అన్వేషించండి

Srivari Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం - ఆ ప్రచారంపై టీటీడీ క్లారిటీ, భక్తులు అపోహలు నమ్మొద్దని విజ్ఞప్తి

Tirupati News: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయంలో నూతన విధానం అంటూ జరుగుతోన్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. లడ్డూల పంపిణీ పాలసీలో ఎలాంటి మార్పు లేదని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.

TTD Clarity On Srivari Laddu Prasadam: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నూతన విధానం అంటూ జరుగుతోన్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. లడ్డూ ప్రసాద విక్రయ విధానంపై కొన్ని మీడియా ఛానెళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. భక్తులు ఎలాంటి అపోహలు, వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని.. బ్లాక్ మార్కెట్, దళారులను అరికట్టేందుకు చిన్న మార్పు చేసినట్లు స్పష్టం చేశారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తామని తెలిపారు.

దర్శన టికెట్, టోకెన్ కలిగిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలు విక్రయిస్తామని చెప్పారు. కొంతమంది స్వామి దర్శనం చేసుకోకుండా లడ్డూలు కొని బయట అమ్ముతున్నారు. అలాంటి వారికి ఆధార్ తీసుకుని 2 లడ్డూలు మాత్రమే ఇస్తున్నామని పేర్కొన్నారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగానే లడ్డూ ప్రసాద విక్రయం కొనసాగుతుందన్నారు. కాగా, తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ జారీ విధానంలో టీటీడీ (TTD) గురువారం నుంచి మార్పులు చేసినట్లు ఉదయం పెద్దఎత్తున ప్రచారం సాగింది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇస్తారని.. దర్శన టికెట్‌పై ఒక లడ్డూ, ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డు ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఖండించిన టీటీడీ దానిపై స్పష్టత ఇచ్చింది. 

మరోవైపు, లడ్డూ ప్రసాదం తయారీకి కర్ణాటక ప్రభుత్వం నెయ్యి సరఫరాను టీటీడీ మళ్లీ ప్రారంభించింది. నందిని బ్రాండ్ నెయ్యి సరఫరాను ప్రారంభించగా.. బుధవారం రాత్రి మొదటి లోడును ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య జెండా ఊపి ప్రారంభించారు. గత వైసీపీ హయాంలో ధర విషయంలో అంగీకారం కుదరక గతేడాది సెప్టెంబర్ నుంచి నెయ్యి సరఫరా నిలిపేశారు. ఇటీవల 350 టన్నుల నెయ్యి సరఫరా చేయాలని టీటీడీ కోరడంతో సరఫరాను తిరిగి ప్రారంభించినట్లు కర్ణాటక పాల సమాఖ్య అధికారులు తెలిపారు. 

లక్కీ డిప్ ద్వారా ఆ టోకెన్లు

ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తోన్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లను ఇకపై, లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ భక్తులు తమ ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తామని..  టికెట్లు పొందిన భక్తుల మొబైల్‌కు మెసేజ్ పంపిస్తామని చెప్పారు. ఈ సమాచారం ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆన్‌లైన్‌లో రూ.500 డిపాజిట్ చేయాలని సూచించారు. వీరు మహతి కళాక్షేత్రంలో ఆధార్ కార్డు చూపించి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చని తెలిపారు. టికెట్లు పొందిన భక్తులకు శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తామన్నారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500 డిపాజిట్‌ను వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కాని భక్తులకు.. లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందిన వారికి డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లించమని చెప్పారు.

Also Read: CM Chandrababu: 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి' - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

April 2026 Festivals: అక్షయ తృతీయ, సింహా చలంలో చందనోత్సవం, నృసింహ జయంతి సహా ఏప్రిల్ (వైశాఖమాసం) నెలలో పండుగలు ఇవే!
అక్షయ తృతీయ, సింహా చలంలో చందనోత్సవం, నృసింహ జయంతి సహా ఏప్రిల్ (వైశాఖమాసం) నెలలో పండుగలు ఇవే!
Vontimitta: ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం! భక్తులకు తలంబ్రాలు, ప్రసాదాల పంపిణీ ఏర్పాట్లు పూర్తి, పార్కింగ్ వివరాలు!
ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం! భక్తులకు తలంబ్రాలు, ప్రసాదాల పంపిణీ ఏర్పాట్లు పూర్తి, పార్కింగ్ వివరాలు!
Budh Gochar 2026: ఏప్రిల్ 1 నుంచి గురు నక్షత్రరాశిలో బుధ గ్రహ సంచారం! వృషభం, మిథునం సహా ఈ 4 రాశుల వారికి ప్రయోజనకరం!
ఏప్రిల్ 1 నుంచి గురు నక్షత్రరాశిలో బుధ గ్రహ సంచారం! వృషభం, మిథునం సహా ఈ 4 రాశుల వారికి ప్రయోజనకరం!
April 2026 Grah Gochar: ఏప్రిల్ 2026లో గ్రహాల మార్పు! మీ రాశిపై, రాజకీయాలు, మార్కెట్ పై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
ఏప్రిల్ 2026లో గ్రహాల మార్పు! మీ రాశిపై, రాజకీయాలు, మార్కెట్ పై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Oracle Layoffs: భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
భారీ లాభాలు వచ్చినా 30వేల మందిని ఒక్క రోజే తీసేసిన ఒరాకిల్ -సాఫ్ట్‌వేర్ రంగంలో గగ్గోలు!
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
Embed widget