అన్వేషించండి

Duronto Express : దురంతో ఎక్స్ ప్రెస్ లో మంటలు, రైల్వే శాఖ క్లారిటీ

Duronto Express : కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో దురంతో ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపుచేశారు.

Duronto Express  : చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో దురంతో ఎక్స్ ప్రెస్ లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. బెంగళూరు నుంచి హౌరా వెళ్తోన్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-9 బోగీలో దట్టమైన పొగలు వచ్చాయి. ఇది గమనించిన లోకో పైలెట్ ట్రైన్ ను కుప్పం రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. పొగలు రావడంతో ప్రయాణికులు ట్రైన్ నుంచి దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో రైలు బయలుదేరింది.  

అసలేం జరిగింది? 

చిత్తూరు కుప్పం రైల్వే ష్టేషన్‌ లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. దురంతో ఎక్స్‌ ప్రెస్‌ లో మంటలు చెలరేగాయి. మంటలు, దట్టమైన పొగలు గమనించిన ప్రయాణికులు భయంతో కిందికి దిగి పరుగులు తీశారు. బెంగళూరు నుంచి హౌరా వెళ్తోన్న ట్రైన్‌ కుప్పం రైల్వే స్టేషన్‌ సమీపానికి రాగానే మంటలు చెలరేగాయి. రైలులో మంటలను గుర్తించిన లోకో పైలెట్ కుప్పం రైల్వే స్టేషన్ లో ట్రైన్ ను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులుపెట్టారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదని రైల్వే సిబ్బంది తెలిపారు. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే కిందికి దిగి దూరంగా వెళ్లడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదని స్పష్టం చేశారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయో ఇంకా తెలియాల్సి ఉందని రైల్వే అధికారులు అంటున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెంగళూరు నుంచి హవ్ డా వెళ్తోన్న ట్రైన్‌ కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.  


Duronto Express : దురంతో ఎక్స్ ప్రెస్ లో మంటలు, రైల్వే శాఖ క్లారిటీ

రైల్వే శాఖ క్లారిటీ 

ఈ ప్రమాదంపై రైల్వే శాఖ స్పందించింది. దురంతో ట్రైన్ లో మంటలు ఘటన అవాస్తవం అని తెలిపింది. బ్రేక్ బైడింగ్ వల్ల పొగలు వ్యాపించాయని తెలిపింది. దీంతో రైలును నిలిపివేసి తక్షణ చర్యలు చేపట్టారని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఎలాంటి విచారణకు ఆదేశించలేదని క్లారిటీ ఇచ్చారు.  

శబరిమల ప్రత్యేక రైళ్లు 

అయ్యప్ప సీజన్ మొదలు అయింది. మండల కాలంపాటు అంటే 41 రోజులు దీక్ష తీసుకుంటారు. ఈ 41 రోజుల పాటు అత్యంత నియమ నిష్ఠలు పాటించి అయ్యప్పను పూజిస్తారు. 41 రోజుల అయ్యాక స్వాములు శబరి యాత్రకు వెళ్తారు. అలా శబరి వెళ్లే అయ్యప్ప దీక్షాపరులు, అయ్యప్ప స్వామి భక్తుల కోసం రైల్వే శాఖ గొప్ప సౌకర్యాన్ని కల్పించనుంది. ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుండి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా కొల్లాం, కొట్టాయానికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఇటీవల ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లు తిరిగి కొల్లాం, కొట్టాయం నుండి సికింద్రాబాద్ కు నడుస్తాయని అధికారులు తెలిపారు. 

సికింద్రాబాద్ నుంచి 

సికింద్రాబాద్ - కొల్లాం (07117) డిసెంబర్ 4, 18, జనవరి 8 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్ (07118) డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ - కొల్లాం(07121) ఈనెల 27వ తేదీ, డిసెంబర్ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్ (07122) ఈ నెల 29, డిసెంబర్ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో నడవనున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే సికింద్రాబాద్ - కొల్లాం(07123) ఈ నెల 28 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్(07124) ఈ నెల 30 తేదీల్లో, సికింద్రాబాద్ - కొట్టాయం (07125) ఈ నెల 27 తేదీల్లో నడవనున్నాయి. కొట్టాయం - సికింద్రాబాద్ (07126) ఈ నెల 28 తేదీల్లో నడుస్తాయని అధికారులు వెల్లడించారు. 

 

 

టాప్ హెడ్ లైన్స్

AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Embed widget