అన్వేషించండి

Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

Janasena: పవన్ కల్యాణ్ జనసేన ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశం అవుతున్నారు. వారి పనితీరుపై సమీక్షించి సూచనలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

Pawan Meets Jana Sena MLAs: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  ఎమ్మెల్యేలతో ముఖాముఖి  సమావేశాలు నిర్వహించారు. వారి పనితీరుపై అందిన నివేదికల ఆధారంగా సమీక్షించినట్లుగా తెలుస్తోంది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆయన ఈ సమీక్షలు చేపట్టినట్లు జనసేన వర్గాలుచెబుతున్నాయి. 

రోజంతా పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలకు పవన్ కల్యాణ్ ప్రాధాన్యం           

జనసేన పార్టీ శాసనసభ్యుల పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఉదయం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అవుతూ, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు.  ఒక్కో ఎమ్మెల్యేతో దాదాపు 30 నిమిషాలకు పైగా  సమయం గడుపుతూ, క్షేత్రస్థాయిలో అందుతున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా  పలు రకాల సమస్యలపై వారితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వారికున్న ఇమేజ్,   కూటమి పార్టీలతో సమన్వయంపై ముందస్తుగానే సమగ్ర రిపోర్ట్స్ తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికల ఆధారంగానే  ఎమ్మెల్యేలతో పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.           

ఎమ్మెల్యే పనితీరుపై సుదీర్ఘ సమీక్ష                     

నియోజకవర్గాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిని సమీక్షించారు.  పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే అంశంపై ఆరా తీశారు.  కూటమి పార్టీల నేతలతో సఖ్యత , స్థానిక సమస్యల పరిష్కారంపై ఎంతవరకు దృష్టి పెట్టారనేది ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఈ సమీక్షల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై  పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలోనే కొందరు నేతల వ్యవహారశైలిపై వచ్చిన ఫిర్యాదులను ఆయన తీవ్రంగా పరిగణించారు.         

కీలక సూచనలు చేసిన పవన్ - కొంత మంది ఎమ్మెల్యేల తీరుపై అసంతృృప్తి                  

 పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోకపోయినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. పనితీరు మెరుగుపరుచుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని పరోక్షంగా సంకేతాలిచ్చారని అంటున్నారు. మొదటగా మండలి బుద్ధప్రసాద్‌తో ప్రారంభమైన ఈ వన్ టు వన్ భేటీలు, ఆ తర్వాత దేవ వరప్రసాద్, లోకం నాగ మాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సీహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబు,  సుందరపు విజయ్ కుమార్‌లతో కొనసాగాయి. గెలిచిన వారందరూ కేవలం చట్టసభలకు పరిమితం కాకుండా, కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా జనంలో ఉండాలని పవన్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.                                      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Advertisement

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget