అన్వేషించండి

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్

AP DSC Notification | ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని, గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు నారా లోకేష్.

Nara Lokesh News | అమరావతి: టీచర్ పోస్టుల పోస్టుల భర్తీపై అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు డిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టుల భర్తీచేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

టీచర్లపై నమోదైన కేసులు ఎత్తివేత

ఉపాధ్యాయులపై వేధింపులు ఉండకూడదన్న మంత్రి నారా లోకేష్ టీచర్లపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసినపుడు ఉపాధ్యాయులపై దొంగకేసులు పెట్టారని, డిజిపితో మాట్లాడి ఆ కేసులన్నీ తొలగిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు. 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించాం, పకడ్బందీగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు సీఎం చంద్రబాబు వద్ద ఉందన్నారు. అక్కడ నుంచి ఫైలు వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తామని నారా లోకేష్ చెప్పారు.

1994కి ముందు జిల్లాపరిషత్ ఆధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్ మెంట్ జరిగేది. ఆ తర్వాత టిడిపి ప్రభుత్వాల హయాంలోనే 15 డిఎస్సీలు నిర్వహించాం, 2.20లక్షల పోస్టులు నోటిఫై చేసి, 1.80లక్షల పోస్టులు భర్తీచేసింది మా ప్రభుత్వాలే. ఇదొక చరిత్ర. గత వైసిపి ప్రభుత్వ హయాంలో డిఎస్సీ ద్వారా భర్తీచేసిన పోస్టులు సున్నా. ఎన్నికలకు రెండునెలల ముందు 12-2-2024న నిరుద్యోగులను మభ్యపెట్టడానికి హయావిడిగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు అన్నారు.

Also Read: AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!

ఎన్నికలకు ముందు మభ్యపెట్టడానికే వైసీపీ నోటిఫికేషన్

‘నిరుద్యోగులను మభ్యపెట్టడానికే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. గత ప్రభుత్వం జిఓ 117 తెచ్చి స్కూళ్ల విలీనం పేరుతో పేద విద్యార్థులు, టీచర్లను ఇబ్బందులకు గురిచేయడం వాస్తవం కాదా. సమాజంలో మార్పునకు కారణమైన టీచర్లను వైసీపీ ప్రభుత్వం వేధించింది. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ (AP Model Education) తెచ్చే క్రమంలో టీచర్లు భాగస్వాములను చేయాలి. గత ప్రభుత్వంలో అయిదేళ్ల వ్యవధిలో ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని గుర్తించాం. ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచకపోగా ఉపాధ్యాయులను వేధించారు. 

Also Read: Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన

జిఓ 117పై ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనర్ మాట్లాడుతున్నారు, గతంలో ఏం జరిగిందో కూటమి ప్రభుత్వం వాస్తవాలను తెలుసుకుంటోంది. జిఓ 117కి ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటాం. ఏ ప్రభుత్వంలోనైనా సరే సమాజానికి మేలు చేసే ఉపాధ్యాయులపై వేధింపులు సరికాదు. వైసీపీ పాలనలో తమ సమస్యలపై ధర్నాలు చేసినపుడు టీచర్లపై పెట్టిన కేసులపై ఏపీ డీజీపీతో మాట్లాడి వాటిని తొలగిస్తాం. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామం’ - అసెంబ్లీలో నారా లోకేష్

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget