అన్వేషించండి

Teacher MLC Elections: అంతన్నారింతన్నారు! చివరకు ఆయనకే జై కొట్టారు - ఎందుకిలా?

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను విజయం వరించింది. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ టీచర్స్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. పీఆర్సీ విషయంలో మోసం చేశారని, సీపీఎస్ రద్దు హామీ నిలబెట్టుకోలేదని, చివరకు తమకు రావాల్సిన బకాయిలు కూడా సకాలంలో విడుదల చేయడంలేదంటూ ఉపాధ్యాయులు ఉద్యోగులు గొడవ గొడవ చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనే వార్తలు వస్తున్నాయి. కానీ అదంతా వట్టిదేనని తేలిపోయింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను విజయం వరించింది. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ టీచర్స్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.Teacher MLC Elections: అంతన్నారింతన్నారు! చివరకు ఆయనకే జై కొట్టారు - ఎందుకిలా?

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలంటే సహజంగా పీడీఎఫ్ కి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పీడీఎఫ్ అభ్యర్థులకే మద్దతిచ్చింది. అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ స్థానాలు ఎందుకు వదిలేయాలనే ఆలోచన జగన్ కి వచ్చింది. తీవ్ర తర్జన భర్జనల అనంతరం వైసీపీ తరపున అధికారికంగా అభ్యర్థులను నిలబెట్టారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోకి వచ్చే తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టారు. అప్పటికే ఆయన రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్నారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థల అధినేతగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఆయనకు మంచి పేరుంది. అదే ఇప్పుడు వైసీపీకి కలిసొచ్చింది. పీడీఎఫ్ అభ్యర్థి బాబురెడ్డిపై ఆయన గెలుపొందారు.

పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో

ఎం.వి రామచంద్రారెడ్డి వైసీపీ తరపున బరిలో దిగి.. పీడీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై 165 ఓట్లతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోవడంతో, ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 169 ఓట్ల తేడాతో ఎం.వి.రామచంద్రారెడ్డి గెలిచినట్లుగా ప్రకటించారు. ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి 10,618 ఓట్లు రాగా, ఎం.వి.రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు వచ్చాయి.

ప్రభుత్వంపై టీచర్లలో వ్యతిరేకత లేదా..?

వైసీపీ ప్రభుత్వంపై టీచర్లలో తీవ్ర వ్యతిరేకత ఉంది అనే ప్రచారం మాత్రం ఏపీలో ఉంది. దానికి తగ్గట్టే ఉద్యోగ సంఘాల నిరసనల్లో ప్రభుత్వ టీచర్లే ముందువరుసలో ఉంటారు. సీపీఎస్ రద్దుకోసం చేసిన పోరాటంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులే చురుగ్గా పాల్గొన్నారు. వేషాలు మార్చుకుని మరీ విజయవాడ వెళ్లి తమ సత్తా చాటారు. అలాంటి టీచర్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఓటుతో తమ తీర్పు ఇచ్చే సందర్భంలో వైసీపీకి అండగా నిలిచారు. అంటే ఇకపై ఉద్యమాలు చేసినా, ఆందోళనల్లో పాల్గొన్నా.. చివరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు టీచర్లు ఊ కొట్టాల్సిందేనని తేలిపోయింది. ప్రభుత్వ టీచర్ల మద్దతు కూడా తమకే ఉందని వైసీపీ నేతలు కచ్చితంగా చెప్పుకునే పరిస్థితి కనపడుతోంది.

ప్రైవేట్ టీచర్ల ఓట్లు కీలకంగా మారాయా..?

పూర్తిగా ప్రభుత్వ టీచర్లకే ఈ ఎన్నికల్లో ఓట్లు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. ఈదఫా ప్రైవేట్ టీచర్లకు కూడా ఓటు హక్కు రావడంతో ఆ ఓట్లన్నీ గుంపగుత్తగా వైసీపీకే పడ్డాయని అంటున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలన్నిటితో.. ఆయా అభ్యర్థులకు సత్సంబంధాలు ఉండటం, ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలతో వైసీపీ అభ్యర్థులు 6నెలల ముందునుంచీ వ్యూహ రచన చేయడంతో వారికి విజయం సునాయాసంగా దక్కింది. మెజార్టీ సంగతి పక్కనపెడితే.. పీడీఎఫ్ అభ్యర్థులకు ఆనవాయితీగా వస్తున్న విజయాన్ని వైసీపీ కొల్లగొట్టింది. టీచర్ ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ వ్యూహం పక్కాగా ఫలించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chief Minister Chandrababu Naidu: బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget