అన్వేషించండి

Buggana Rajendranath Reddy: సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష

Buggana Rajendranath Reddy: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 19వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనునున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Buggana Rajendranath Reddy: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 19వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనునున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో పోలీస్ గెస్ట్ హౌస్‌లో సమావేశమై సమీక్ష చేశారు. 77 చెరువులకు కృష్ణా జలాలు అందించే 'హంద్రీనీవా' సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. అనంతరం డోన్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారని అన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని ఆదేశించారు. 

కర్నూలు జిల్లాలో సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా 80 వేల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించనున్నట్లు చెప్పారు. అనంతరం పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామం, ఆలంకొండ వద్ద హంద్రీనీవా కాలువపై నిర్మించిన పంపింగ్ స్టేషన్ ప్రాంతాన్ని మంత్రి పరిశీలించనున్నారు. డోన్ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను తనిఖీ చేయనున్నారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు మంత్రి బుగ్గన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

పర్యటన ఏర్పాట్లపై నంద్యాల జిల్లా కలెక్టర్ సమీక్ష 
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన మోహనరెడ్డి ఈనెల 19న డోన్‌ రానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. డోన్ నంద్యాల జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన అధికారులను ఆదేశించారు. మూడు రోజుల క్రితం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం అధికారులకు అప్పగించిన పనులు బాధ్యతాయుతంగా చేపట్టి ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలన్నారు. 

హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ వేదిక వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి సూచించారు. హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే ప్రదేశంలో ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి దుమ్ము లేవకుండా వాటరింగ్ పెద్దఎత్తున చేయాలని ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అవసరమైన జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

హెలిప్యాడ్, మీటింగ్ సమీపాల్లో ఏర్పాటు చేసిన సేఫ్ రూముల్లో అత్యవసర మందులతో పాటు నిపుణులైన డాక్టర్లు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ, జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులను ఆదేశించారు. గ్రీన్ రూమ్, సభా వేదిక, విజిటర్స్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలలో కల్తీ లేకుండా జాగ్రత్తగా చెక్ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సభా వేదిక ప్రాంతంలో ప్రాపర్‌గా త్రాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని డోన్ మున్సిపల్ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ రఘువీర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్ల గురించి వివరించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget