల ఓ చిరుత, ఎలుగు సంచరించడం కలకలం రేపింది. ఈ క్రమంలో అధునాతన కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

జీఎస్ఎం సాంకేతికతతో

అలిపిరి మెట్ల మార్గం పూర్తిగా శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న కారణంగా కాలిబాట మార్గానికి దగ్గరగా వన్యమృగాలు సంచరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శేషాచల అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి వన్యమృగాల కదలికలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు టీటీడీ, అటవీ శాఖ సిద్ధమైంది. జీఎస్ఎం టెక్నాలజీ (GSM Technology) వినియోగించుకొని, యానిమల్ లైవ్ మూవ్మెంట్ ను ఈ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తారు. జంతువు జాడ తెలియగానే, లాటిట్యూడ్ తో సహా యానిమల్ ఫోటోను అందుబాటులో ఉన్న కంట్రోల్ రూమ్ డివైస్ కు చేరవేస్తుంది. తద్వారా వన్యమృగాల కదలికలు వెనువెంటనే కనుగొనేలా ఉపయోగ పడటమే కాకుండా, ఆ ప్రాంతంలో సిబ్బందిని సైతం అలెర్ట్ చేసి వన్య ప్రాణుల దాడి నుంచి తప్పించే ప్రయత్నం చేయవచ్చు. దీంతో పాటు వీడియో క్యాప్చర్ ట్రాప్ కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చి వన్యమృగాల పూర్తి కదలికలు తెలుసుకునే అవకాశం ఉంది.

ఇలా పని చేస్తుంది

అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో సీసీ కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేయనుంది. వీటికి అనలిటిక్స్ సాఫ్ట్ వేర్ ను అనుసంధానం చేసి క్షణాల వ్యవధిలోనే ప్రమాద ఛాయలను అధికారులకు చేరవేస్తుంది. ఇందుకు అనలిటిక్స్ డ్యాష్ బోర్డ్ సమాచార వ్యవస్థగా పని చేస్తుంది.. అనలిటిక్స్ డ్యాష్ బోర్డ్ 10 అంశాలపై సమాచారం అందిస్తూ వస్తుంది. ముఖ్యంగా జోన్-ఇంస్ట్రక్షన్స్, యానిమల్ రికగ్నేషన్, వాహనాల రాకపోకల సంఖ్య, రాంగ్ వే, నో పార్కింగ్ జోన్, క్రౌడ్ కంజెక్షన్, ఫైర్, స్మోక్ డిటెక్షన్, ట్రిప్ వైర్స్, పీపుల్ కౌంట్, ఫేస్ రికగ్నేషన్, లెఫ్ట్ ఓవర్ ఆబ్జెక్ట్ లు ప్రథమంగా ఉన్నాయి. ఈ ఆధునిక సాంకేతికత వినియోగంతో నడక మార్గంలో భక్తులపై వన్యమృగాల దాడులను తప్పించవచ్చని  టీటీడీ భావిస్తోంది. వన్యమృగాలు, వన్య ప్రాణులు సీసీ కెమెరాలున్న ప్రాంతంలోకి రాగానే వాటి జాడలు గుర్తించి, అనలిటిక్స్ డ్యాష్ బోర్డుకు సందేశాన్ని క్షణాల వ్యవధిలో సమాచారాన్ని చేరవేస్తాయి. ఇది వన్యప్రాణుల నుంచి భక్తులకు పూర్తి భద్రత కల్పిస్తుందని తిరుపతి వైల్డ్ లైప్ డీఏఫ్ఓ సతీష్ రెడ్డి తెలిపారు.

Also Read: MP Kesineni Nani: 'నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు' - ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
YS Sharmila: 25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
Sri Ramanavami Brahmotsavams: మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!
మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget