అన్వేషించండి

Tirumala News : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, త్వరలో సామాన్య భక్తులకు టైమ్ స్లాట్ విధానం తిరిగి ప్రారంభం

Tirumala News : తిరుమలలో సామాన్య భక్తులకు స్లాట్ విధానంలో దర్శనాలు త్వరలో తిరిగి ప్రారంభిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇవాళ డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tirumala News : తిరుమలలో స్లాట్ విధానం ద్వారా సామాన్య భక్తులకు త్వరలో స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల సలహాలు, సూచనలు ఈవో ధర్మారెడ్డి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 12వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో రావడం ద్వారా స్లాట్ విధానాన్ని టీటీడీ రద్దు చేసిందన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. టీటీడీలో సమయాన్ని బట్టి, రద్దీ బట్టీ సేవలను రద్దు చేసే వ్యవస్థ ఉందని, అందుకే వివిధ పర్వదినాల్లో కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తు్న్నామని ఈవో తెలిపారు. 

వృద్ధులకు రోజూ ఆన్లైన్ స్లాట్ విధానం 

సహస్ర కలశాభిషేకం, విశేష పూజ, వసంతోత్సవాన్ని ఉత్సవర్లను అరుగుదల నుంచి కాపాడేందుకు అర్చకులు, జియ్యంగార్ల ఆదేశాల మేరకు కొన్ని సార్లు సేవలు రద్దు చేశామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.  అష్టదళ, తిరుప్పావడ సేవలు జూన్ 30వ తేదీ వరకూ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్జిత సేవల సమయంలో మరింత మంది భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వయోవృద్ధులకు సంబంధించిన విషయాలపై కొందరు భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని ఈవో తెలిపారు. వయోవృద్ధులకు ప్రతి రోజు ఆన్లైన్ స్లాట్ విధానం ద్వారా వెయ్యి మందికి దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు. చంటి బిడ్డల తల్లిదండ్రులకు, ఎన్.ఆర్.ఐ దర్శనాలు కూడా ప్రస్తుతం తిరుమలలో యథావిధిగా కొనసాగుతుందని తెలియజేశారు. 

హుండీ ఆదాయం రూ.127 కోట్లు 

ఏప్రిల్ నెలలో శ్రీవారిని ఇరవై లక్షల అరవై నాలుగు వేల మంది దర్శనం చేసుకున్నారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హుండీ ద్వారా రూ.127 కోట్లు ఆదాయం రాగా, హుండీ కానుకులు నుంచి రూ.4.41 కోట్ల ఆదాయం లభించిందన్నారు. 99.07 లక్షల శ్రీవారి లడ్డూలు విక్రయించారని ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. పరకామణిలో ఓ సిబ్బంది నగదు తీసుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది పట్టుకుని రిమాండ్ చేశారని, పరకామణిని కఠినంగా పరిశీలిస్తున్నామన్నారు. స్వామి వారి సొత్తును దొంగలిస్తే కచ్చితంగా పట్టుబడుతారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందన్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Paper Leak: NEET UG 2026 పరీక్ష రద్దు చేసిన NTA .. పేపర్ లీకేజీ కేసుపై CBI దర్యాప్తు..
NEET UG 2026 పరీక్ష రద్దు చేసిన NTA .. పేపర్ లీకేజీ కేసుపై CBI దర్యాప్తు..
Vijay Astrologer: విజయ్ కూడా అంతే - ఆస్థాన జ్యోతిష్యుడికి సీఎంవో బాధ్యతలు !
విజయ్ కూడా అంతే - ఆస్థాన జ్యోతిష్యుడికి సీఎంవో బాధ్యతలు !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Ranveer Singh: శివునిగా రణవీర్ సింగ్... Dhurandhar సక్సెస్ తర్వాత పౌరాణిక ఫ్రాంచైజీ?
శివునిగా రణవీర్ సింగ్... Dhurandhar సక్సెస్ తర్వాత పౌరాణిక ఫ్రాంచైజీ?
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Trisha Krishnan: మళ్ళీ డుమ్మా కొట్టిన త్రిష... హైదరాబాద్ ఈవెంట్‌కూ పిలవలేదా?
మళ్ళీ డుమ్మా కొట్టిన త్రిష... హైదరాబాద్ ఈవెంట్‌కూ పిలవలేదా?
Lamborghini నుంచి Fenomeno Roadster లగ్జరీ కారు లాంచ్.. 15 మంది అదృష్టవంతులకే లభ్యం
Lamborghini నుంచి Fenomeno Roadster లగ్జరీ కారు లాంచ్.. 15 మంది అదృష్టవంతులకే లభ్యం
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Embed widget