అన్వేషించండి

AP Blank Gos Ragada : ఏపీలో 'బ్లాంక్ జీవో"ల గొడవ ! ప్రభుత్వ రహస్య పాలన సాగిస్తోందా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్షం టీడీపీ కొత్త ఆరోపణలు చేస్తోంది. ఏ వివరాలు లేకుండా బ్లాంక్ జీవోలు విడుదల చేసి రహస్య పాలన చేస్తోందని విమర్శిస్తోంది.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వివాదం ప్రారంభమయింది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇదంతా  "బ్లాంక్ జీవో"ల వ్యవహారం గురించి. ఇప్పటి వరకూ అందరూ కాన్ఫిడెన్షియల్ జీవోల గురించి మాత్రమే విని ఉంటారు. కానీ ఏపీ ప్రభుత్వం కొత్తగా బ్లాంక్ జీవోల పద్దతి తీసుకు వచ్చింది. గత వారం రోజుల్లో ఇలాంటి జీవోలు దాదాపుగా 50 రిలీజయ్యాయని తెలుగుదేశం పార్టీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

భారీగా బ్లాంక్ జీవోలు విడుదల..!

సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలన్నింటినీ ప్రజలకు తెలిసేలా  జీవోలను అందుబాటులో ఉంచుతారు. ఇందు కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ కూడా నిర్వహిస్తున్నారు. https://goir.ap.gov.in/ వెబ్‌సైట్‌లో జీవోలను అందుబాటులో ఉంచుతారు.ప్రజలు చూసుకోవచ్చు. అయితే గత వారం రోజుల్లో దాదాపుగా యాభై జీవోలను ఇలా ఈ వెబ్‌సైట్‌లో పెట్టారు కానీ.. వాటి విరవాలేమీ లేవు. ఏ డిపార్టుమెంట్ నుంచి రిలీజ్ అయ్యాయో తెలుస్తుంది. జీవో నెంబర్ కూడా ఉంటుంది. కానీ అది అసలు దేనికి సంబంధించినది..అనే వివరాలు మాత్రం ఉండవు. అసలు జీవో కాపీనే ఉండదు. గతంలో కాన్ఫిడెన్షియల్ పేరుతో కొన్ని జీవోలను రహస్యంగా ఉంచేవారు. రాజకీయంగా వివాదాస్పదం అవుతాయి అనుకున్న వాటిని అలా కాన్ఫిడెన్షియల్‌గా పెట్టి... ఆ నిర్ణయాలను అమలు చేసిన తర్వాత బహిరంగపరిచేవారు. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్షియల్ పద్దతికి మరింత వాల్యూ యాడ్ చేసినట్లుగా బ్లాంక్ జీవోల పద్దతి తీసుకు వచ్చారు. అంటే జీవో నెంబర్ మాత్రం ఉంటుందిజీవో ఉండదన్నమాట.
 
నిర్ణయాలన్నీ ప్రజల ముందు ఉంచారని కోర్టులు, కేంద్రం ఆదేశాలు..!

కాన్ఫిడెన్షియల్ జీవోల విషయంలోనే గతంలో హైకోర్టులు ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏ ప్రభుత్వమైనా.. తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల ముందు ఉంచాలని… కోర్టులు చెబుతున్నాయి. కొన్నాళ్ల  కిందట.. కేంద్ర ప్రభుత్వం కూడా.. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి రహస్య జీవోలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ.. రహస్యాలు ఉండకూడదని..జీవోలు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని ఆదేశించింది. తెలంగాణలోనూ ఇలాంటి రహస్య జీవోలు భారీగా ఉండటంతో.. పేరాల శేఖర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే జీవోల విషయంలో పారదర్శకత ఉండాలని, రహస్య జీవోలు చెల్లవని వాటన్నిటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ ఆదేశాలు అన్ని ప్రభుత్వాలకూ వర్తిస్తాయి. కానీ ఏపీ సర్కార్ మాత్రం… రహస్య జీవోల్లో కొత్త దారులు వెదికింది. తాజాగా బ్లాంక్ జీవోల బాట పట్టింది. 

బ్లాంక్ జీవోల పద్దతిపై గవర్నర్‌ కూడా ఆశ్చర్యపోయారన్న టీడీపీ..!

సాధారణంగా ప్రభుత్వ వ్యవహారాలన్నీ గవర్నర్ పేరు మీదుగా నడుస్తాయి. గవర్నర్ రాజ్యాంగాధిపతి. ఈ  బ్లాంక్ జీవోల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది.  తాము చేసిన ఫిర్యాదులు...  ప్రభుత్వం తీరును  చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారని టీడీపీ నేతలు ప్రకటించారు. అసలు బ్లాంక్ జీవోల మాట తానెప్పుడూ వినలేదని ఆయన అన్నట్లుగా టీడీపీ నేత వర్ల రామయ్య ప్రకటించారు. అయితే ఈ అంశంపై గవర్నర్ ..ప్రభుత్వాన్ని వివరణ కోరారో లేదో స్పష్టత లేదు. కానీ టీడీపీ మాత్రం రాజ్యాంగ పరంగా ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేయాలి కాబట్టి చేశామని.. తదుపరి న్యాయపోరాటం చేస్తామని అంటోంది. ఏపీ ప్రభుత్వం దారుణ ఉల్లంఘనలకు పాల్పడినా గవర్నర్ పట్టించుకోవడం లేదని ఇప్పటికే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ప్రతిపక్షం ఆరోపణలపై స్పందించని ఏపీ ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనేక రకాల రాజ్యాంగఉల్లంఘన ఆరోపణలు చేస్తోంది.  ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి అధికంగా అప్పులు తేవడం, తప్పుడు పద్దతుల్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, పీడీ ఖాతాల్లో రూ. 41వేల కోట్ల నిధులకు లెక్కలులేకపోవడం, కార్పొరేషన్ల అప్పులు ఇలా అన్ని వ్యవహారాల్లోనూ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. తాజాగా బ్లాంక్ జీవోల వ్యవహారంపై కూడా ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది. అయితే ఈ బ్లాంక్ జీవోల రగడపై ప్రభుత్వం మాత్రం ఇంత వరకూ అధికారికంగా స్పందించలేదు.  

 


AP Blank Gos Ragada : ఏపీలో 'బ్లాంక్ జీవో

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget