అన్వేషించండి

CM Jagan: మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో జగనన్న పచ్చతోరణం - వన మహోత్సవం ప్రారంభం.. తొలి మెుక్క నాటనున్న సీఎం

ఇవాళ మంగళగిరి.. ఎయిమ్స్ ఆవరణలో మెుక్కనాటి జగనన్న పచ్చతోరణం-వన మహోత్సవం కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.

 

పచ్చదనం పెంపునకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎక్కడ చూసినా పచ్చదనం కళకళలాడాలని అనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే జగనన్న పచ్చతోరణం కింద మెుక్కలు నాటింది. మరో విడత జగనన్న పచ్చతోరణం-వన మహోత్సవం కింద..  మంగళగిరి ఎయిమ్స్ లో సీఎం జగన్ మెుక్కనాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

రెండు సంవత్సరాలలో 33.23 కోట్లు మెుక్కలు నాటామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈసారి కూడా అదే ఉత్సాహంతో మెుక్కలు నాటుతామన్నారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

విరివిగా మొక్కలు నాటే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రంలో సుమారుగా 75 లక్షల మొక్కలు నాటుతున్నామని తెలిపారు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపొందించడమే ప్రభుత్వానికి ముఖ్య ప్రాధాన్యత అన్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా స్కూళ్లు, ఆసుపత్రుల ఆవరణలో మొక్కలు నాటుతున్నామని వెల్లడించారు. 33 శాతం పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు కృషి చేస్తామన్నారు.

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని గతంలోనే సీఎం జగన్ పిలుపునిచ్చారు. మొత్తం 20 కోట్ల మొక్కులు నాటాలని  లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఎక్కడ చూసినా మొక్కలు నాటడం మూలంగా వర్షాలతోపాటు ప్రకృతిపరంగా అనేక ప్రయోజనాలు ఒనగూరేందుకు అవకాశాలు ఉన్నాయి. మొక్కలు నాటడం ద్వారానే పర్యావరణ ప్రయోజనంతోపాటు ప్రకృతి ద్వారా కూడా అనేక లాభాలు లభిస్తాయని భావిస్తూ అందరినీ భాగస్వాములను చేస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగా డ్వామా, పంచాయతీ, అటవీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, జిల్లా పరిషత్‌ల ద్వారా సమన్వయం చేసుకుంటూ అధికారులు ముందుకు వెళ్లనున్నారు.

జగనన్న పచ్చతోరణంలో గ్రామాల్లో నాటే మొక్కల్లో 83 శాతం సంరక్షించకపోతే అందుకు సర్పంచులను బాధ్యులుగా చేసి అనర్హత వేటు వేస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలోనే చెప్పారు. పంచాయతీరాజ్‌ చట్టంలో ఇప్పటికే సవరణలు చేశామని అప్పుడే తెలిపారు.

జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయతీరాజ్‌ రోడ్ల వెంబడి కూడా మొక్కలు నాటుతారు. రహదారుల వెంబడి నాటిన చింత, వేప, నేరేడు, ఏడాకుల పాయ, బాదం, రావి మొక్కలు చెట్లుగా మారితే రోడ్లకు పచ్చతోరణాలుగా మారతాయని అధికారులు చెబుతున్నారు. ‘జగనన్న పచ్చతోరణం’ కింద ఈ ఏడాది గ్రామాల్లో 1.02 కోట్ల మొక్కలు నాటాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు చేస్తోంది.

 

Also Read: CM Jagan: నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష.. అంగన్ వాడీ టీచర్లకు గుడ్ న్యూస్

టాప్ హెడ్ లైన్స్

Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Sri Sundararaja Swamy: తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!
తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget