అన్వేషించండి

Anantapur Politics : అనంతపురం జిల్లాలో టీడీపీ ఎంపీ అభ్యర్థులెవరు ? - జేసీ పవన్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా ?

Anantapur Politics : అనంతపురం జిల్లాలో ఎంపీ అభ్యర్థుల్ని చంద్రబాబు ఇంకా ఖరారు చేయలేదు. జేసీ పవన్ రెడ్డి అవకాశం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Chandrababu has not finalized the MP candidates in Anantapur district yet :  సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. అభ్యర్థులను ప్రధాన పార్టీలన్నీ ప్రకటిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే సగానికిపైగా స్థానాలపై స్పష్టతవచ్చింది. అధికార వైసిపి ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక టిడిపి తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా పార్లమెంట్‌ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన జరగలేదు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ స్థానాల్లో ఎవరిని బరిలో దింపనుందన్నది చర్చనీయాంశంగా మారింది.

పొత్తు కుదిరితే హిందూపురం పార్లమెంట్ బీజేపీకి ! 

పొత్తుల్లో భాగంగా హిందూపురం పార్లమెంట్‌ స్థానాన్ని బిజెపికి ఇచ్చే అవకాశాలున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు బిజెపి నేతలు కూడా తామంటే తాము పోటీలో ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులుగానున్న బికె.పార్థసారధికి పెనుకొండ అసెంబ్లీ టిక్కెట్టును ఈ సారి ఇవ్వలేదు. ఆయన్ను హిందూపురం ఎంపీగా నియమిస్తారన్న ప్రచారమూ ఉంది. అయితే ఆయన అసెంబ్లీ వైపే మొగ్గు చూపుతున్నారు. పొత్తులో హిందూపురం పార్లమెంట్‌ బిజెపికి ఇస్తే ఆయన్ను ఎక్కడి నుంచి బరిలో దింపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఆన్‌లైన్‌ సర్వేలో అనంతపురం అర్బన్‌ బికె.పార్థసారధి అయితే ఎలాగుంటుందని సర్వే నిర్వహించడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ సర్వే అనంతపురం అర్బన్‌ పార్టీ ఇస్తోందా లేక సాధారణమైన సర్వేనేనా అన్నది తెలియాల్సి ఉంది.

టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న జేసీ పవన్ రెడ్డి 

అనంతపురం పార్లమెంట్‌కు ఎవరు టిడిపి అభ్యర్థి అన్నది ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో జెసి.పవన్‌కుమార్‌ రెడ్డి పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసిన పవన్‌కుమార్‌రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో తిరిగి ఆయనకే ఇస్తారా.. లేక కొత్త వారి వైపు చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది. వైసిపి మాత్రం అనంతపురం అభ్యర్థిగా మాజీ మంత్రి శంకర నారాయణ పేరును ప్రకటించింది. ఆయనే అభ్యర్థి అయ్యే అవకాశముంది. సాధారణంగా అనంతపురం పార్లమెంటుకు ఎప్పుడూ బీసీలు అయితే బోయ సామాజిక తరగతికి చెందిన వారినే నియమిస్తారు. 2019లో ఆ రకంగా తలారి రంగయ్యను అభ్యర్థిగా నిలిపి జెసి.పవన్‌కుమార్‌రెడ్డిపై విజయం సాధించారు. ఇప్పుడు టిడిపి కూడా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు బరిలో దింపే ఆలోచన చేస్తోందని ప్రచారం నడిచింది. అయితే రాయదుర్గం అసెంబ్లీకే తిరిగి ఆయన్ను బరిలో నిలిపింది. ఈ మేరకు ఆయన పేరును టిడిపి అధిష్టానం ప్రకటించింది. 

బీసీ అభ్యర్థుల్నే ఖరారు చేసే అవకాశం 

కాలవ రాయదుర్గంకు వెళ్లడంతో అనంతపురం పార్లమెంటుకు జెసి.పవన్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిగా ఉంటారన్న చర్చ నడుస్తోంది. జెసి.పవన్‌కుమార్‌రెడ్డి ఇప్పటి వరకు జిల్లాలో తానే అభ్యర్థినని చెప్పిన దాఖలాల్లేవు. గతకొంతకాలంగా ఆయన జిల్లాకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. అభ్యర్థిగా ప్రకటన వెలువడిన తరువాతనే వస్తారా లేక కొత్త అభ్యర్థి అయితే ఎవరన్నది టిడిపిలో చర్చ నడుస్తోంది. హిందూపురం పొత్తుల్లో బిజెపికిపోతే అనంతపురం అభ్యర్థి బరిలో బీసీ ఉంటారా లేక ఓసీ ఉంటారా .? అన్నది తేలాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
HMPV Cases In India : భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
Embed widget