అన్వేషించండి

Minister Chelluboyina : బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు- మంత్రి చెల్లుబోయిన

Minister Chelluboyina : టీడీపీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

Minister Chelluboyina : టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగానే కాదు విపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరొందల హామీలిచ్చి మోసగించారన్నారు. రైతులకు, మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని నిలువునా ముంచేశాడన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను మోసగించిన తెలుగుదేశం పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. బీసీలకు 34శాతం రిజర్వేషన్ చంద్రబాబు ఇచ్చారని లోకేశ్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 32.33శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని గుర్తు చేశారు. టీడీపీ-వైఎస్ఆర్సీపీ పాలనలో బీసీలపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. 

వడ్డీ లేకుండా రూ.10 వేలు

బీసీలంటే వెనకబడి కులాలు కాదు వెన్నెముక కులాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతమని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు. బీసీలకు ఐటీ ఉద్యోగాలు రాకపోవడానికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్లల్లో చంద్రబాబు ఇస్త్రీపెట్టే, కుర్చీ ఇస్తే..జగనన్న చేదోడు పథకం కింద ఒక్కొక్కరికి వడ్డీ లేకుండా పదివేల రూపాయలు ఇస్తున్నామని ఉద్ఘాటించారు. బలహీన వర్గాలు ఎవరి దగ్గర యాచించకండా ఆత్మగౌరవంగా బతకాలని జగన్ ఆలోచించారని గుర్తు చేశారు. 33లక్షల మంది బీసీలకు  సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్సీపీది అన్నారు. పేదవాడికి, పెత్తందారికి మధ్య జరిగే యుద్ధంలో పేదవారి కోసం నిలబడ్డవాడే సీఎం జగన్మోహన్ రెడ్డి అని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

జగనన్న చేదోడు పథకం 

పల్నాడు జిల్లా పెనుకొండలో జరిగిన బహిరంగ సభలో జగనన్న చేదోడు పథకం కింద మూడో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 30వేల 145మందికి 330.15కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు.  ఈ పథకం కింద అర్హులైన టైలర్లు, రజకులు, నాయిబ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 10వేల రూపాయల సాయాన్ని రిలీజ్ చేశారు. ఈపథకం కింద షాపులున్న 1 లక్షా 67 వేల 951 మంది టైలర్లకు రూ.167.95 కోట్లు, 1లక్షా 14వేల 661 మంది రజకులకు రూ.114.67కోట్లు, 45వేల 533 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.47.53కోట్ల ఆర్థికసాయాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు ముఖ్యమంత్రి జగన్. ఎలాంటి వివక్ష లేకుండా లంచాలకు తావులేకుండా పారదర్శకంగా ఆర్థికసాయం చేస్తున్నామని ప్రకటించారు. ఈ మూడేళ్లల్లో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51కోట్ల సాయం అందజేశామి సీఎం జగన్ ప్రకటించారు.  2020-21లో 2, 98,122 మందికి రూ.298.12కోట్లు, 2021.22లో 2,99,116 మందికి రూ.299.12కోట్లు, 2022-23లో 3,30,145 మందికి రూ.330.15 కోట్ల ఆర్థిక సాయం అందించారు. ఇలా ఈ మూడేళ్లల్లో మొత్తం రూ.927.39కోట్ల లబ్ధి అందించారు. 

పొత్తుల్లేకుండానే ఎన్నికలకు 

వైఎస్ఆర్సీపీ పాలనలో సంక్షేమాన్ని చూసి కొందరు తట్టుకోలేక శ్రీలంకగా మారుతుందని అసత్య ప్రచారం చేస్తున్నాయని జగన్  మండిపడ్డారు. వైసీపీ పాలనలో బటన్ నొక్కగానే నేరుగా డబ్బులు అకౌంట్లలో పడుతున్నాయని,  కానీ ఓసారి గత ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. గత పాలనలో గజదొంగల ముఠా,  దుష్టచతుష్టయం ఉండేదన్నారు. వాళ్ల స్కీమ్ డీపీటీ అంటే దోచుకో.. పంచుకో... తినుకో అని జగన్ విరుచుకుపడ్డారు. దొంగలముఠా పాలన కావాలా వైసీపీ పాలన కావాలా ఆలోచించాలని జగన్ కోరారు. పొత్తుల్లేకుండా సింహంలా నడుస్తానని జగన్ మాటిచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiyam Kavya: బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
బీఆర్ఎస్ కు మరో షాక్ - పోటీ నుంచి తప్పుకొన్న వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Embed widget