అన్వేషించండి

Chandra Babu Naidu: సీఎం జగన్ కు సున్నా మార్కులే - చంద్రబాబు

Chandra Babu Naidu: పోలవరం ముంపు ప్రాంతాలను ప్రజలను సీఎం జగన్ గోదాట్లో ముంచేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఆయనకు సున్నా మార్కులే వేస్తున్నానన్నారు.

Chandra Babu Naidu: ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో.. తెలుగు దేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. మేడేపల్లి నుంచి వాహనాలతో ర్యాలీగా వేలేరుపాడు మండలం చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను, గృహాలను చంద్రబాబు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివ కాశీపురంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం దగ్గర అమరావతి రాజధాని రైతులు.. వెయ్యి మంది బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ  కార్కక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. 

బారికేడ్లు, పరదాల చాటున పర్యటనలు..

కొందరు బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. శివకాశీపురంలో బాధితులు.. పరిహారం, పునరావాసం, వరదల సాయంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబుకు ఏకరువు పెట్టారు. మూడేళ్లుగా ప్రజల కష్టాలు పట్టని ముఖ్యమంత్రి ఇప్పుడు బారికేడ్లు, పరదాల చాటున పర్యటనలు చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆకాశంలో తిరిగితే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. కొన్ని కూరగాయలు, ఓ రెండు వేలు చేతిలో పెడితే ప్రజల కష్టాల నుంచి ఎలా గట్టెక్కుతారని నిలదీశారు. 

పోలవరంపై చేతులెత్తేశారు..

హుద్ హుద్ విపత్తు సమయంలో తెలుగు దేశం హయాంలో ఇచ్చిన జీవోను మెరుగుపరిచి మరింత ఉదారంగా సాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంటూర్ లెవల్ తగ్గించి సీఎం జగన్ కొత్త కుట్రకు తెరలేపారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరంపై కేంద్రంతో పోరాడాల్సింది పోయి చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీలందరూ రాజీనామా చేసి.. డిమాండ్ చేస్తే పోలవరం ఎందుకు పూర్తి కాదని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం ముందు ప్రాంతాలన్నింటిని కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని పునరుద్ధాటించారు. పోలవరం కోసం త్యాగం చేసిన వారికి  సాయం చేస్తానని వివరించారు. 

పది లక్షలకు బదులుగా పదివేలే ఇస్తామంటున్నారు..

అయితే పోలవరం బాధితులకు పది లక్షల రూపాయల నష్ట పరిహారం ఇస్తానని చెప్పి.. ఇప్పుడు పది వేలే ఇస్తామంటున్నారని ఆ బాధితురాలు వాపోయింది. గతంలో మీరు 5 వేలు ఇచ్చి జాబితా సిద్ధం చేశారని... ఆ జాబితా బయటకు తీసి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాలని చెప్పింది. ఉడికీ ఉడకని అన్నం పెడ్తున్నారని వివరించింది. తన భర్త చనిపోయాడని, వరదల్లో ఇళ్లు కూడా కొట్టుకుపోయిందంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. అలాగే తనకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని.. వాళ్ల పెళ్లి ఎలా చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వరదలు వచ్చిన పదిహేను రోజులు దాటిని బాధితులకు న్యాయం చేయలేని చేతకాని ప్రభుత్వం ఇదంటూ మండిపడ్డారు. సీఎం జగన్ కు సున్నా మార్కులే వేస్తున్నాని తెలిపారు. 

ఈ మధ్య పోలవరం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్... కేంద్రం నుంచి నిధులు వచ్చిన వెంటనే న్యాయం చేస్తామన్నారు. ఒకటో రెండు వేలో అయితే తాము భరించగలమని.. ఇరవై వేల కోట్లు కాబట్టి భరించే శక్తి రాష్ట్రానికి లేదన్నారు జగన్‌. కాంటూరు విషయంలో కూడా కీలక కామెంట్స్ చేశారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహవ్యక్తం చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget