అన్వేషించండి

Peddi Reddy : కుప్పం ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలగాలి .. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సూచన!

కుప్పం ఓటమిని అంగీకరించి చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలగాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ఆయన కుప్పం ఎన్నికలకు ఇంచార్జ్‌గా వ్యవహరించారు.

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. సర్పంచ్, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని అక్కడి ప్రజలు తిరస్కరించారన్నారు. ఈ ఓటమిని అంగీకరించి చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలిగితే సంతోషిస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుకు 72 సంవత్సరాల వయసు వచ్చిందని..  ఆయన హైదరాబాద్‌కే పరిమితం అయి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ఇప్పటికి రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటే.. తమను కానీ .. తమ సీఎం జగన్‌ను కానీ వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

Koo App
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పం మున్సిపల్‌ ఎన్నికలో ఘన విజయం సాధించినందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, జిల్లా పార్టీ నేతలను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. #YSRCPSweepsMunicipolls #YSJaganMarkInKuppam #CMYSJagan #YSRCP - YSR Congress Party - YSRCP (@YSRCPOfficial) 17 Nov 2021

 

Also Read : గవర్నర్ బిశ్వభూషణ్‌కు అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు !

కుప్పంలో ఓడిపోయినా టీడీపీ నేతలు దొంగ ఓట్లని.. మరోకటని ప్రచారం చేస్తారని కానీ వారే కోర్టుకు వెళ్లి అన్ని ఆదేశాలు తెచ్చుకున్నారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. పోలింగ్ రోజున ఏం జరిగిందో తనకు తెలియదని.. తాను అక్కడ లేనన్నారు. దొంగ ఓట్లు వేశారని ఎక్కడా ఫిర్యాదులు రాలేదని ఎన్నికల సంఘం చెప్పిన విషయాన్ని పెద్దిరెడ్డి మీడియా ప్రతినిధులకు తెలిపారు. 

Also Read : ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం... కుమార్తె పెళ్లికి కానుకలు సమర్పించాలని హుకూం... వైరల్ అవుతున్న వీడియో..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ కష్టపడి సీఎం అయి.. ఆయన కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని కానీ లోకేష్ ఎమ్మెల్యేగానే గెలవలేకపోయారన్నారు. ఇక నుంచి మా గురించి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ టీడీపీ నేతలు కానీ చెడు మాటలు మాట్లాడితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.  చంద్రబాబు నాయుడు పుంగనూరుకు వచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఏదేదో చెబుతామని గెలిచిన వారే నాయకులని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Also Read : ఓ ప్రజాప్రతినిధి నిర్వాకం... కుమార్తె పెళ్లికి కానుకలు సమర్పించాలని హుకూం... వైరల్ అవుతున్న వీడియో..!

కుప్పం నియోజకవర్గానికి ఎన్నికల బాధ్యతను సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. ఎన్నికల ఇంచార్జ్‌గా పెద్దిరెడ్డి కుప్పంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పార్టీ శ్రేణులందర్నీ కూడగట్టి విజయం సాధించారు.  చంద్రబాబు సుదీర్ఘంగా గెలుస్తున్న నియోజకవర్గంలో టీడీపీకి చెక్ పెట్టారు. 

Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Embed widget