అన్వేషించండి

Kurnool Diamonds: కర్నూలు జిల్లాలో వరుసగా వజ్రాలు లభ్యం - ధర ఎంతంటే?

Andhra Pradesh News: కర్నూలు జిల్లాలో ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. ఓ వజ్రాన్ని రూ.6 లక్షలు, 6 తులాల బంగారం ఇచ్చి వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Diamonds Found In Kurnool District: కర్నూలు జిల్లాలో వరుసగా వజ్రాలు లభ్యమవుతున్నాయి. జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరిలో  ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. వీటిని వేలం వేయగా ఓ వజ్రానికి రూ.6 లక్షలు, 6 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరో వజ్రాన్ని ఇంకా వేలం వేయలేదు. దీని విలువ రూ.12 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వారం రోజుల్లోనే దాదాపు 10 వజ్రాలను ఎవరికీ తెలియకుండా కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా, వర్షాకాలంలో స్థానికులు వజ్రాల కోసం పెద్ద ఎత్తున పొలాల్లో వేట సాగిస్తుంటారు. జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెరా, పగిడిరాయ్, పెరావళి, మహానంది, మహాదేవపురం ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతుంటారు. వర్షాకాలం ప్రారంభమైన జూన్ నుంచి నవంబర్ వరకూ ఈ వేట కొనసాగుతుంది.

రైతు పొలంలో..

అటు, శనివారం మదనంతపురంలో ఓ రైతు పొలంలో విలువైన వజ్రం బయటపడింది. రైతు దాన్ని ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచారు. వజ్రాన్ని పరీక్షించే లోపే వ్యాపారులు సదరు రైతు ఇంటి ముందు క్యూ కట్టారు. వజ్రాన్ని రూ.18 లక్షల నగదు, 10 తులాల బంగారం ఇచ్చి దాన్ని కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్‌లో దీని ధర రూ.30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్థులు పొలాల్లోకి వజ్రాల వేట కోసం పరుగులు తీశారు. అలాగే, మద్దికెర మండలం హంప గ్రామస్థునికి ఓ వజ్రం దొరికింది.  దీన్ని పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం. రూ.5 లక్షలతో నగదుతో పాటు 2 తులాల బంగారం ఇచ్చి వజ్రాన్ని సదరు వ్యాపారి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, వర్షాకాలంలో వజ్రాల కోసం స్థానిక పొలాల్లో స్థానిక గ్రామస్థులు సహా ఇతర ప్రాంతాల నుంచి సైతం భారీగా తరలివచ్చి వెతుకుతుంటారు. పొలాల్లో దొరికిన వజ్రాలను రహస్యంగా వ్యాపారులకు అమ్మేస్తుంటారు. వ్యాపారులు కూడా ఆ ప్రాంతాలకు స్థానికంగానే మకాం వేస్తారు. వజ్రాలకు పోటీ ఎక్కువైన సందర్భంలో వేలం వేస్తారు. ఆ వేలంపాటలో బంగారం, డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తుంటారు. కర్నూలు జిల్లా వాసులే కాకుండా.. అనంతపురం, కడప, ప్రకాశం, బళ్లారి ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ వజ్రాల కోసం వెతుకుతుంటారు.

Also Read: Ap Elections 2024: పోలీస్ బందోబస్తుతో వెళ్లి ఓటేసిన కుటుంబం - ఆలస్యంగా వెలుగులోకి, ఎందుకో తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget