అన్వేషించండి

MLA Pinnelli: ఏ క్షణానైనా ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్! పోలీసుల గాలింపు తీవ్రం, అన్ని ఎయిర్‌పోర్టులకు అలర్ట్

Macherla News: పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసినందుకు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన్ను అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించింది

Pinnelli Ramakrishna Reddy News: పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్నికల రోజున పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పాటు నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు ఏర్పడేందుకు కారణమయ్యారని ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈవీఎం ధ్వంసం చేసిన తాలుకు సీసీటీవీ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఫలితంగా ఏపీ పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈనెల 20నే కేసు నమోదు చేశారు.

పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి తెలంగాణలో ఉన్నారని తెలుసుకొని ఏపీ పోలీసులు ప్రత్యేక బృందాలుగా హైదరాబాద్‌కు వచ్చాయి. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కలిసి ఆయన కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కంది దగ్గర పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో ఉన్న పిన్నెల్లి కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి దగ్గరే కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ గాలింపు చర్యల నేపథ్యంలో పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని పోలీసులు ఏ క్షణానైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

అన్ని ఎయిర్ పోర్టులకు అలర్ట్

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డిపై బుధవారం మధ్యాహ్నం (మే 22) ప్రెస్ మీట్ నిర్వహించారు. పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లోనూ ఏపీ పోలీసులు వెతుకుతున్నారని.. అన్ని ఎయిర్ పోర్టులను కూడా అలర్ట్ చేసినట్లుగా ఆయన చెప్పారు. పోలింగ్ రోజు ఒక్క మాచర్లలోనే ఏడు ఘటనలు జరిగాయని చెప్పారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించామని వివరించారు. పోలింగ్‌ రోజున ఏపీ వ్యాప్తంగా 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. ఎమ్మెల్యే పగలగొట్టిన ఈవీఎంలోని సమాచారం మొత్తం సేఫ్ గానే ఉందని చెప్పారు. 

ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్‌)కు పోలీసులు అన్ని వివరాలను అందించారని చెప్పారు. 20వ తేదీన రెంటచింతల కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారని.. అందులో 10 సెక్షన్ల కింద ఎమ్మెల్యేపై కేసులు పెట్టినట్లు తెలిపారు. ఆ కేసుల కింద ఆయనకు దాదాపు ఏడేళ్ల దాకా శిక్షలు పడే అవకాశం ఉందని వివరించారు. ఈసీ ఆదేశానుసారం నిన్నటి నుంచి ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదని సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venkateswara Swamy Temple : అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Venkateswara Swamy Temple : అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన- రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ 
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
తెలంగాణ పంచాయతీ ఎన్నికల సమరం: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక వ్యూహాలు..గ్రామాల్లో విజయం ఎవరిదో?
Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
తిరుమలేశుడి భక్తులకు గుడ్ న్యూస్- వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం 
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
Andhra King Taluka OTT : రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎందులో చూడొచ్చంటే?
Smriti Mandhana–Palash Muchhal Wedding Row: స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
స్మృతి మంధాన పెళ్లిపై మేరీ డి'కోస్టా సంచలన పోస్టు! పలాష్ ముచ్చల్‌తో సంబంధంపై క్లారిటీ!
South Central Railway : ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
ఇంటి నుంచే దేశం నలుమూలలకు పార్శిల్ పంపేయొచ్చు- కొత్త సర్వీస్ ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Embed widget