అన్వేషించండి

Ganesh Chaturthi 2024 : ఈ ఆలయంలో తప్పుడు ప్రమాణం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు!

Kanipakam: సత్య ప్రమాణాలకు నెలవుగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం వెలుగుతోంది. హిందువులు మాత్రమే కాదు ముస్లింలు కూడా మొక్కులు చెల్లించుకునే ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనది..

Sri Varasidhi Vinayaka Swamy Temple Kanipakam : భాద్రపద శుద్ధ చవితిరోజు హస్త నక్షత్రంలో జన్మించాడు వినాయకుడు. సకల విద్యలకు, సకల మంత్రాలకు, సకల శుభాలకు అధినాయకుడు గణేషుడు. అందుకే ఆయన జన్మదినం జగత్తుకి పండుగ అయింది. కేవలం చవితి పండుగరోజే కాదు..నిత్యం పూజలు, అభిషేకాలతో వెలిగే వినాయక క్షేత్రాలెన్నో ఉన్నాయి. అలాంటి పుణ్య ప్రదేశాల్లో కాణిపాకం ఒకటి. బహుదా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో సర్వమత ఆరాధ్యుడుగా పూజలందుకుంటున్నాడు వినాయకుడు.  

కాణిపాకం స్థలపురాణం
వెయ్యేళ్ల క్రితం ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. అప్పట్లో విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు.. గుడ్డి, మూగ, చెవిటి వారుగా జన్మించారు. తమ కర్మఫలాన్ని అనుభవిస్తూ... ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులకు ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. చుక్కనీటికోసం జనం బాధలు వర్ణనాతీతంగా మారాయి. అలాంటి సమయంలో..తమ పొలంలో ఓ పెద్ద బావి తవ్వాలని భావించారు ఈ ముగ్గురు. బావి తవ్వుతూ ఉండగా ఓ పెద్ద బండరాయి అడ్డుగా తగిలింది. అంతలోనే ఆ రాయినుంచి రక్తం చిమ్మింది. ఆ రక్తం ఆ ముగ్గురిపై పడగానే పుట్టుకతో అనుభవిస్తున్న వైకల్యం తొలగిపోయింది. ఈ విచిత్రం గురించి తెలుసుకున్న గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించి చూస్తే..అందులోంచి బయటపడింది గణనాథుడి విగ్రహం. ప్రత్యేక పూజలు చేసిన గ్రామస్తులు భారీగా కొబ్బరికాయలు కొట్టారు. ఆ నీరు దాదాపు ఎకరం స్థలం మేర పాకిందట.  ‘కాణి’ అంటే ఎకరం పొలం అని అర్థం. అప్పటి నుంచి విహారపురి గ్రామం పేరు కాణిపారకరమ్ గా..రాను రాను కాణిపాకంగా ప్రసిద్ధి చెందింది. 
 
Also Read: ఈ 8 ఆలయాలను రెండు రోజుల్లో చుట్టేయవచ్చు.. వినాయకచవితికి ప్లాన్ చేసుకోండి!

స్వయంభువుగా వెలసిన వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వాయువ్య దిశగా ఉన్న అనుబంధ ఆలయం మణికంఠేశ్వరస్వామిది. దీనిని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతకం నుంచి ఉపశమనం కోసం పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించాడట. ఇక్కడ కొలువైన  మరగదాంబిక అమ్మవారు అత్యంత పవర్ ఫుల్. ఈ ఆలయంలో సర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తారు. స్వయంభుగా వెలసిన వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఎదురుగా వరదరాజస్వామి కొలువయ్యాడు. జనమేజయ మహారాజు చేపట్టిన  సర్పయాగ దోష పరిహారం కోసం  శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మించినట్టు చెబుతారు. 

Also Read: వినాయకుడి రాశి ఏంటి -గణనాథుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండే రాశులేంటి!
 
ప్రమాణం చేస్తే జాగ్రత్త

కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని సత్య ప్రమాణాల దేవుడిగా ఆరాధిస్తారు భక్తులు. అందుకే కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామి తప్పనిసరిగా శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు భక్తితో ఇక్కడ భగవంతుడిని పూజించి, ప్రమాణం చేస్తే దాన్నుంచి బయటపడతారని విశ్వాసం. 

నిత్యం పెరిగే విగ్రహం

కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతూ ఉంటాడని చెబుతారు. అందుకు నిదర్శనం ఏంటంటే స్వామివారి వెండికవచం సరిపోకపోవడమే. అప్పుడెప్పుడో గణనాథుడికి చేయించిన వెండి కవచం ఇప్పుడు సరిపోకపోవడంతో స్వామివారి విగ్రహం పెరుగుతోందని గమనించారు.

Also Read: గణేష్ చతుర్థి 2024: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget