అన్వేషించండి

Pawan Kalyan : కోనసీమ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా జరిగినవే, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తా- పవన్ కల్యాణ్

Pawan Kalyan On Amalapuram Issue : కోనసీమ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా జరిగాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమకు సీఎం, మంత్రులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

Pawan Kalyan On Amalapuram Issue : అమలాపురం అల్లర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. కోనసీమ గొడవలు ఉద్దేశపూర్వకంగా జరిగినవే అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కోనసీమకు ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కోనసీమ తగలబడుతుంటే మంత్రులు బస్సు యాత్ర చేస్తారా అని నిలదీశారు. అమలాపురం అల్లర్లలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబడుతుంటుంటే అగ్నిమాపక యంత్రాలు ఎందుకు రాలేదని పవన్ ప్రశ్నించారు. కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలనే ఆలోచన ఉంటే ముందే చేసేవారన్నారు. జిల్లాల విభజనలో విరుద్ధమైన విధానంలో ప్రభుత్వం ఉందన్నారు. అల్లర్లపై నిఘా విభాగానికి సమాచారం ఎందుకు లేదని నిలదీశారు.  అమలాపురం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానన్నారు. 

" గొడవలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసు. అందుకే ఇప్పటివరకు పాలకులు స్పందించలేదు. సమస్య అంబేడ్కర్‌ కాదు, ఒక పార్టీలో 2 వర్గాల మధ్య గొడవ. వాళ్ల పార్టీలోనే భిన్నాభిప్రాయాలను తొక్కి గొడవలు రేపారు. "
-- పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత 

ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదు

మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఘటనలో మంత్రి విశ్వరూప్ కూడా బాధితులే అన్నారు. కోనసీమ ఘటన జరిగి ఇన్నాళ్లైనా ప్రభుత్వం స్పందించకపోవడపై అనుమానాలు కలిగిస్తోందన్నారు. తనకు తెలిసినంత వరకు మంత్రి విశ్వరూప్ మంచి వ్యక్తి అని పవన్ వ్యాఖ్యానించారు. మంత్రి విశ్వరూప్ రాజకీయాల కోసం రెచ్చగొట్టే వ్యక్తి కాదన్నారు. వైసీపీ ఉన్నంతవరకు పోలవరం పూర్తి కాదన్నారు.  కొట్టడం తమ హక్కుగా వైసీపీ భావిస్తోందని ఆరోపించారు. కోనసీమలో ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత పర్యటిస్తానని పవన్ అన్నారు. బీజేపీతో సంబంధాలపై పవన్ భిన్నంగా స్పందించారు. తనకు దిల్లీ బీజేపీ నేతలతోనే సంబంధమని, ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదన్నారు. మహానాడు సక్సెస్ అయితే మంచిదే అన్నారు. వైసీపీ పాలన బాగుంటే పొత్తుల ప్రస్తావన ఎందుకు వస్తుందన్నారు. కొన్ని కులాల వారిని వైసీపీ ప్రభుత్వం శత్రువులుగా భావిస్తోందన్నారు. కమ్మ, కాపు, బీసీ, మత్స్యకార కులాలను వైసీపీ శత్రువులుగా చూస్తుందని ఆరోపించారు.

బీజేపీ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు 

ఏపీ బీజేపీ నేతలతో సంబంధం పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దిల్లీ బీజేపీ నేతలతో సంబంధమని ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదని పవన్ అన్నారు. ఏపీ బీజేపీ నేతలకు ఆయన పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వారి నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చెప్పినట్టు అర్థం వచ్చే విధంగా పవన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. పవన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget