అన్వేషించండి

Chandra Babu Naidu: సీఎం జగన్ కు సున్నా మార్కులే - చంద్రబాబు

Chandra Babu Naidu: పోలవరం ముంపు ప్రాంతాలను ప్రజలను సీఎం జగన్ గోదాట్లో ముంచేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఆయనకు సున్నా మార్కులే వేస్తున్నానన్నారు.

Chandra Babu Naidu: ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో.. తెలుగు దేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. మేడేపల్లి నుంచి వాహనాలతో ర్యాలీగా వేలేరుపాడు మండలం చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను, గృహాలను చంద్రబాబు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివ కాశీపురంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం దగ్గర అమరావతి రాజధాని రైతులు.. వెయ్యి మంది బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ  కార్కక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. 

బారికేడ్లు, పరదాల చాటున పర్యటనలు..

కొందరు బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. శివకాశీపురంలో బాధితులు.. పరిహారం, పునరావాసం, వరదల సాయంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబుకు ఏకరువు పెట్టారు. మూడేళ్లుగా ప్రజల కష్టాలు పట్టని ముఖ్యమంత్రి ఇప్పుడు బారికేడ్లు, పరదాల చాటున పర్యటనలు చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆకాశంలో తిరిగితే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. కొన్ని కూరగాయలు, ఓ రెండు వేలు చేతిలో పెడితే ప్రజల కష్టాల నుంచి ఎలా గట్టెక్కుతారని నిలదీశారు. 

పోలవరంపై చేతులెత్తేశారు..

హుద్ హుద్ విపత్తు సమయంలో తెలుగు దేశం హయాంలో ఇచ్చిన జీవోను మెరుగుపరిచి మరింత ఉదారంగా సాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంటూర్ లెవల్ తగ్గించి సీఎం జగన్ కొత్త కుట్రకు తెరలేపారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరంపై కేంద్రంతో పోరాడాల్సింది పోయి చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీలందరూ రాజీనామా చేసి.. డిమాండ్ చేస్తే పోలవరం ఎందుకు పూర్తి కాదని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం ముందు ప్రాంతాలన్నింటిని కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని పునరుద్ధాటించారు. పోలవరం కోసం త్యాగం చేసిన వారికి  సాయం చేస్తానని వివరించారు. 

పది లక్షలకు బదులుగా పదివేలే ఇస్తామంటున్నారు..

అయితే పోలవరం బాధితులకు పది లక్షల రూపాయల నష్ట పరిహారం ఇస్తానని చెప్పి.. ఇప్పుడు పది వేలే ఇస్తామంటున్నారని ఆ బాధితురాలు వాపోయింది. గతంలో మీరు 5 వేలు ఇచ్చి జాబితా సిద్ధం చేశారని... ఆ జాబితా బయటకు తీసి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాలని చెప్పింది. ఉడికీ ఉడకని అన్నం పెడ్తున్నారని వివరించింది. తన భర్త చనిపోయాడని, వరదల్లో ఇళ్లు కూడా కొట్టుకుపోయిందంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. అలాగే తనకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని.. వాళ్ల పెళ్లి ఎలా చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వరదలు వచ్చిన పదిహేను రోజులు దాటిని బాధితులకు న్యాయం చేయలేని చేతకాని ప్రభుత్వం ఇదంటూ మండిపడ్డారు. సీఎం జగన్ కు సున్నా మార్కులే వేస్తున్నాని తెలిపారు. 

ఈ మధ్య పోలవరం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్... కేంద్రం నుంచి నిధులు వచ్చిన వెంటనే న్యాయం చేస్తామన్నారు. ఒకటో రెండు వేలో అయితే తాము భరించగలమని.. ఇరవై వేల కోట్లు కాబట్టి భరించే శక్తి రాష్ట్రానికి లేదన్నారు జగన్‌. కాంటూరు విషయంలో కూడా కీలక కామెంట్స్ చేశారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహవ్యక్తం చేశారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad- Vijayawada National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
Lulu Lands Issue: ఇతర చోట్ల మాల్స్ కోసం భూములు కొంటున్న లూలు -ఏపీ ప్రభుత్వం చీప్‌గా ఎందుకివ్వాలి ?
ఇతర చోట్ల మాల్స్ కోసం భూములు కొంటున్న లూలు -ఏపీ ప్రభుత్వం చీప్‌గా ఎందుకివ్వాలి ?
ISRO Gaganayan Vyomitra: గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
Aadi Saikumar: ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
Advertisement

వీడియోలు

3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
New Champions in 2025 | కొత్త ఛాంపియన్స్‌‌ ఇయర్‌గా 2025
Kuldeep Yadav in India vs Australia T20 Series | టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ అవుట్
Shree Charani in Women's ODI World Cup 2025 | విజృంభించిన ఆంధ్రా అమ్మాయి
South Africa Losing 4 World Cups in 2 Years | 4 ఐసీసీ ఫైనల్స్‌లో ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad- Vijayawada National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
Lulu Lands Issue: ఇతర చోట్ల మాల్స్ కోసం భూములు కొంటున్న లూలు -ఏపీ ప్రభుత్వం చీప్‌గా ఎందుకివ్వాలి ?
ఇతర చోట్ల మాల్స్ కోసం భూములు కొంటున్న లూలు -ఏపీ ప్రభుత్వం చీప్‌గా ఎందుకివ్వాలి ?
ISRO Gaganayan Vyomitra: గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
Aadi Saikumar: ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
Hyderabad Crime News: పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
Telangana Fee Reimbursement: ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం  సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం సంస్కరణలకు కమిటీ - బెదిరిస్తున్న కాలేజీలకు షాకే !
New FASTag Rules: నవంబర్‌ 15 నుంచి కొత్త ఫాస్టాగ్‌ రూల్స్ - UPIతోనూ చెల్లించొచ్చు, క్యాష్‌తో పోలిస్తే బోలెడు బెనిఫిట్‌
FASTag లేకపోయినా టెన్షన్ అక్కర్లేదు, ఈ నెల 15 నుంచి కొత్త టోల్ రూల్స్
Hyderabad Crime News: మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
మాజీ భార్యే కిడ్నాప్ చేయించింది - అంబర్ పేట వ్యక్తి అపహరణ కేసులో ట్విస్ట్
Embed widget