అన్వేషించండి

Minister Atchennaidu: అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అసెంబ్లీ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

Andhra News: ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్షాలు లేక పంటలు కోల్పోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

Minister Atchennaidu Relief Fund To Farmers: ఏపీలో అన్నదాతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు అసెంబ్లీ (AP Assembly) సాక్షిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. వర్షాభావ పరిస్థితులతో పంటను కోల్పోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందించనున్నట్లు తెలిపారు. వర్షాలు లేక పలు జిల్లాల్లో 1.06 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పిన ఆయన.. ఇప్పటికే 54 కరవు మండలాలను ప్రకటించామని చెప్పారు. మొత్తం 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని.. వారికి పరిహారంగా రూ.159.2 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని అన్నారు. అలాగే, నష్టపోయిన రైతులకు రాయితీతో 47 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. జీడి మామిడికి సంబంధించి మద్దతు ధరపైనా మంత్రి ప్రస్తావించారు.

'శ్రీకాకుళంలో జీడి మామిడి బోర్డు'

జీడి మామిడికి మద్దతు ధర ప్రకటించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 'ఇప్పటికే ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాశాం. జీడిమామిడి పండుకు బైప్రొడక్టుగా చాలా ఆదాయం రావొచ్చు. రాష్ట్రంలో జీడిమామిడి బోర్డు ఏర్పాటుపై కూడా సీఎం, కేంద్ర మంత్రితో చర్చించాం. శ్రీకాకుళంలో జీడిమామిడి బోర్డు పెడతామని వారు హామీ ఇచ్చారు.' అని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో కొబ్బరి చెట్ల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని.. కానీ తమ ప్రభుత్వం కొత్త చెట్లు అందజేయబోతోందని ప్రకటించారు. ఉద్దానంలో ఒక కోకోనట్ పార్క్ కావాలని అడిగారని.. ఆ అంశాన్ని సైతం ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని తెలిపారు.

కాగా, ఇటీవలే శాసనసభలో మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తున్నామని.. ఇందు కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పారు. రైతులకు విత్తనాలు, సూక్ష్మ ఎరువులు రాయితీపై అందిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్‌లో విపత్తుల సమయంలో పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచింది. గతంలో హెక్టారుకు రూ.17 వేలు పంట నష్టం కింద పెట్టుబడి సాయంగా అందించేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25 వేలకు పెంచారు. ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు, రాష్ట్రంలోని 21 జిల్లాల్లో పంట నష్టపోయిన 1.90 లక్షల మంది రైతులకు.. ఈ - క్రాప్ ద్వారా రూ.284.56 కోట్లు జమ చేశారు.

Also Read: AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
LPG Gas Cylinders: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం! శిల్పకళా వైభవం, రహస్యాలు, కల్యాణోత్సవం వివారాలివే!

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget