అన్వేషించండి

Tirumala News:స్థానికులకు కేటాయించే అంగప్రదక్షిణ టికెట్లపై కీలక అప్‌డేట్- 500 డిపాజిట్ చేయాల్సిందే!

Tirumala News: తిరుమల, తిరుపతి స్థానికులకు ప్రతి శనివారం కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లు ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టిటిడి ప్రకటించింది

Tirumala News: తిరుమల, తిరుపతి అర్బన్, స్థానికులకు ప్రతి శనివారం కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లు ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టిటిడి ప్రకటించింది. అంగప్రదక్షిణ టికెట్లు కావలసిన స్థానిక భక్తులు ప్రతి గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా వీళ్లకు టికెట్లు కేటాయిస్తారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఇచ్చిన ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసిన మొబైల్ ఫోన్‌ నెంబర్లకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తారు. 

ఆన్ లైన్‌లో టికెట్లు
లక్కీడిప్‌లో టికెట్లు పొందిన స్థానిక భక్తులు ఆన్లైన్‌లో 500 రూపాయలను డిపాజిట్ చేయవలసి ఉంటుంది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు మహతి కళాక్షేత్రంలో తమ ఆధార్ కార్డు చూపి శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులను శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500 డిపాజిట్‌ను తిరిగి వారి ఖాతాల్లోకి టీటీడీ జమ చేస్తుంది. 

Also Read: ఈ ఆలయంలో తప్పుడు ప్రమాణం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు!

తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కానీ భక్తులు ఎవరైనా టీటీడీని మోసం చేసి లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందితే వారు చెల్లించిన రూ.500 డిపాజిట్ టీటీడీ తిరిగి చెల్లించదు. అంగప్రదక్షిణకి కూడా అనుమతించరు. తిరుమల, తిరుపతి స్థానికులు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

పూర్వ వైభవం ఎప్పటి నుంచి
తిరుమల తిరుపతి స్థానికులకు ప్రతినెల రెండో మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్థానికులకు ఇది ఒక వరంగా భావించే వారు. ఈ సదుపాయాన్ని గత ప్రభుత్వం కొవిడ్ సమయంలో నిలిపి వేసింది. ఆ పరిస్థితుల నుంచి బయటపడిన తిరిగి స్థానికులకు కల్పించే స్వామి వారి దర్శనం తిరిగి ప్రారంభించలేదు. అదే అజెండాను కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేసిన తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రత్యేకంగా ప్రతి సమావేశంలో తాను స్థానికులకు ప్రతి నెల దర్శనం కల్పించే అవకాశం ఇస్తామని తెలిపారు. కొత్తగా ఈవో శ్యామలారావు వచ్చిన వెంటనే ఆయనను కలిసి మాట్లాడుతామని కూడా ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తున్న ఇప్పటివరకు పట్టించుకోలేదు. వెంటనే ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. 

Also Read: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం - ఆ ప్రచారంపై టీటీడీ క్లారిటీ, భక్తులు అపోహలు నమ్మొద్దని విజ్ఞప్తి

రూ.3.70 కోట్లు విరాళం
టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.3.70 కోట్లు విరాళంగా అందింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఎస్‌ బ్రదర్స్ మేనేజింగ్‌ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాద రావు, మాలతీ లక్ష్మీ కుమారి బుధవారం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.3.70 కోట్లు విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి దాతలు విరాళం చెక్కును అందజేశారు.

Tirumala News:స్థానికులకు కేటాయించే అంగప్రదక్షిణ టికెట్లపై కీలక అప్‌డేట్- 500 డిపాజిట్ చేయాల్సిందే!

Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget