అన్వేషించండి

Kapu Garjana cases : ఆ రెండు కేసులు మినహా కాపు గ‌ర్జ‌న కేసులన్నీ ఎత్తేసిన రైల్వే శాఖ‌

కాపు గ‌ర్జ‌న కేసులు ఎత్తేసిన రైల్వే శాఖ‌..అయితే ఆ రెండు కేసులు ఎత్తేయ‌మ‌ని.. మాత్రం ఎపీ స‌ర్కార్ కోర‌లేద‌న్న కేంద్ర రైల్వే మంత్రి.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి కాపు గ‌ర్జ‌న రైల్వే ఆస్తుల ద‌హ‌నం కేసులో కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రైల్వే ఆస్తుల ధ్వంసంపై న‌మోదైన ఐదు కేసుల‌ను ఎత్తేశామ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. మరో రెండు కేసులుపై ఏపీ స‌ర్కారు లిఖిత పూర్వ‌కంగా స్ప‌ష్టత ఇవ్వ‌క‌పోవ‌టంతో అవి ఇంకా కొనసాగుతున్నాయి. వాటిపై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వెల్ల‌డించారు.

2016లో సంఘటన 

కాపు నేతలపై కేసుల ఉపసంహరణపై బీజేపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు వేసిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. 2016లో తూర్పుగోదావరి జిల్లాలో తునిలో జరిగిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌పై హింస, విధ్వంస ఘటనల్లో కాపుగర్జన నేతలపై కేసులు నమోదయ్యాయి. పార్లమెంట్‌లో బిజెపి ఎంపి జీవీఎల్ ఈ కేసులు, వాటి స్థితిగతులు, ముగింపు కాకపోవడానికి కారణాలను రైల్వే మంత్రిని అడిగారు. రైల్వే మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పూర్తి వివరాలు అందజేశారు.

ఐదు కేసులు ఉపసంహరణ

కాపు గర్జన టైంలో నేతలపై రైల్వే శాఖ పెట్టిన ఐదు కేసులను ఉపసంహరించుకున్నట్లు రైల్వేశాఖ మంత్రి తెలిపారు. రైల్వే శాఖ వేసిన మరో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP), తుని బేరింగ్ నంబర్ 17/2016 దాఖలు చేసిన కేసు రాజమండ్రిలోని CBCIDలో విచారణలో ఉంది. 1.02.2016 నాటి మరో కేసు నం. 77/2016 విజయవాడలోని రైల్వే అదనపు మేజిస్ట్రేట్ VIIలో విచారణ దశలో ఉందని మంత్రి వివరించారు.

రెండు కేసులు పెండింగ్

ఈ విషయంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ రైల్వే పోలీసులు నమోదు చేసిన ఐదు కేసులను ఉపసంహరించుకున్నందుకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు రైల్వే మంత్రికి లేఖ రాశారు. రైల్వేలో పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను ఉపసంహరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదని రాలేదని మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావించారు. రైల్వే మంత్రిత్వ శాఖతో సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అంతే కాదు మిగిలిన రెండు కేసుల‌ను ఉప‌స‌హ‌రించుకునేందుకు అవ‌స‌రమైన చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరుతూ రైల్వే మంత్రికి జీవీఎల్ లేఖ రాశారు.

ఆ రెండూ ఉపసంహరించుకోవాలన్న జీవీఎల్

రైల్వే ఆస్తులకు నష్టం, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టడం కాపుగర్జన మహాసభ నాయకులు, సభ్యులు చేసినవి కావని, నేరస్థుల చర్యలే కార‌ణ‌మ‌ని జీవిఎల్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. జ‌రిగే ఆందోళనకు దాని నాయకులకు చెడ్డ పేరు తేవడానికి చేసిన చర్యలేనని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలుసని అన్నారు. ఈ కేసుల్లో వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న కాపు నేతలు గత ఆరేళ్లలో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని వెల్ల‌డించారు. కేసు నెం.17/2016, 77/2016లను ఉపసంహరించుకోవాలని లేదా అవసరమైతే ట్రయల్ కోర్టులో మూసివేత నివేదికను దాఖలు చేయాలన్నారు. శాంతియుత ఆందోళనలకు నాయకత్వం వహించిన కాపు నాయకులకు ఉపశమనం కలిగించాలని జీవీఎల్ నరసింహారావు త‌న లేఖ‌లో కేంద్ర రైల్వే మంత్రిని కోరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
US Iran War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగిస్తాం.. మాకు ఏ డీల్ అవసరం లేదు: డొనాల్డ్ ట్రంప్
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Embed widget