అన్వేషించండి

Balakrishna About NTR: నా తండ్రి ఎన్టీఆర్ కు మరణం లేదు, రాజకీయాల్లో విప్లవం తెచ్చారు: బాల‌కృష్ణ

నంద‌మూరి తార‌క‌రామారావు అనే పేరు సంక్షేమానికి చిరునామా అని హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాల‌కృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ తాను ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల గుండెల్లో చిరంజీవిగా ఉంటార‌న్నారు.

TDP 41st Anniversary : నంద‌మూరి తార‌క‌రామారావు అనే పేరు సంక్షేమానికి చిరునామా అని హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాల‌కృష్ణ అన్నారు. నిరంత‌రం పేద‌ల అభ్యున్న‌తి కోసం ప‌రిత‌పించిన ఎన్టీఆర్ తాను ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల గుండెల్లో ఎప్ప‌టికీ జీవించి ఉంటార‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో జ‌రిగిన‌ తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌ల్లోనే అధికారం చేప‌ట్టిన ఎన్టీఆర్ పాల‌న‌లో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. 

ఎన్టీఆర్‌కు ముందు ఎంద‌రో రాజ‌కీయాల్లో ఉన్నా ఆయ‌న‌లా ప్ర‌జ‌ల కోసం ఆలోచించిన వారు లేర‌ని బాల‌కృష్ణ తెలిపారు. రాజ‌కీయాలు ఎన్టీఆర్‌కు ముందు ఎన్టీఆర్ త‌ర్వాత అని చెప్పుకోవాల‌ని.. ఆయ‌న టీడీపీ స్థాప‌న‌తో రాజ‌కీయాల్లో విప్ల‌వం తెచ్చార‌ని చెప్పారు. అప్ప‌టివ‌ర‌కూ రాజ‌కీయాలంటే ధ‌న‌వంతుల‌కే సొంత‌మ‌ని.. ఎన్టీఆర్ రాక‌తో బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాలకు చెందిన వారెంద‌రో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి నాయ‌కులుగా మారార‌ని బాల‌కృష్ణ గుర్తుచేశారు. పార్టీతో, పాల‌న‌తో ప్ర‌జ‌ల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్య‌క్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్‌ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. పేదల ఆకలి తెలిసిన అన్న‌గా, ప్రతి తెలుగు బిడ్డ సగర్వంగా తలఎత్తుకునేలా చేశార‌ని ప్ర‌శంసించారు. ప్రజల భవితకు భరోసా ఇవ్వ‌డ‌మే కాకుండా నవజాతికి మార్గదర్శనం చేశార‌ని. యువతకు ఆదర్శంగా నిలిచార‌ని ఎన్టీఆర్‌కు మరణం లేదు.. నిత్యం వెలిగే మహోన్నత దీప‌మ‌ని బాల‌కృష్ణ స్పష్టంచేశారు.

ఎన్టీఆర్ త‌ర్వాత ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు మాత్రం కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని బాల‌కృష్ణ తెలిపారు. వాటిని నిలిపివేసేందుకు ఎవ‌రూ సాహ‌సించ‌లేనంత‌గా ఆనాడే ప‌థ‌కాల‌కు పునాది వేసిన మ‌హ‌నీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మ‌హిళ‌ల‌కు ఆర్థిక స్వాతంత్ర్యం ఆయ‌న చ‌ల‌వేన‌ని చెప్పారు. ఇళ్లు లేని పేద‌ల‌కు పక్కా ఇళ్ల పథకం తీసుకువచ్చారని.. పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి సామాజిక సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.  మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. సహకార వ్యవస్థలో సింగల్ విండో విధానం తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. గురుకుల విద్యా బోధన, సంక్షేమ హాస్టళ్లు తీసుకువచ్చారని ఆనాటి విషయాలను ప్రజలతో పంచుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైకాపా ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని మండిపడ్డారు.

ఎన్టీఆర్ త‌ర్వాత  చంద్రబాబు యువతకు పెద్దపీట వేశారని, జీనోమ్ వ్యాలీ, బయోటెక్నాలజీ పార్కు తీసుకువచ్చారని బాల‌కృష్ణ తెలిపారు. ఆయ‌న హ‌యాంలో నల్సార్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశార‌ని గుర్తుచేశారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో హైద‌రాబాద్ వేగంగా అభివృద్ధి చెందింద‌ని, న‌గ‌రం 28 ఫ్లైఓవ‌ర్లు నిర్మించి ట్రాఫిక్ ర‌ద్దీని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించార‌ని తెలిపారు. ఎంఎంటీస్ ద్వారా లక్షలాది మందికి ప్రయాణ సౌకర్యం కల్పించార‌ని, రైతులకు పెద్దఎత్తున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చార‌ని పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన శాస‌న‌మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఘన విజయం అందించారని.. రాబోయే ఎన్నిక‌ల్లోనూ ఇదే ఒర‌వ‌డి కొన‌సాగిస్తామ‌ని ప్రజలు తమ భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ పూనాల‌ని బాలకృష్ణ కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
MS Dhoni Trolling:  కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
SBI clerk prelims Results 2025: ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- డైరెక్ట్ లింక్ ఇదే
ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- డైరెక్ట్ లింక్ ఇదే
Mad Square Day 1 Collections: తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కుర్రాళ్ళు... 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కుర్రాళ్ళు... 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
Myanmar Earthquake Death Toll: మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూకంపాలు, 700 దాటిన మృతుల సంఖ్య- శిథిలాల కింద ఎందరో
మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూకంపాలు, 700 దాటిన మృతుల సంఖ్య- శిథిలాల కింద ఎందరో
Embed widget