అన్వేషించండి

Flood Relief: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం - రూ.3,300 కోట్లు విడుదల, వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్

AP Telangana: వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఏపీ, తెలంగాణకు తక్షణ సాయం కింద రూ.3,300 కోట్లు విడుదల చేసింది.

Central Assistance To AP And Telangana: భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఇరు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వరదల్లో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో (Sivaraj Singh Chauhan) పాటు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. అటు, తెలంగాణ సెక్రటేరియట్‌లో వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి పరిశీలించారు. కాగా, ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) నగరం గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర ప్రభావానికి గురైంది. బుడమేరు ఉద్ధృతితో నగరంలో పలు ప్రాంతాలు నీట మునగ్గా.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచిన ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) గత వారం రోజులుగా విజయవాడలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. ముంపు బాధితులకు ఆహారం, తాగునీరు అందేలా చర్యలు చేపట్టారు. అటు, తెలంగాణలోనూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వందల సంఖ్యలో బాధితులు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు ధ్వంసం కాగా కట్టుబట్టలతో మిగిలారు. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఇల్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10,000 అందించారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. భారీగా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్

తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తామని.. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపినట్లు చెప్పింది. వరదలు, డ్యాంలు, వాటి భద్రతను కేంద్ర బృందం పరిశీలించిందని పేర్కొంది. 'తెలంగాణలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 వైమానికదళ హెలికాఫ్టర్లు ఉన్నాయి. ఇవి 68 మంది రక్షించాయి. 3,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఏపీలోని 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 8 వైమానికదళ హెలికాఫ్టర్లు, 3 నౌకాదళ హెలికాఫ్టర్లు, డోర్నియల్ ఎయిర్ క్రాఫ్ట్ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రాష్ట్రంలో 350 మందిని కాపాడి 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.' అని ట్వీట్‌లో పేర్కొంది.

Also Read: Vijayawada Floods: విజయవాడ వరదలు - కరెంట్ బిల్లుల చెల్లింపుపై ఉపశమనం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget