అన్వేషించండి

Nara Lokesh: 'జగన్ జమానాలో దళితులకు రక్షణ లేదు' - కంచికచర్ల ఘటనపై లోకేశ్ ఆగ్రహం

Nara Lokesh: సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

సీఎం జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకూ ఎంతో మంది దళిత బిడ్డలు బలయ్యారని, తాజాగా మరో దారుణం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేడ్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కొందరు దుండగులు నిర్భంధించారన్నారు. 4 గంటలు చిత్ర హింసలకు గురి చేశారని, దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్య సమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని ధ్వజమెత్తారు. 

'సీఎం జగన్ కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా, ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో నేనే బాధితున్ని అని వాపోవడం, జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట' అని లోకేశ్ ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు.

'సీఎం పదవికి జగన్ అనర్హుడు'

టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ తాజాగా ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. దీనిపైనా నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆ పదవికి అనర్హుడని, ఆయన మానసిక స్థితిపై కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపించాలని కోరారు. చంద్రబాబుపై కక్షతో రోజుకో తప్పుడు కేసు పెడుతున్నారని, జగన్ మానసిక స్థితిపై జనం చర్చించుకుంటున్నారని అన్నారు. కక్ష పూరితంగా వ్యవహరిస్తోన్న జగన్ తీరు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు. సీఐడీని వైసీపీ అనుబంధ విభాగంగా మార్చకుని ప్రతిపక్ష నేతలపై కేసుల మీద కేసులు పెట్టడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని లోకేశ్ మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సరైన పద్ధతి కాదని, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని ధ్వజమెత్తారు.

'స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రూపాయి అవినీతీ జరగకపోయినా కేసు బనాయించారు. ఈ రోజుకీ ఒక్క ఆధారం చూపించలేకపోయారు. వేయని రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారని ఓ కేసు, ఉచితంగా ఇసుక ఇస్తే అందులోనూ స్కామ్ అంటూ ఇప్పుడు మరో కేసు పెట్టారు. దేశంలోనే పేరు ప్రఖ్యాతలున్న ఫైబర్ నెట్ ప్రాజెక్టుపైనా కేసు పెట్టారు.' అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 

Also Read: రుషికొండలో నిర్మాణాలపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు - రాజకీయ కారణాలతో వేసినట్లుందని ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Breaking News:మహిళల రక్షణలో చారిత్రాత్మక తీర్పు.. లైవ్-ఇన్ వేధింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మహిళల రక్షణలో చారిత్రాత్మక తీర్పు.. లైవ్-ఇన్ వేధింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget