అన్వేషించండి

Vijayawada Floods: వరద మిగిల్చిన 'కన్నీటి' గాథలు - నలుగురిని కాపాడి మృత్యుఒడికి, వరద బాధితులను వెంటాడిన విషాదాలెన్నో!

Vijayawada News: విజయవాడ వరదలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఓ వ్యక్తి నలుగురిని కాపాడబోయి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం అందరినీ కలిచివేస్తోంది.

Severe Situations Due To Vijayawada Floods: కళ్ల ముందే నీటిలో మునిగిపోతున్న నలుగురిని కాపాడబోయిన ఓ వ్యక్తి.. కుటుంబం ఆకలి తీర్చేందుకు వెళ్లిన ఓ ఇంటి పెద్ద.. కొడుకు కోసం తాగునీరు తెచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇవీ విజయవాడలో (Vijayawada) వరద మిగిల్చిన విషాద గాథలు. బుడమేరు వాగు ఎందరి జీవితాలనో చిన్నాభిన్నం చేసింది. ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహం నగరంలోని ప్రాంతాలను ముంచేసింది. ఏం జరుగుతుందో తేరుకునే లోపే కొందరు మృత్యువాత పడగా.. మరికొందరు ఎలాగో తేరుకుని తమ ప్రాణాలు దక్కించుకున్నారు. భవనాల పైకెక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. గంటల కొద్దీ ఆహారం, నీరు లేక అలమటించారు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టడంతో బాధితులకు కాస్త ఉపశమనం లభించింది.

నలుగురిని కాపాడి..

విజయవాడ వరదల్లో (Vijayawada Floods) నలుగురిని కాపాడిన ఓ వ్యక్తి.. అనంతరం వరదలో కొట్టుకొకుపోతున్న 50 ఆవులను రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్(32)కు సింగ్ నగర్‌లో ఓ డెయిరీ ఫాం ఉండగా.. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు, మరో ఇద్దరు యువకులు డెయిరీ ఫాంలో పని చేస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద పోటెత్తగా.. నీటిలో కొట్టుకుపోతున్న సోదరులతో పాటు ఇద్దరు యువకులను కాపాడి డెయిరీ ఫాం పైకప్పు వద్దకు చేర్చాడు. అనంతరం తాళ్లతో కట్టి ఉంచిన ఆవులను రక్షించేందుకు వెళ్లి.. అవి ప్రాణాలతో ఉంటాయని భావించి తాళ్లు విడదీశాడు. ఆ తర్వాత ఈదుకుంటూ వచ్చి పైకప్పు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి కింద పడడంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. డెయిరీ ఫాంకు 500 మీటర్ల దూరంలో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. కాగా, ప్రస్తుతం చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భిణీ. తమను కాపాడి కళ్ల ముందే అన్న కొట్టుకుపోయాడంటూ సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు.

కొడుకు దాహం తీర్చాలని..

విజయవాడ రూరల్ మండలం అంబాపురంవాసి తగరం శ్యాంబాబు (50) వించిపేటలో ఓ చర్చి ఫాదర్‌గా పని చేస్తున్నారు. వరద ముంచెత్తడంతో అంబాపురం ఆరో లైనులోని శ్రీకర్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో కుటుంబ సభ్యులతో చిక్కుకుపోయారు. ఆదివారం నుంచి తాగునీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుమారుడు దాహంగా ఉందనడంతో చలించిన తండ్రి తాగునీటి కోసం సోమవారం బయటకు వచ్చి నీటిలో మునిగిపోయారు. మంగళవారం అతని మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

అటు, విజయవాడ రాజీవ్ నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి కుప్పల దుర్గారావు ఆదివారం ఉదయం బుడమేరు వద్ద ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి వరద ముంచెత్తడంతో రెండు గంటలు అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉంటే వరద పెరిగిపోతుందని భావించి ఎలాగైనా ఇంటికి వెళ్లిపోవాలని భావించి బయటకు రాగా ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. మంగళవారం కుమారుడి మృతదేహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అలాగే, పాయకాపురం ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ఆటో డ్రైవర్ కట్టా సారంగం (22) కుటుంబం నివసిస్తోంది. బుడమేరు వరదలో పూర్తిగా ఇల్లు నీట మునగగా.. ఆదివారం నుంచి ఆహారం లేక అలమటించారు. సోమవారం సమీపంలో ఆహార పొట్లాలు అందిస్తున్నారని తెలిసి బయటకొచ్చాడు. వరద తీవ్రతకు నీటిలో మునిగిపోయాడు. మంగళవారం మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, రాష్ట్రంలో వరదల కారణంగా 32 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు. 

Also Read: Vijayawada Floods: 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు - రేపటి నుంచి పంపిణీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల, ఏమేం ఇస్తారంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
YS Sharmila: 25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
Sri Ramanavami Brahmotsavams: మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!
మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Embed widget