అన్వేషించండి

Minister Atchennaidu: అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అసెంబ్లీ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

Andhra News: ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్షాలు లేక పంటలు కోల్పోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

Minister Atchennaidu Relief Fund To Farmers: ఏపీలో అన్నదాతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు అసెంబ్లీ (AP Assembly) సాక్షిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. వర్షాభావ పరిస్థితులతో పంటను కోల్పోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందించనున్నట్లు తెలిపారు. వర్షాలు లేక పలు జిల్లాల్లో 1.06 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పిన ఆయన.. ఇప్పటికే 54 కరవు మండలాలను ప్రకటించామని చెప్పారు. మొత్తం 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని.. వారికి పరిహారంగా రూ.159.2 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని అన్నారు. అలాగే, నష్టపోయిన రైతులకు రాయితీతో 47 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. జీడి మామిడికి సంబంధించి మద్దతు ధరపైనా మంత్రి ప్రస్తావించారు.

'శ్రీకాకుళంలో జీడి మామిడి బోర్డు'

జీడి మామిడికి మద్దతు ధర ప్రకటించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 'ఇప్పటికే ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాశాం. జీడిమామిడి పండుకు బైప్రొడక్టుగా చాలా ఆదాయం రావొచ్చు. రాష్ట్రంలో జీడిమామిడి బోర్డు ఏర్పాటుపై కూడా సీఎం, కేంద్ర మంత్రితో చర్చించాం. శ్రీకాకుళంలో జీడిమామిడి బోర్డు పెడతామని వారు హామీ ఇచ్చారు.' అని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో కొబ్బరి చెట్ల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని.. కానీ తమ ప్రభుత్వం కొత్త చెట్లు అందజేయబోతోందని ప్రకటించారు. ఉద్దానంలో ఒక కోకోనట్ పార్క్ కావాలని అడిగారని.. ఆ అంశాన్ని సైతం ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని తెలిపారు.

కాగా, ఇటీవలే శాసనసభలో మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తున్నామని.. ఇందు కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పారు. రైతులకు విత్తనాలు, సూక్ష్మ ఎరువులు రాయితీపై అందిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్‌లో విపత్తుల సమయంలో పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచింది. గతంలో హెక్టారుకు రూ.17 వేలు పంట నష్టం కింద పెట్టుబడి సాయంగా అందించేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25 వేలకు పెంచారు. ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు, రాష్ట్రంలోని 21 జిల్లాల్లో పంట నష్టపోయిన 1.90 లక్షల మంది రైతులకు.. ఈ - క్రాప్ ద్వారా రూ.284.56 కోట్లు జమ చేశారు.

Also Read: AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chandrababu 4.0 PR Strategy: చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget