అన్వేషించండి

CM Chandrababu: 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి' - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra News: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని.. 90 రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

CM Chandrababu Review On Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిని (Amaravati) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI - ఏఐ) సిటీగా తీర్చిదిద్దాలని.. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో ఆయన గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుకు వచ్చేలా   అమరావతి లోగో ఉండాలని.. రాజధాని పేరులో ఆంగ్లంలో మొదటి అక్షరం A, చివరి అక్షరం I కలిసేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలని సూచించారు.

90 రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని నిర్దేశించారు. రాజధాని ప్రాంతంలో త్వరితగతిన జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని అన్నారు. రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడాలన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి పట్టే సమయం, పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవడం వంటి అంశాలపైనా సమావేశంలో ఆయన సమీక్షించారు. 'అమరావతి దేవతల రాజధాని. అలాంటి గొప్ప రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. ఇప్పుడు రాజధాని పనులు వేగవంతం కావాలి. పనుల విషయంలో ఎక్కడా రాజీ వద్దు.' అని సీఎం అధికారులకు సూచించారు.

హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుపైనా..

అటు, హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుపైనా సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలని కోరుకునే వారి కోసం 14 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును రూపొందించామని.. అయితే, 2019లో వైసీపీ హయాంలో దీనికి గ్రహణం పట్టిందన్నారు. ఈ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంటలోనే అమ్ముడుపోయాయని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వ చర్యలతో కొనుగోలుదారులు వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనుల కోసం 190 ప్రొక్లెయిన్లు వినియోగిస్తున్నామని.. 60 శాతం పనులు పూర్తైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 

మరోవైపు, విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు ప్రాజెక్టు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును రెండు ఫేజుల్లో చేపడతామని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సీఎంకు వివరించారు. అటు, విజయవాడలోనూ రూ.11 వేల కోట్లతో 38 కి.మీ మేర చేపట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్ట్ పనులను సైతం వేగవంతం చేయాలని సీఎం నిర్దేశించారు.

అమరావతి రైతులకు గుడ్ న్యూస్

సెప్టెంబర్ 15లోగా అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లిస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిపై సీఎం సమీక్ష అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. అమరావతిలో ఇంకా 3,550 ఎకరాలు సేకరించాల్సి ఉందని అన్నారు. 'హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు సీఎం క్లియరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.900 కోట్లు కావాలి. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల పూర్తికి సీఎం ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గాలంటే మెట్రోల వల్లే సాధ్యం.' అని మంత్రి పేర్కొన్నారు.

Also Read: Monkeypox RT-PCR Kit : దేశంలోనే తొలి మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ రెడీ - విశాఖ మెడ్‌టెక్ జోన్ ఘనత - ఆవిష్కరించిన చంద్రబాబు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget