అన్వేషించండి

CM Jagan On Survey : భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ఏర్పాట్లు - సీఎం జగన్ ప్రకటించిన నిర్ణయం ఇదే

ఏపీలో శాశ్వత భూవివాద పరిష్కారానికి ట్రైబ్యూనళ్లు పని చేయనున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

CM Jagan On Survey :   భూ వివాదాల పరిష్కారం కోసం మరో కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రక‌టించారు. జ‌గనన్న భూ రక్ష, భూ హక్కు కింద సమగ్ర సర్వే ముగిశాక కూడా ట్రైబ్యునళ్లు కొనసాగనున్నట్టు ప్రకటించారు. ప్రతి మండల కేంద్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ ట్రైబ్యునల్స్ శాశ్వత ప్రాతిపదికన పని చేయనున్నాయి. సమగ్ర సర్వేపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ ఈ ఆదేశాలు ఇచ్చారు.

సమగ్ర సర్వే ముగిశాక కూడా ట్రైబ్యునళ్లు కొనసాగింపు ! 

సర్వే సందర్భంగా కూడా తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలని అందుకే ట్రైబ్యునల్‌ వ్యవస్థ తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు సీఎం జగన్. మొబైల్‌ ట్రైబ్యునల్‌ యూనిట్లు ఉండాలన్న సీఎం... దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. భూ వివాదాల పరిష్కారంపై రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థ ఉండాలన్నారు. అందుకే శాశ్వత ప్రాతిపదికన ప్రతి మండల కేంద్రంలో కూడా భూ వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల న్యాయ సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కారమవుతాయని... హక్కులు పొందే వీలుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సర్వే ప్రక్రియలో నాణ్యత  చాలా ముఖ్యమని స్పష్టం !

వివాదాల్లో ఉండి ఏళ్ల తరబడి హక్కులు పొందలేని పరిస్థితి ఉండకూడదన్నారు సీఎం జగన్. సర్వే సందర్భంగా ప్రభుత్వంతో వివాదాలు, వ్యక్తిగత వివాదాలు గుర్తించాలని సూచించారు. సర్వే నంబర్ల జాబితాలో ఈ వివాదాలను కూడా పేర్కొనాలన్నారు. దీని వల్ల స్థలం కొనుగోలుదార్లకు ప్లేస్‌ లీగల్‌గా క్లియర్‌గా ఉందా? లేదా? అన్నది తెలుస్తుందని వివరించారు. అదే సమయంలో ఆ వివాదాలను పరిష్కరించే ప్రయత్నం కూడా సమాంతరంగా జరగాలని తెలిపారు. సర్వే ప్రక్రియలో నాణ్యత అనేది చాలా ముఖ్యమని స్పష్టం చేశారు సీఎం. వివాదాల పరిష్కారంలో కూడా అలాంటి క్వాలిటీతో కూడిన ప్రక్రియ ఉండాల‌న్నారు. 

అవినీతి అవకాశం లేకుంగా సమగ్ర సర్వే ! 

సమగ్ర సర్వే సందర్భంగా వచ్చే అప్పీళ్లపై థర్డ్‌పార్టీ పర్యవేక్షణ కూడా ఉండాలన్న సీఎం... దీనివల్ల హక్కుదారులకు ఎలాంటి నష్టం జరగకూడదని సూచించారు. తప్పులకు పాల్పడే సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. థర్డ్‌పార్టీ పర్యవేక్షణ వల్ల పక్షపాతం, వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని సిబ్బందిలో కూడా జవాబుదారితనం మెరుగుపడుతుందన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి  తమ భూమిలో సర్వే కావాలని దరఖాస్తు చేసుకుంటే... కచ్చితంగా సర్వే చేయాలి, నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే... సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం ఆదేశించారు. 

వచ్చే ఏడాది డిసెంబర్‌కు సమగ్ర సర్వే పూర్తి !

ఇక సర్వేలో ఏరియల్‌ ఫ్లయింగ్, డ్రోన్‌ ఫ్లయింగ్‌ నెలవారీ లక్ష్యాలను పెంచాలన్నారు. నెలకు వేయి గ్రామాలను చొప్పున ఇప్పుడు చేస్తున్నామన్న అధికారులు... ఈ లక్ష్యాన్ని పెంచాలని సూచించారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కూడా సర్వేను వేగవంతం చేయాలన్నారు. 2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి సమగ్ర సర్వేను పూర్తి చేస్తామన్న అధికారులు... సమగ్ర సర్వే ప్రక్రియ సమర్థవంతంగా సాగడానికి ప్రఖ్యాత లీగల్‌ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. దీనివల్ల క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget