అన్వేషించండి

Vijayawada Floods: వరద మిగిల్చిన 'కన్నీటి' గాథలు - నలుగురిని కాపాడి మృత్యుఒడికి, వరద బాధితులను వెంటాడిన విషాదాలెన్నో!

Vijayawada News: విజయవాడ వరదలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఓ వ్యక్తి నలుగురిని కాపాడబోయి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం అందరినీ కలిచివేస్తోంది.

Severe Situations Due To Vijayawada Floods: కళ్ల ముందే నీటిలో మునిగిపోతున్న నలుగురిని కాపాడబోయిన ఓ వ్యక్తి.. కుటుంబం ఆకలి తీర్చేందుకు వెళ్లిన ఓ ఇంటి పెద్ద.. కొడుకు కోసం తాగునీరు తెచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇవీ విజయవాడలో (Vijayawada) వరద మిగిల్చిన విషాద గాథలు. బుడమేరు వాగు ఎందరి జీవితాలనో చిన్నాభిన్నం చేసింది. ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహం నగరంలోని ప్రాంతాలను ముంచేసింది. ఏం జరుగుతుందో తేరుకునే లోపే కొందరు మృత్యువాత పడగా.. మరికొందరు ఎలాగో తేరుకుని తమ ప్రాణాలు దక్కించుకున్నారు. భవనాల పైకెక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. గంటల కొద్దీ ఆహారం, నీరు లేక అలమటించారు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టడంతో బాధితులకు కాస్త ఉపశమనం లభించింది.

నలుగురిని కాపాడి..

విజయవాడ వరదల్లో (Vijayawada Floods) నలుగురిని కాపాడిన ఓ వ్యక్తి.. అనంతరం వరదలో కొట్టుకొకుపోతున్న 50 ఆవులను రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్(32)కు సింగ్ నగర్‌లో ఓ డెయిరీ ఫాం ఉండగా.. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు, మరో ఇద్దరు యువకులు డెయిరీ ఫాంలో పని చేస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద పోటెత్తగా.. నీటిలో కొట్టుకుపోతున్న సోదరులతో పాటు ఇద్దరు యువకులను కాపాడి డెయిరీ ఫాం పైకప్పు వద్దకు చేర్చాడు. అనంతరం తాళ్లతో కట్టి ఉంచిన ఆవులను రక్షించేందుకు వెళ్లి.. అవి ప్రాణాలతో ఉంటాయని భావించి తాళ్లు విడదీశాడు. ఆ తర్వాత ఈదుకుంటూ వచ్చి పైకప్పు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి కింద పడడంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. డెయిరీ ఫాంకు 500 మీటర్ల దూరంలో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. కాగా, ప్రస్తుతం చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భిణీ. తమను కాపాడి కళ్ల ముందే అన్న కొట్టుకుపోయాడంటూ సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు.

కొడుకు దాహం తీర్చాలని..

విజయవాడ రూరల్ మండలం అంబాపురంవాసి తగరం శ్యాంబాబు (50) వించిపేటలో ఓ చర్చి ఫాదర్‌గా పని చేస్తున్నారు. వరద ముంచెత్తడంతో అంబాపురం ఆరో లైనులోని శ్రీకర్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో కుటుంబ సభ్యులతో చిక్కుకుపోయారు. ఆదివారం నుంచి తాగునీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుమారుడు దాహంగా ఉందనడంతో చలించిన తండ్రి తాగునీటి కోసం సోమవారం బయటకు వచ్చి నీటిలో మునిగిపోయారు. మంగళవారం అతని మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

అటు, విజయవాడ రాజీవ్ నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి కుప్పల దుర్గారావు ఆదివారం ఉదయం బుడమేరు వద్ద ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి వరద ముంచెత్తడంతో రెండు గంటలు అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉంటే వరద పెరిగిపోతుందని భావించి ఎలాగైనా ఇంటికి వెళ్లిపోవాలని భావించి బయటకు రాగా ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. మంగళవారం కుమారుడి మృతదేహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అలాగే, పాయకాపురం ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ఆటో డ్రైవర్ కట్టా సారంగం (22) కుటుంబం నివసిస్తోంది. బుడమేరు వరదలో పూర్తిగా ఇల్లు నీట మునగగా.. ఆదివారం నుంచి ఆహారం లేక అలమటించారు. సోమవారం సమీపంలో ఆహార పొట్లాలు అందిస్తున్నారని తెలిసి బయటకొచ్చాడు. వరద తీవ్రతకు నీటిలో మునిగిపోయాడు. మంగళవారం మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, రాష్ట్రంలో వరదల కారణంగా 32 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు. 

Also Read: Vijayawada Floods: 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు - రేపటి నుంచి పంపిణీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల, ఏమేం ఇస్తారంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati High Alert: అమరావతిలో హై అలర్ట్‌! ఆరు చెక్‌పోస్టు, డ్రోన్లతో భద్రత కట్టుదిట్టం! అసలేం జరిగిందంటే?
అమరావతిలో హై అలర్ట్‌! ఆరు చెక్‌పోస్టు, డ్రోన్లతో భద్రత కట్టుదిట్టం! అసలేం జరిగిందంటే?
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు
అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు
AP Coaching Institutions Rules 2026: ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
Peddi Release Date : రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
రామ్ చరణ్ పెద్ది మళ్లీ వాయిదా? - ఫ్యాన్స్ టెన్షన్‌కు క్లారిటీ ప్లీజ్
US Iran War: అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడికి షాకిచ్చిన నెతన్యాహు.. ఇరాన్‌‌లో గ్రౌండ్ ఆపరేషన్‌తో సంబంధం లేదన్న ఇజ్రాయెల్
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
AP Coaching Institutions Rules 2026: ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
ఏపీలో కోచింగ్ సెంటర్ల ఆగడాలకు చెక్ … ఇష్టారాజ్యం కుదరదు.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Embed widget