అన్వేషించండి

Crime News: నంద్యాల జిల్లాలో దారుణాలు - డబ్బుల కోసం విద్యార్థుల బట్టలు విప్పి దాడి, మరో చోట పాత కక్షలతో వృద్ధుని హత్య

Nandyal News: నంద్యాల జిల్లాలో దారుణాలు జరిగాయి. కొందరు దుండగులు ఇద్దరు విద్యార్థులపై డబ్బుల కోసం విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అటు, మహానంది మండలంలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Attacked On Students In Nandyal District: నంద్యాల జిల్లాలో (Nandyal District) దారుణాలు చోటు చేసుకున్నాయి. కొందరు దుండగులు డబ్బుల కోసం ఇద్దరు విద్యార్థుల బట్టలు విప్పి నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మరో చోట పాతకక్షలతో వృద్ధున్ని దారుణంగా హతమార్చారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1న ఎస్‌డీఆర్ పాఠశాల ఛైర్మన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వస్తోన్న ఓ ఇంటర్ విద్యార్థిపై.. సుబ్బయ్య, శంకర్, మరి కొంతమంది ఆకతాయిలు అడ్డగించి డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద లేవని చెప్పగా విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ క్రమంలో బాలుడు తనకు తెలిసిన బీటెక్ విద్యార్థి లోకేశ్వరరెడ్డికి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. అతను అక్కడికి రాగా అతనిపైనా దాడికి పాల్పడ్డారు. లోకేశ్వరరెడ్డి దుస్తులు విప్పి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. అతని ఛాతీపై కూర్చుని తీవ్రంగా దాడి చేశారు.

చెవి కొరికేశారు

అనంతరం లోకేశ్వరరెడ్డి చెవి కొరికి తీవ్రంగా గాయపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, దాడి జరిగిన రోజు నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు వాపోయారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, పాఠశాల సమీపంలోనే ఈ దాడి జరగ్గా.. స్కూల్ యాజమాన్యమే కేసు నమోదు చేయకుండా అడ్డుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. నిందితులు సుబ్బయ్య, శంకర్‌, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు నంద్యాల గ్రామీణ పోలీసులు తెలిపారు.

పాత కక్షలతో వృద్ధుని హత్య

అటు, మహానంది మండలంలోని సీతారామపురం గ్రామంలో పాతకక్షలతో ఓ వృద్ధున్ని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పసుపులేటి సుబ్బారాయుడు (68) అలియాస్ పెద్దన్న అనే వ్యక్తి ఇంటిపై శనివారం అర్ధరాత్రి దాదాపు 38 మంది దాడి చేసి కర్రలు, ఇనుప రాడ్లతో పెద్దన్నను కొట్టారు. అతని భార్య కళ్ల ముందే బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పసుపులేటి సుబ్బారాయుడు, జయనారపురెడ్డి పని చేసేవారు. ఏ పార్టీ మారాల్సి వచ్చినా ముగ్గురూ కలిసే మారేవారు. వీరు చెప్పిన పార్టీకే గ్రామస్థుల్లో అధిక శాతం ఓట్లేసేవారు. అయితే, ముగ్గురి మధ్య మూడేళ్ల కిందట ఆర్థిక విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో రెండు వర్గాలుగా చీలగా.. ఓటర్లు కూడా అలానే చీలిపోయారు. 

మొన్నటి ఎన్నికల ముందు శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో మెజార్టీ రాకపోవడం.. సుబ్బరాయుడు, జయనారపురెడ్డి తన వెంట రాకపోవడం వల్లే హవా తగ్గిందనే శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పాటే ఆర్థిక విభేదాలు, పాత కక్షలతో శ్రీనివాసరెడ్డి వర్గీయులు.. సుబ్బరాయుడు ఇంటిపై దాడి చేసి అతన్ని దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నంద్యాల ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా, ఏఎస్పీ ప్రవీణ్ కుమార్, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు గ్రామంలో పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
YS Sharmila: 25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
Sri Ramanavami Brahmotsavams: మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!
మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget