అన్వేషించండి

Nara Lokesh: 'జగన్ జమానాలో దళితులకు రక్షణ లేదు' - కంచికచర్ల ఘటనపై లోకేశ్ ఆగ్రహం

Nara Lokesh: సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

సీఎం జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకూ ఎంతో మంది దళిత బిడ్డలు బలయ్యారని, తాజాగా మరో దారుణం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేడ్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కొందరు దుండగులు నిర్భంధించారన్నారు. 4 గంటలు చిత్ర హింసలకు గురి చేశారని, దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్య సమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని ధ్వజమెత్తారు. 

'సీఎం జగన్ కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా, ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితున్ని అని వాపోవడం, జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట' అని లోకేశ్ ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు.

'సీఎం పదవికి జగన్ అనర్హుడు'

టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ తాజాగా ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. దీనిపైనా నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆ పదవికి అనర్హుడని, ఆయన మానసిక స్థితిపై కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపించాలని కోరారు. చంద్రబాబుపై కక్షతో రోజుకో తప్పుడు కేసు పెడుతున్నారని, జగన్ మానసిక స్థితిపై జనం చర్చించుకుంటున్నారని అన్నారు. కక్ష పూరితంగా వ్యవహరిస్తోన్న జగన్ తీరు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు. సీఐడీని వైసీపీ అనుబంధ విభాగంగా మార్చకుని ప్రతిపక్ష నేతలపై కేసుల మీద కేసులు పెట్టడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని లోకేశ్ మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సరైన పద్ధతి కాదని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ధ్వజమెత్తారు.

'స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రూపాయి అవినీతీ జరగకపోయినా కేసు బనాయించారు. ఈ రోజుకీ ఒక్క ఆధారం చూపించలేకపోయారు. వేయని రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారని ఓ కేసు, ఉచితంగా ఇసుక ఇస్తే అందులోనూ స్కామ్ అంటూ ఇప్పుడు మరో కేసు పెట్టారు. దేశంలోనే పేరు ప్రఖ్యాతలున్న ఫైబర్ నెట్ ప్రాజెక్టుపైనా కేసు పెట్టారు.' అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 

Also Read: రుషికొండలో నిర్మాణాలపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు - రాజకీయ కారణాలతో వేసినట్లుందని ఆగ్రహం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget