అన్వేషించండి

Jayamangala Venkataramana: జనసేన కండువాతో మండలి చైర్మన్ వద్దకు జయమంగళ- ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదించాలని పట్టు

MLC Jayamangala: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ బుధవారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తో సమావేశమయ్యారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు.

Jayamangala Venkataramana requested accept his resignation:   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీల రాజీనామాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ  జయమంగళ వెంకటరమణ  బుధవారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. ఆయన తన మెడలో  జనసేన పార్టీ కండువా వేసుకునే విచారణకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలోనే తన పదవికి రాజీనామా చేసిన ఆయన, దానిని తక్షణమే ఆమోదించాలని మండలి చైర్మన్‌ను స్వయంగా కోరారు.

జయమంగళ వెంకటరమణ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఓడిపోవడంతో  ఆ పార్టీకి దూరమయ్యారు. గత ఏడాది  మార్చి నెలలోనే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ లేఖను సమర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అప్పటి నుండి ఆయన జనసేన నాయకుడిగానే కొనసాగుతున్నప్పటికీ, సాంకేతికంగా ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. గతంలో తన  రాజీనామాలు ఆమోదించలేదని హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు.                           

సాధారణంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినప్పుడు, వారు ఏవైనా ఒత్తిళ్లకు లోనై రాజీనామా చేశారా లేదా అన్నది నిర్ధారించుకోవడానికి స్పీకర్ , మండలి చైర్మన్ వ్యక్తిగత విచారణ  నిర్వహిస్తారు. జయమంగళ విషయంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసినప్పటికీ, మండలిలో బలం తగ్గిపోతుందనే కారణంతో లేదా సాంకేతిక కారణాల సాకుతో గతంలో వీటిని పెండింగ్‌లో ఉంచారనే విమర్శలు ఉన్నాయి. జయమంగళ స్వయంగా వచ్చి తన రాజీనామాను ధృవీకరించినందున, ఇక ఆమోదముద్ర వేయక తప్పని పరిస్థితి నెలకొంది.

విచారణ అనంతరం జయమంగళ మీడియాతో మాట్లాడారు.  తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేశానని, జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితుడనై ఆ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. నైతిక విలువలకు కట్టుబడి పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు మండలి చైర్మన్ తన నిర్ణయాన్ని గౌరవించి రాజీనామాను ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గురువారం కూడా రాజీనామా చేసిన మరో నలుగురు ఎమ్మెల్సీలతో స్పీకర్ మాట్లాడనున్నారు.                                  

 అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పుడు జయమంగళ వెంకటరమణ జగన్ ను పొగిడారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తన దేవుడు జగన్ అని ఉదయం లేవగానే ఆయన ఫోటోకు దండం పెట్టుకుంటానని చెప్పారు.  తాను అప్పుల్లో ఉన్నప్పుడు పిలిచిపదవి ఇచ్చి అప్పులన్నీ తిరిపోయేలా చేశారని  చెప్పారు.  దీంతో ఆయన రాజీనామా ఉపసంహరణపై వెనక్కి తగ్గుతారని ప్రచారం జరిగింది. కానీ జయ మంగళ మాత్రం రాజీనామాకే కట్టుబడ్డారు.                 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Embed widget