అన్వేషించండి
Viral News: "గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్!
Viral News: జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఓ బామ్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఉత్తారంధ్ర యాసలో ఆమె చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాయి.

"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్!
Source : X.com
Viral News: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకటే పేరు వినిపిస్తోంది. అదే పవన్ కల్యాణ్. ఒకప్పుడు కేవలం సినిమా హీరోగా మాత్రమే తెలిసిన ఆయన పార్టీ పెట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మరింత దగ్గరయ్యారు. అలాంటి పార్టీ నేడు వార్షికోత్సవం జరుపుకుంటోంది. దీన్ని గిరిజనుల మధ్య పవన్ సెలబ్రేట్ చేసుకొని ప్రత్యేకత చాటుకున్నారు. అలాంటి పార్టీని అభిమానించే ఓ బామ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడున్నంత సానుకూలంగా పరిస్థితులు లేవు. కొందరు ఆయన రాజకీయ ప్రవేశంపై ఎగతాలి చేశారు. సినిమా స్టార్ కదా రాజకీయాల్లో ఏం చేస్తారని ప్రశ్నించారు. తక్కువ చేసి మాట్లాడారు. ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. కానీ పవన్ దేనికీ వెనకడుగు వేయలేదని బామ్మ చెప్పుకొచ్చింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. " మన రెండు రాష్ట్రాల ప్రజలకి ఒక విజ్ఞప్తి. ఒక మంచి మాట చెప్తున్నాను. మా పవన్ బాబు ఈ పార్టీని పెట్టినప్పుడు ఎంతో జనం విమర్శించారు. యాలాకోలం(ఎగతాళి) చేశారు. ఎన్నో అన్నారు. వాటిని పడుతూ ఎదరించుకొని ఒక్కో మెట్టు ఎక్కాడు. నల్లమల అడవులోని పెద్ద పులై నిలబడ్డాడు దిస్ ఈజ్ పవన్ కల్యాణ్. పవన్ ఆరుడుగుల బుల్లెట్ బుల్లెట్ అంటే తెలియన వారు పవన్ను చూడండి."
మీరు సూపర్ బామ్మ గారు 👌👌👌 pic.twitter.com/aGMD3ekhKK
— సనాతని హిందూ 🚩 (@IndianSanathani) March 14, 2026
నల్లమల అడవిలో పెద్ద పులిలా
పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు గొప్పగా వర్ణిస్తారు. అందుకే బామ్మ పవన్ను పెద్దపులితో పోల్చారు. అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత మంది శత్రువులు చుట్టుముట్టినా, ఒంటరిగా పోరాడే ధైర్యం ఆయన సొంతం అని వారి నమ్మకం. అందుకే ఆయనను ఆరుడుగల బులెట్ అని పిలిచారు.
విమర్శకులనే మిత్రులుగా మార్చుకునే గుణం
రాజకీయాల్లో శత్రువులు ఉండటం సహజం కానీ పవన్ కల్యాణ్ ప్రత్యేకత ఏంటంటే, తనను విమర్శించే వారిని కూడా తన మంచి మనసుతో మార్చుకోవాలని ఆయన కోరుకుంటారని బామ్మ చెప్పారు. తప్పుడు దారిలో ఉన్న వారిని, తనను ద్వేషించే వారిని కూడా మంచి మార్గంలోకి మళ్లించి, తన వైపు తిప్పుకోవాలని సంకల్పం ఆయనదని వివరించారు. కుట్రలు చేసే వారు ఎన్ని ఎత్తులు వేసినా, నక్కజిత్తుల్లాంటి ప్లాన్లు వేసినా అవేవీ జనసేన ఎదుగుదలను ఆపలేవని బామ్మ అన్నారు.
" ఎవరు ఎన్ని ఎత్తులపై ఎత్తు వేసినా నక్కజిత్తుల్లాగ మీరు చూసుకొని ఉండటమే. మా పార్టీ ఎదుగుతూ ఉండటమే. ఎన్ని విమర్శించినా, పగోడినైనా మంచోడిగా మలచి మా పక్కి తిప్పుకుంటాం. మాకు అంతా మంచి మనసు ఇచ్చాడు మా పవన్ బాబు. అయన్ని చూసి చాలా నేర్చుకున్నాం. ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం. మీరంతా ఎంత ఉడికిపోయినా, మేమంతా ఊపిరి ఉన్నంత వరకు జనసేనతోనే ఉంటాం. తగ్గుడెందుకు తలవంచుడెందుకు ఆడెవ్వడైతేనేరా మా గుండె ఉండగా దమ్ము నిండి ఉండగా ఎదురించి ఎగరెయ్యాలి జెండా జై జనసేన" అంటూ బామ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
విశాఖపట్నం
విశాఖపట్నం
విశాఖపట్నం
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















