అన్వేషించండి

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు, అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

Tirupati News: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రుల సమాచారం కోసం అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అటు, ఆస్పత్రుల వద్ద బాధితుల బంధువుల రోదనతో హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.

Help Line Number For Victims Information Tirupati Stampede Incident: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందడం పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 48 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు అంబులెన్సులో రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రుల వద్ద అంబులెన్సుల మోత, క్షతగాత్రుల బంధువల రోదనలతో దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ దుర్ఘటనలో క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 0877 - 2236007 నెంబరును సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అటు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసినా.. తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని.. టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని ఆదేశించారు.

సీసీ కెమెరాల పరిశీలన

మరోవైపు, తోపులాట ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తొక్కిసలాట ఘటనకు గల కారణాలపై భక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కొందరు భక్తులు అనవసరంగా అత్యుత్సాహానికి పోయి తోయడమే దుర్ఘటనకు కారణమయిందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఘటనకు దారి తీసిన పరిణామాలపై పూర్తి నివేదిక తయారుచేయాలని భావిస్తున్నారు.

తిరుపతి మంత్రులు

ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు మంత్రులు, టీటీడీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో క్షతగాత్రులకు సహాయ చర్యలు, వైద్య సేవలు పర్యవేక్షించేందుకు మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్‌ల బృందం తిరుపతికి చేరుకుంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిరంతరం టీటీడీ అధికారులతో మాట్లాడుతూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

అటు, తిరుపతి ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ జరిగింది..

కాగా, తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించగా.. 48 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. మృతులు నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50)లుగా గుర్తించారు. అంతకు ముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.

Also Read: AP Inter Exams Fact Check: మొదటి ఏడాది పరీక్షల్ని ఏపీ ఇంటర్ బోర్డు రద్దు చేసిందా ? - ఇదిగో అసలు నిజం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget