అన్వేషించండి

Flood Relief: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం - రూ.3,300 కోట్లు విడుదల, వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్

AP Telangana: వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఏపీ, తెలంగాణకు తక్షణ సాయం కింద రూ.3,300 కోట్లు విడుదల చేసింది.

Central Assistance To AP And Telangana: భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఇరు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వరదల్లో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో (Sivaraj Singh Chauhan) పాటు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. అటు, తెలంగాణ సెక్రటేరియట్‌లో వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి పరిశీలించారు. కాగా, ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) నగరం గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర ప్రభావానికి గురైంది. బుడమేరు ఉద్ధృతితో నగరంలో పలు ప్రాంతాలు నీట మునగ్గా.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచిన ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) గత వారం రోజులుగా విజయవాడలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. ముంపు బాధితులకు ఆహారం, తాగునీరు అందేలా చర్యలు చేపట్టారు. అటు, తెలంగాణలోనూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వందల సంఖ్యలో బాధితులు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు ధ్వంసం కాగా కట్టుబట్టలతో మిగిలారు. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఇల్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10,000 అందించారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. భారీగా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్

తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తామని.. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపినట్లు చెప్పింది. వరదలు, డ్యాంలు, వాటి భద్రతను కేంద్ర బృందం పరిశీలించిందని పేర్కొంది. 'తెలంగాణలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 వైమానికదళ హెలికాఫ్టర్లు ఉన్నాయి. ఇవి 68 మంది రక్షించాయి. 3,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఏపీలోని 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 8 వైమానికదళ హెలికాఫ్టర్లు, 3 నౌకాదళ హెలికాఫ్టర్లు, డోర్నియల్ ఎయిర్ క్రాఫ్ట్ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రాష్ట్రంలో 350 మందిని కాపాడి 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.' అని ట్వీట్‌లో పేర్కొంది.

Also Read: Vijayawada Floods: విజయవాడ వరదలు - కరెంట్ బిల్లుల చెల్లింపుపై ఉపశమనం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
Jana Sena leader allegations: పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం - జనసేన తీవ్ర ఆరోపణలు
పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం - జనసేన తీవ్ర ఆరోపణలు
YSRCP: డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
Collectors meeting second day: ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
Patas Praveen Marriage : ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...
ఘనంగా పటాస్ ప్రవీణ్ వివాహం - ఫైమా రియాక్షన్ వైరల్... పెళ్లి వీడియో షేర్ చేస్తూ...
Tamil Nadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం.. ఉప్పొంగిపోయిన తల్లిదండ్రులు
తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం.. ఉప్పొంగిపోయిన తల్లిదండ్రులు
Mango Lassi Recipe : సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో లస్సీ.. చాలా సింపుల్​గా చేసుకోగలిగే టేస్టీ రెసిపీ ఇదే
సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో లస్సీ.. చాలా సింపుల్​గా చేసుకోగలిగే టేస్టీ రెసిపీ ఇదే
Ashu Reddy Engagement : అషు రెడ్డిది ఫేక్ ఎంగేజ్మెంట్ - అందరినీ బురిడీ కొట్టించింది... ఇదీ అసలు మ్యాటర్
అషు రెడ్డిది ఫేక్ ఎంగేజ్మెంట్ - అందరినీ బురిడీ కొట్టించింది... ఇదీ అసలు మ్యాటర్
Embed widget