అన్వేషించండి

Vijayawada Floods: 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు - రేపటి నుంచి పంపిణీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల, ఏమేం ఇస్తారంటే?

Vijayawada News: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం నుంచి నిత్యావసర కిట్లు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డు లేని వారి ఆధార్ లేదా బయోమెట్రిక్ ద్వారా ఇస్తామన్నారు.

Essential Kits Distributed In Vijayawada Floods: వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నగరంలో కొన్ని ప్రాంతాలు ముంపు నుంచి బయటపడగా.. మరికొన్ని చోట్ల ఇంకా వరద తగ్గలేదు. వరద తగ్గిన ప్రాంతాల్లో నిత్యావసరాలు (Essential Kits) అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అటు, పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 6) నుంచి నిత్యావసర కిట్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, లీటర్ వంటనూనెతో కూడిన కిట్లను బాధితులకు అందిస్తామన్నారు. '2 లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ పోస్ మిషన్ ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుంది. తొలి రోజు 50 వేల కుటుంబాలకు కిట్లు పంపిణీ చేస్తాం. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా లేదా బయోమెట్రిక్ ఆధారంగా కిట్లు పంపిణీ చేస్తాం. గ్యాస్ కంపెనీలు కూడా సేవ చేసేందుకు ముందుకు వచ్చాయి. ముంపు ప్రాంతాల్లో 12 గ్యాస్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.' అని మంత్రి తెలిపారు. 

మరోవైపు, నగరంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే వరద నుంచి బయటపడగా మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. బురదతో నిండిపోయిన రహదారులు, ఇళ్లు, షాపుల్లో ఫైరింజన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. దాదాపు 2 వేల మంది సిబ్బంది పారశుద్ధ్య చర్యల్లో నిమగ్నమయ్యారు. అటు, ముంపు తగ్గిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. చెత్తా చెదారాన్ని తొలగిస్తూ బ్లీచింగ్ చల్లుతున్నారు. గురువారం రాత్రి నుంచి మళ్లీ వర్షం పడుతున్న క్రమంలో నగరవాసుల్లో మళ్లీ భయాందోళన నెలకొంది.

మరోసారి సీఎం పర్యటన

నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి సీఎం చంద్రబాబు (CM Chandrababu) పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి ముంపు ప్రాంతాల్లో పంటుపై వెళ్లి పరిశీలించారు. కేసరపల్లి వద్ద బుడమేరు కాల్వపై వరద ఉద్ధృతిని పరిశీలించారు. గండ్లు పడిన చోట చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. పంట నష్టం వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడకు మరోసారి ఇలాంటి విపత్తు లేకుండా చర్యలు చేపడతామని అన్నారు. బుడమేరు కాల్వ ప్రక్షాళన చేపడతామని.. గతంలోనే కాల్వ ఆధునీకరణకు నిధులు కూడా కేటాయించామని చెప్పారు.

మరోవైపు, బుడమేరు వాగుకు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో మళ్లీ ఆందోళన నెలకొంది. జక్కంపూడి, వైఎస్సార్ కాలనీ, పైపుల రోడ్డు ఇతర ప్రాంతాలు జలమయం కాగా.. బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సుకు సైతం వరద ఉద్ధృతి పెరిగింది. చిన్నఎడ్లగాడి, పెదఎడ్లగాడి పరిసర ప్రాంతాలతో పాటు ఏలూరు - కైకలూరు రహదారిపైకి వరద నీరు చేరింది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Also Read: CM Chandrababu: బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన - బల్లకట్టుపై ఏలూరు కాలువ దాటి పరిశీలన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Embed widget