అన్వేషించండి

Jayamangala Venkataramana: జనసేన కండువాతో మండలి చైర్మన్ వద్దకు జయమంగళ- ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదించాలని పట్టు

MLC Jayamangala: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ బుధవారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తో సమావేశమయ్యారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు.

Jayamangala Venkataramana requested accept his resignation:   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్సీల రాజీనామాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ  జయమంగళ వెంకటరమణ  బుధవారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. ఆయన తన మెడలో  జనసేన పార్టీ కండువా వేసుకునే విచారణకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలోనే తన పదవికి రాజీనామా చేసిన ఆయన, దానిని తక్షణమే ఆమోదించాలని మండలి చైర్మన్‌ను స్వయంగా కోరారు.

జయమంగళ వెంకటరమణ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఓడిపోవడంతో  ఆ పార్టీకి దూరమయ్యారు. గత ఏడాది  మార్చి నెలలోనే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ లేఖను సమర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అప్పటి నుండి ఆయన జనసేన నాయకుడిగానే కొనసాగుతున్నప్పటికీ, సాంకేతికంగా ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. గతంలో తన  రాజీనామాలు ఆమోదించలేదని హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు.                           

సాధారణంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినప్పుడు, వారు ఏవైనా ఒత్తిళ్లకు లోనై రాజీనామా చేశారా లేదా అన్నది నిర్ధారించుకోవడానికి స్పీకర్ , మండలి చైర్మన్ వ్యక్తిగత విచారణ  నిర్వహిస్తారు. జయమంగళ విషయంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసినప్పటికీ, మండలిలో బలం తగ్గిపోతుందనే కారణంతో లేదా సాంకేతిక కారణాల సాకుతో గతంలో వీటిని పెండింగ్‌లో ఉంచారనే విమర్శలు ఉన్నాయి. జయమంగళ స్వయంగా వచ్చి తన రాజీనామాను ధృవీకరించినందున, ఇక ఆమోదముద్ర వేయక తప్పని పరిస్థితి నెలకొంది.

విచారణ అనంతరం జయమంగళ మీడియాతో మాట్లాడారు.  తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేశానని, జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితుడనై ఆ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. నైతిక విలువలకు కట్టుబడి పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు మండలి చైర్మన్ తన నిర్ణయాన్ని గౌరవించి రాజీనామాను ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గురువారం కూడా రాజీనామా చేసిన మరో నలుగురు ఎమ్మెల్సీలతో స్పీకర్ మాట్లాడనున్నారు.                                  

 అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పుడు జయమంగళ వెంకటరమణ జగన్ ను పొగిడారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తన దేవుడు జగన్ అని ఉదయం లేవగానే ఆయన ఫోటోకు దండం పెట్టుకుంటానని చెప్పారు.  తాను అప్పుల్లో ఉన్నప్పుడు పిలిచిపదవి ఇచ్చి అప్పులన్నీ తిరిపోయేలా చేశారని  చెప్పారు.  దీంతో ఆయన రాజీనామా ఉపసంహరణపై వెనక్కి తగ్గుతారని ప్రచారం జరిగింది. కానీ జయ మంగళ మాత్రం రాజీనామాకే కట్టుబడ్డారు.                 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget