అన్వేషించండి

Balineni Srinivasa Reddy: డబ్బులు తీసుకున్నట్లు తేలితే చెప్పుతో కొట్టండి! బాలినేని సంచలన వ్యాఖ్యలు

Distribution Of House Rails: ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. దుష్ప్రచారం చేసేవారి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

Ongole Constituency: ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, డబ్బులు తీసుకుంటున్నారని వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. తాను డబ్బులు తీసుకున్నట్లు తేలితే చెప్పుతో కొట్టండి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నానని, పట్టాల  పంపిణీని అడ్డుకునేవారి ఆఫీస్‌ను 75 వేల మందితో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నెల 25వ తేదీలోపు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేపడతామని, పట్టాలతో పాటు ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని బాలినేని హమీ ఇచ్చారు.  ఒంగోలు నియోజకవర్గంలో 25 వేల ఇళ్ల పట్టాల పంపిణీపై అధికారులతో ఆదివారం బాలినేని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై తప్పుడు రాతలు రాస్తే ఊరుకోబోనని ని వార్నింగ్ ఇచ్చారు. 

పేదలకు పంపిణీ చేయాలని వైసీసీ సర్కార్ నిర్ణయం 
ఇళ్ల పట్టాల పంపిణీకి ఎవరైనా అడ్డుపడితే సహించేది లేదని, వారి సంగతి తేలుస్తానంటూ బాలినేని హెచ్చరించారు. పట్టాలు పంపిణీ చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అన్నారు. అయితే ఒంగోలు జిల్లాలోని అగ్రహారం, చినమల్లేశ్వపురం, వెంగముక్కపాలెం గ్రామాల్లోని స్థలాలను పేదలకు పంపిణీ చేయాలని వైసీసీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆ స్థలాలను చదును చేసి రోడ్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్ల కేటాయింపులో అవినీతి జరిగిందని, అర్హత లేని కంపెనీలకు టెండర్లు అప్పగించారంటూ విపక్షాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్రికల్లో కూడా దీనిపై కథనాలు వచ్చాయి. దీంతో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో తనపై జరుగుతున్న ప్రచారంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే అంతుచూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు.

సీఎం ఊరుకున్నా, తాను వదలనన్న బాలినేని 
తనపై ఎన్ని కేసులు పెట్టినా ఫర్వాలేదని, సీఎం ఊరుకున్నా తాను వదిలేది లేదని బాలినేని వ్యాఖ్యానించారు. పట్టాలు పంపిణీ చేయడంతో పాటు ఇళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీ టౌన్‌షిప్ తరహాలో అభివృద్ది చేస్తామని అన్నారు. రూ. 251 కోట్లతో 25  వేల పట్టాలు పేదలకు పంపిణీ చేయడం జరుగుతుందని బాలినేని తెలిపారు. వైసీపీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్న బాలినేని.. తన నియోజకవర్గమైన ఒంగోలుకు చాలా రోజుల తర్వాత శనివారం వచ్చారు.

గత ఏడాది డిసెంబర్ 12న తన జన్మదిన వేడుకలను ఒంగోలులో జరుపుకున్నారు. ఆ తర్వాత 40 రోజుల పాటు నియోజకవర్గానికి రాలేదు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.201 కోట్లు విడుదల చేయడంతో జనవరి 23న నియోజకవర్గానికి వచ్చారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని హైకమాండ్  నియమించడంతో బాలినేని అసంతృప్తికి గురై హైదరాబాద్ వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్, విజయవాడలో ఉంటున్న బాలినేని.. చాలా రోజుల తర్వాత తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న బాలినేని.. వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆయన టీడీపీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget