అన్వేషించండి

Kapu Garjana cases : ఆ రెండు కేసులు మినహా కాపు గ‌ర్జ‌న కేసులన్నీ ఎత్తేసిన రైల్వే శాఖ‌

కాపు గ‌ర్జ‌న కేసులు ఎత్తేసిన రైల్వే శాఖ‌..అయితే ఆ రెండు కేసులు ఎత్తేయ‌మ‌ని.. మాత్రం ఎపీ స‌ర్కార్ కోర‌లేద‌న్న కేంద్ర రైల్వే మంత్రి.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి కాపు గ‌ర్జ‌న రైల్వే ఆస్తుల ద‌హ‌నం కేసులో కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రైల్వే ఆస్తుల ధ్వంసంపై న‌మోదైన ఐదు కేసుల‌ను ఎత్తేశామ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. మరో రెండు కేసులుపై ఏపీ స‌ర్కారు లిఖిత పూర్వ‌కంగా స్ప‌ష్టత ఇవ్వ‌క‌పోవ‌టంతో అవి ఇంకా కొనసాగుతున్నాయి. వాటిపై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వెల్ల‌డించారు.

2016లో సంఘటన 

కాపు నేతలపై కేసుల ఉపసంహరణపై బీజేపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు వేసిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. 2016లో తూర్పుగోదావరి జిల్లాలో తునిలో జరిగిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌పై హింస, విధ్వంస ఘటనల్లో కాపుగర్జన నేతలపై కేసులు నమోదయ్యాయి. పార్లమెంట్‌లో బిజెపి ఎంపి జీవీఎల్ ఈ కేసులు, వాటి స్థితిగతులు, ముగింపు కాకపోవడానికి కారణాలను రైల్వే మంత్రిని అడిగారు. రైల్వే మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పూర్తి వివరాలు అందజేశారు.

ఐదు కేసులు ఉపసంహరణ

కాపు గర్జన టైంలో నేతలపై రైల్వే శాఖ పెట్టిన ఐదు కేసులను ఉపసంహరించుకున్నట్లు రైల్వేశాఖ మంత్రి తెలిపారు. రైల్వే శాఖ వేసిన మరో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP), తుని బేరింగ్ నంబర్ 17/2016 దాఖలు చేసిన కేసు రాజమండ్రిలోని CBCIDలో విచారణలో ఉంది. 1.02.2016 నాటి మరో కేసు నం. 77/2016 విజయవాడలోని రైల్వే అదనపు మేజిస్ట్రేట్ VIIలో విచారణ దశలో ఉందని మంత్రి వివరించారు.

రెండు కేసులు పెండింగ్

ఈ విషయంపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ రైల్వే పోలీసులు నమోదు చేసిన ఐదు కేసులను ఉపసంహరించుకున్నందుకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు రైల్వే మంత్రికి లేఖ రాశారు. రైల్వేలో పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను ఉపసంహరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదని రాలేదని మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావించారు. రైల్వే మంత్రిత్వ శాఖతో సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అంతే కాదు మిగిలిన రెండు కేసుల‌ను ఉప‌స‌హ‌రించుకునేందుకు అవ‌స‌రమైన చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరుతూ రైల్వే మంత్రికి జీవీఎల్ లేఖ రాశారు.

ఆ రెండూ ఉపసంహరించుకోవాలన్న జీవీఎల్

రైల్వే ఆస్తులకు నష్టం, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టడం కాపుగర్జన మహాసభ నాయకులు, సభ్యులు చేసినవి కావని, నేరస్థుల చర్యలే కార‌ణ‌మ‌ని జీవిఎల్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. జ‌రిగే ఆందోళనకు దాని నాయకులకు చెడ్డ పేరు తేవడానికి చేసిన చర్యలేనని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలుసని అన్నారు. ఈ కేసుల్లో వివిధ సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న కాపు నేతలు గత ఆరేళ్లలో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని వెల్ల‌డించారు. కేసు నెం.17/2016, 77/2016లను ఉపసంహరించుకోవాలని లేదా అవసరమైతే ట్రయల్ కోర్టులో మూసివేత నివేదికను దాఖలు చేయాలన్నారు. శాంతియుత ఆందోళనలకు నాయకత్వం వహించిన కాపు నాయకులకు ఉపశమనం కలిగించాలని జీవీఎల్ నరసింహారావు త‌న లేఖ‌లో కేంద్ర రైల్వే మంత్రిని కోరారు.

టాప్ హెడ్ లైన్స్

Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Auto Start Stop Feature: ఆటో స్టార్ట్-స్టాప్ ఫీచర్‌తో ప్రతి నెలా ఎంత పెట్రోల్ ఆదా అవుతుంది? పూర్తి లెక్క ఇదే! 
ఆటో స్టార్ట్-స్టాప్ ఫీచర్‌తో ప్రతి నెలా ఎంత పెట్రోల్ ఆదా అవుతుంది? పూర్తి లెక్క ఇదే! 
హీరో Xoom 110 ధర, వేరియంట్లు, ఫీచర్లు - కొనే ముందే తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
హీరో Xoom 110 కొనాలని ఉత్సాహపడుతున్నారా? ఆ బండి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Jaggery and Roasted Chana : ఉదయాన్నే బెల్లం, వేయించిన శనగలు తింటే కలిగే లాభాలు ఇవే.. మధుమేహం ఉన్నవాళ్లు కూడా తినొచ్చు
ఉదయాన్నే బెల్లం, వేయించిన శనగలు తింటే కలిగే లాభాలు ఇవే.. మధుమేహం ఉన్నవాళ్లు కూడా తినొచ్చు
Embed widget