అన్వేషించండి

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

Mla Rapaka : తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని రాజోలులో ఉన్నానని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ చెప్పారు. ఎప్పుడో జరిగిన విషయాన్ని చెబితే నా మాటలు వక్రీకరించారన్నారు.

Mla Rapaka : ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగిన నాటి మాటలను ఓ కార్యక్రమంలో చెప్పితే దాన్ని వక్రీకరించారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎస్సీల్లో ఎక్కువ శాతం వైసీపీకు పనిచేశారని, చింతలపల్లిలో ఆత్మీయ సమావేశం పెట్టడం వెనుక కారణం బంతు రాజేశ్వరరావు జనసేనకు వెళ్లడం వల్ల అక్కడి వారంతా నావెంటే ఉంటామని చెప్పడంతోనేనన్నారు. అదికూడా వాళ్లు వేయించానని చెప్పిన విషయాన్ని ఆ సభలో నవ్వుకోవడానికే చెప్పాను కానీ తాను దొంగ ఓట్లతో నెగ్గానని తాను అనలేదని చెప్పుకొచ్చారు. నేను సమావేశంలో పాల్గొన్న ప్రాంతంలోని ఎస్సీలు 2019లో నాకు కోసం పని చేయలేదని, నాకు జనసైనికులు పనిచేసి గెలిపించారని తెలిపారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, రాజోలు నియోజకవర్గంలోనే గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని, ఆ ఫోన్ తరువాత సైలెంట్‌లో పెట్టి రెస్ట్‌ తీసుకున్నానని, అయితే ఈలోపు అజ్ఞాతంలో రాపాక అంటూ ప్రచారం జరిగిందన్నారు.  ఫిబ్రవరి 28న రాజోలు నియోజకవర్గం చింతలపల్లిలో ఎమ్మెల్యే రాపాక ఆత్మీయ సమావేశంలో దొంగ ఓట్లుతో గెలిచానని చెప్పిన మాటలు సోషల్‌ మీడియాతోపాటు అన్ని మీడియా సంస్థల్లో హల్‌చల్‌ చేయడంతో ఆయన వివరణ ఇచ్చారు.

రాజేశ్వరరావు చేతకాని వాడు 

రాష్ట్రంలో వైసీపీ గాలితో 151 సీట్లు గెలిస్తే రాజోలులో మాత్రం బంతు రాజేశ్వరరావు ఓడిపోయాడని, ఆయన చేతకానివాడు కాబట్టే వైసీపీకి పట్టున్న నియోజకవర్గంలో ఓడిపోయాడన్నారు రాపాక. ఆయన పేటలో ఉన్నా ఒకటే కోటలో ఉన్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. నీ కార్యకర్తలకు నీమీద నమ్మకం లేదు గనుకే 2019లో ఓడిపోయావని, తన గురించి మాట్లాడే స్థాయి రాజేశ్వరరావుకు లేదన్నారు.

జనసైనికుల ఓట్లతోనే గెలిచాను

2019 ఎన్నికల్లో తాను గెలిచింది జనసైనికుల మేజర్‌ ఓట్ల వల్లే గెలిచానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. జనసేన కార్యకర్తలు నాపై ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, ఏమైనా అవసరముంటే టీడీపీకు ఉందని, ఎందుకంటే తనను టీడీపీ వాళ్లే ఓటు వేయాలని కోరారని చెప్పినందుకు అన్నారు. 

"ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన వాటిని చెప్పాను. ఇప్పుడు దొంగఓట్లు వేశానని చెప్పాలేదు. నా మాటలు వక్రీకరించారు. ఎస్సీల్లో ఎక్కువ మంది వైసీపీకి ఓటు వేశారు. గతంలో వీళ్లు బొంతు రాజేశ్వరరావు వెంట ఉన్నారు. ఇప్పుడు ఆయన జనసేనకు వెళ్లారు. కాబట్టి వాళ్లంతా ఇప్పుడు మీ వెంట ఉంటామని నాకు హామీ ఇచ్చారు. అందుకే అక్కడే ఆత్మీయ సమ్మేళనం పెట్టాం. అందరు నువ్వుకుంటారని ఆ మాటలు అన్నారు. జనసైనికులు కూడా ఆందోళన చేయాల్సిన అవసరంలేదు. టీడీపీ వాళ్లు వచ్చి వాళ్లకు మద్దతుగా ఓటు వెళ్లమన్నారు. రాజేశ్వరరావు చేతకాని వాడు. వైసీపీ గాలి వీస్తున్న సమయంలో బంతు రాజేశ్వరరావు ఓడిపోయాడు. వైసీపీ పట్టున్న నియోజకవర్గంలో రాజేశ్వరరావు ఓడిపోయాడు. ఆ రోజు జనసైనికులు నా వెంట ఉన్నారు కాబట్టి గెలిచాను."- ఎమ్మెల్యే రాపాక  

వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనంలో రాపాక ఏమన్నారంటే? 

రాజోలు ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాదరావు ఆ సమ్మేళనంలో మాట్లాడుతూ.. పూర్వం నుంచి తమ గ్రామం చింతలమోరికి ఓ బ్యాచ్ దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారని చెప్పారు. ఆ ఓట్లతో తన విజయానికి వారు సహకరించేవారని బహిరంగంగా చెప్పారు. 15 నుంచి 20 మంది వచ్చి, ఒక్కొక్కరూ 5 నుంచి 10కి పైగా ఓట్లు వేసేవారని ఆయన చెప్పడం విస్మయం కలిగించింది. దీంతో తనకు 800 పైనే మెజారిటీ వచ్చిందని వివరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Embed widget