అన్వేషించండి

CM Chandrababu: 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి' - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra News: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని.. 90 రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

CM Chandrababu Review On Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిని (Amaravati) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI - ఏఐ) సిటీగా తీర్చిదిద్దాలని.. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో ఆయన గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుకు వచ్చేలా   అమరావతి లోగో ఉండాలని.. రాజధాని పేరులో ఆంగ్లంలో మొదటి అక్షరం A, చివరి అక్షరం I కలిసేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలని సూచించారు.

90 రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని నిర్దేశించారు. రాజధాని ప్రాంతంలో త్వరితగతిన జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని అన్నారు. రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడాలన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి పట్టే సమయం, పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవడం వంటి అంశాలపైనా సమావేశంలో ఆయన సమీక్షించారు. 'అమరావతి దేవతల రాజధాని. అలాంటి గొప్ప రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. ఇప్పుడు రాజధాని పనులు వేగవంతం కావాలి. పనుల విషయంలో ఎక్కడా రాజీ వద్దు.' అని సీఎం అధికారులకు సూచించారు.

హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుపైనా..

అటు, హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుపైనా సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలని కోరుకునే వారి కోసం 14 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును రూపొందించామని.. అయితే, 2019లో వైసీపీ హయాంలో దీనికి గ్రహణం పట్టిందన్నారు. ఈ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంటలోనే అమ్ముడుపోయాయని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వ చర్యలతో కొనుగోలుదారులు వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనుల కోసం 190 ప్రొక్లెయిన్లు వినియోగిస్తున్నామని.. 60 శాతం పనులు పూర్తైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 

మరోవైపు, విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు ప్రాజెక్టు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును రెండు ఫేజుల్లో చేపడతామని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సీఎంకు వివరించారు. అటు, విజయవాడలోనూ రూ.11 వేల కోట్లతో 38 కి.మీ మేర చేపట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్ట్ పనులను సైతం వేగవంతం చేయాలని సీఎం నిర్దేశించారు.

అమరావతి రైతులకు గుడ్ న్యూస్

సెప్టెంబర్ 15లోగా అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లిస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిపై సీఎం సమీక్ష అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. అమరావతిలో ఇంకా 3,550 ఎకరాలు సేకరించాల్సి ఉందని అన్నారు. 'హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు సీఎం క్లియరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.900 కోట్లు కావాలి. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల పూర్తికి సీఎం ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గాలంటే మెట్రోల వల్లే సాధ్యం.' అని మంత్రి పేర్కొన్నారు.

Also Read: Monkeypox RT-PCR Kit : దేశంలోనే తొలి మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ రెడీ - విశాఖ మెడ్‌టెక్ జోన్ ఘనత - ఆవిష్కరించిన చంద్రబాబు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Vijaya ghee issue: విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వట్
విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వట్
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్

వీడియోలు

Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Anakalapalle Latest News:
"మా ఫుడ్‌తో పిండివంటలు చేసుకుంటున్నార్‌ సార్" బీసీ హాస్టల్‌ దుస్థితిపై లోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు! ప్రభుత్వం సీరియస్
Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Embed widget