అన్వేషించండి

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్

AP DSC Notification | ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని, గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు నారా లోకేష్.

Nara Lokesh News | అమరావతి: టీచర్ పోస్టుల పోస్టుల భర్తీపై అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు డిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టుల భర్తీచేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

టీచర్లపై నమోదైన కేసులు ఎత్తివేత

ఉపాధ్యాయులపై వేధింపులు ఉండకూడదన్న మంత్రి నారా లోకేష్ టీచర్లపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసినపుడు ఉపాధ్యాయులపై దొంగకేసులు పెట్టారని, డిజిపితో మాట్లాడి ఆ కేసులన్నీ తొలగిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు. 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించాం, పకడ్బందీగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు సీఎం చంద్రబాబు వద్ద ఉందన్నారు. అక్కడ నుంచి ఫైలు వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తామని నారా లోకేష్ చెప్పారు.

1994కి ముందు జిల్లాపరిషత్ ఆధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్ మెంట్ జరిగేది. ఆ తర్వాత టిడిపి ప్రభుత్వాల హయాంలోనే 15 డిఎస్సీలు నిర్వహించాం, 2.20లక్షల పోస్టులు నోటిఫై చేసి, 1.80లక్షల పోస్టులు భర్తీచేసింది మా ప్రభుత్వాలే. ఇదొక చరిత్ర. గత వైసిపి ప్రభుత్వ హయాంలో డిఎస్సీ ద్వారా భర్తీచేసిన పోస్టులు సున్నా. ఎన్నికలకు రెండునెలల ముందు 12-2-2024న నిరుద్యోగులను మభ్యపెట్టడానికి హయావిడిగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు అన్నారు.

Also Read: AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!

ఎన్నికలకు ముందు మభ్యపెట్టడానికే వైసీపీ నోటిఫికేషన్

‘నిరుద్యోగులను మభ్యపెట్టడానికే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. గత ప్రభుత్వం జిఓ 117 తెచ్చి స్కూళ్ల విలీనం పేరుతో పేద విద్యార్థులు, టీచర్లను ఇబ్బందులకు గురిచేయడం వాస్తవం కాదా. సమాజంలో మార్పునకు కారణమైన టీచర్లను వైసీపీ ప్రభుత్వం వేధించింది. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ (AP Model Education) తెచ్చే క్రమంలో టీచర్లు భాగస్వాములను చేయాలి. గత ప్రభుత్వంలో అయిదేళ్ల వ్యవధిలో ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని గుర్తించాం. ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచకపోగా ఉపాధ్యాయులను వేధించారు. 

Also Read: Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన

జిఓ 117పై ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనర్ మాట్లాడుతున్నారు, గతంలో ఏం జరిగిందో కూటమి ప్రభుత్వం వాస్తవాలను తెలుసుకుంటోంది. జిఓ 117కి ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటాం. ఏ ప్రభుత్వంలోనైనా సరే సమాజానికి మేలు చేసే ఉపాధ్యాయులపై వేధింపులు సరికాదు. వైసీపీ పాలనలో తమ సమస్యలపై ధర్నాలు చేసినపుడు టీచర్లపై పెట్టిన కేసులపై ఏపీ డీజీపీతో మాట్లాడి వాటిని తొలగిస్తాం. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామం’ - అసెంబ్లీలో నారా లోకేష్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Jr NTR: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Jr NTR: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Mahadev Betting App Case బెట్టింగ్ యాప్ స్కామ్, మాజీ సీఎం భూపేష్ బాఘేల్ ఇంట్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు
బెట్టింగ్ యాప్ స్కామ్, మాజీ సీఎం భూపేష్ బాఘేల్ ఇంట్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
Embed widget