అన్వేషించండి

Pawan Kalyan : కోనసీమ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా జరిగినవే, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తా- పవన్ కల్యాణ్

Pawan Kalyan On Amalapuram Issue : కోనసీమ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా జరిగాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమకు సీఎం, మంత్రులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

Pawan Kalyan On Amalapuram Issue : అమలాపురం అల్లర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. కోనసీమ గొడవలు ఉద్దేశపూర్వకంగా జరిగినవే అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కోనసీమకు ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కోనసీమ తగలబడుతుంటే మంత్రులు బస్సు యాత్ర చేస్తారా అని నిలదీశారు. అమలాపురం అల్లర్లలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబడుతుంటుంటే అగ్నిమాపక యంత్రాలు ఎందుకు రాలేదని పవన్ ప్రశ్నించారు. కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలనే ఆలోచన ఉంటే ముందే చేసేవారన్నారు. జిల్లాల విభజనలో విరుద్ధమైన విధానంలో ప్రభుత్వం ఉందన్నారు. అల్లర్లపై నిఘా విభాగానికి సమాచారం ఎందుకు లేదని నిలదీశారు.  అమలాపురం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానన్నారు. 

" గొడవలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసు. అందుకే ఇప్పటివరకు పాలకులు స్పందించలేదు. సమస్య అంబేడ్కర్‌ కాదు, ఒక పార్టీలో 2 వర్గాల మధ్య గొడవ. వాళ్ల పార్టీలోనే భిన్నాభిప్రాయాలను తొక్కి గొడవలు రేపారు. "
-- పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత 

ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదు

మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఘటనలో మంత్రి విశ్వరూప్ కూడా బాధితులే అన్నారు. కోనసీమ ఘటన జరిగి ఇన్నాళ్లైనా ప్రభుత్వం స్పందించకపోవడపై అనుమానాలు కలిగిస్తోందన్నారు. తనకు తెలిసినంత వరకు మంత్రి విశ్వరూప్ మంచి వ్యక్తి అని పవన్ వ్యాఖ్యానించారు. మంత్రి విశ్వరూప్ రాజకీయాల కోసం రెచ్చగొట్టే వ్యక్తి కాదన్నారు. వైసీపీ ఉన్నంతవరకు పోలవరం పూర్తి కాదన్నారు.  కొట్టడం తమ హక్కుగా వైసీపీ భావిస్తోందని ఆరోపించారు. కోనసీమలో ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత పర్యటిస్తానని పవన్ అన్నారు. బీజేపీతో సంబంధాలపై పవన్ భిన్నంగా స్పందించారు. తనకు దిల్లీ బీజేపీ నేతలతోనే సంబంధమని, ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదన్నారు. మహానాడు సక్సెస్ అయితే మంచిదే అన్నారు. వైసీపీ పాలన బాగుంటే పొత్తుల ప్రస్తావన ఎందుకు వస్తుందన్నారు. కొన్ని కులాల వారిని వైసీపీ ప్రభుత్వం శత్రువులుగా భావిస్తోందన్నారు. కమ్మ, కాపు, బీసీ, మత్స్యకార కులాలను వైసీపీ శత్రువులుగా చూస్తుందని ఆరోపించారు.

బీజేపీ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు 

ఏపీ బీజేపీ నేతలతో సంబంధం పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దిల్లీ బీజేపీ నేతలతో సంబంధమని ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదని పవన్ అన్నారు. ఏపీ బీజేపీ నేతలకు ఆయన పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వారి నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చెప్పినట్టు అర్థం వచ్చే విధంగా పవన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. పవన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget