అన్వేషించండి

AP News: భారీగా పెరుగతున్న బియ్యం, పప్పు ధరలు - ఎంతంటే?

AP News: విదేశాలకు ఎగుమతులపై నిషేధం విధించడంతో.. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం ధరలైతే కాస్త తగ్గించారు. బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు సరికదా.. రెండు నెలల క్రితంతో పోలిస్తే పెరిగాయి.

AP News: విదేశాలకు బియ్యం ఎగుమతులను నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఈ నిషేధంతో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం ధరలు కాస్త తగ్గాయి. బియ్యం ధరలు మాత్రం అస్సలే తగ్గడం లేదు. తగ్గడం మాట పక్కన పెడితే రెండు నెలల క్రితంతో పోలిస్తే మరింత పెరిగాయి. సన్న బియ్యం ధర కిలో 60 రూపాయల నుంచి 63 రూపాయల మధ్యకు చేరింది. మధ్యరకం బియ్యం ధర కూడా కిలో 50 పైనే ఉంది. అలాగే బియ్యంతో పాటు పప్పుల ధరలు కూడా మరింత పెరిగాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో బియ్యం ధరలు తగ్గడం లేదు. అనేక రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లో ఇష్టానుసారం అమ్మకాలు చేపడుతున్నారు. మంచి కందిపప్పు కొనాలంటే కిలో 160 రూపాయల నుంచి 180 రూపాయల వరకూ పలుకుతోంది. 2018 ఆగస్టు నెలతో పోలిస్తే బియ్యం ధర 30 శాతం పెరిగింది. అలాగే కంది పప్పు ధర 146 శాతానికి దూసుకొచ్చింది. ఇక మినుముల ధర కూడా గతంతో పోలిస్తే.. కిలో 20 రూపాయలకు పెరిగింది. ప్రతీ నెలా పెరుగుతున్న ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై మరింత భారం పడుతోంది. ప్రస్తుతం సర్కారు రేషన్‌ దుకాణాల ద్వారా రాయితీ కందిపప్పు ఇవ్వడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.

75 కిలోల ధాన్యం బస్తా ధర రెండు నెలల కిందటితో పోలిస్తే.. 100 రూపాయల వరకు తగ్గింది. రైతుల నుంచి 1800 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన రకాలు అయితే 2450 రూపాయల వరకు ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో.. ఇక పెరిగే అవకాశం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇందుకు అనుగుణంగా బియ్యం ధరలు కూడా కిలోకు రూ.3 వరకు తగ్గాల్సి ఉంది. అయితే ఎక్కడా ఆ పరిస్థితే కనిపించడం లేదు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు నెల్లూరు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల సన్నబియ్యం కిలో రూ.63 వరకు విక్రయిస్తున్నారు. పట్టణాల్లో బ్రాండెడ్‌ రకాల బియ్యం కిలో ధర 60 రూపాయల వరకు ఉంది. ఇక 26 కిలోల బస్తా అయితే రెండు నెలల క్రితం 1,350 రూపాయల నుంచి 1400 వరకు ఉండగా.. ఇప్పుడు 1,500 నుంచి 1,600 వరకు అమ్ముతున్నారు. సన్నబియ్యంలోనే తెలుపు, మసర వంటి తదితర రకాలు ఉన్నాయి. పాలిష్‌ బియ్యంతో పోలిస్తే ఇవి కిలోకు మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయల వరకు తక్కువగా ఉంటాయి. అన్ని సరుకుల ధరలు పెరగడంతో 50 రూపాయల నుంచి 54 రూపాయల మధ్యకు చేరాయి. మరోవైపు కందిపప్పు ధరలు కూడా విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. దుకాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కిలో 160 రూపాయల నుంచి 170 మధ్య విక్రయిస్తున్నారు. 2023 జనవరి నాటితో పోలిస్తే కిలోకు 50 రూపాయలకు పైగా పెరిగింది. మధ్యరకం కందిపప్పు కూడా కిలో 150 రూపాయల నుంచి 160 రూపాయల వరకు పలుకుతోంది. రాష్ట్రంలో కంది సాధారణ విస్తీర్ణం 6.30 లక్షల ఎకరాలు కాగా.. 2.57లక్షల ఎకరాల్లోనే పంట వేశారు. ధరలు పెరగడానికి ఇది కూడా ఓ కారణమేనని అధికారులు చెబుతున్నారు. 

రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీపై తెలంగాణ సర్కారు చేతులు ఎత్తేసింది. కిలో పప్పు కూడా ఇవ్వలేమంటూ ప్రభుత్వం చెబుతోంది. 2018లో కార్డుకు 2 కిలోలు చొప్పున కిలో కందిపప్పు 40 రూపాయల రాయితీతో ఇచ్చేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కిలో ధర 67 రూపాయలకు చేసి కార్డుకు కిలో చొప్పునే ఇవ్వాలని నిర్ణయించింది. మూడు నెలలుగా అది కూడా ఇవ్వడం లేదు. జూన్‌, జులై నెలల్లో ఇవ్వాల్సిన కందిపప్పు కూడా కలిపి ఒక్కో కార్డుపై రెండు కిలోలు ఇస్తామన్న మంత్రి నాగేశ్వరరావు మాటలు అలాగే మిగిలిపోయాయి. 

టాప్ హెడ్ లైన్స్

Hero Surge S32: 3 నిమిషాల్లో ఆటో నుంచి స్కూటర్‌గా మారే హీరో సర్జ్‌ఎస్‌ 32! చంద్రబాబు పరిశీలించిన వెహికల్‌  పూర్తి వివరాలు ఇవే!
3 నిమిషాల్లో ఆటో నుంచి స్కూటర్‌గా మారే హీరో సర్జ్‌ఎస్‌ 32! చంద్రబాబు పరిశీలించిన వెహికల్‌  పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh: జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
Breaking News: అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
Pawan Kalyan On Social Media: సోషల్ మీడియాలో విమర్శలపై పవన్ సీరియస్‌! ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం!
సోషల్ మీడియాలో విమర్శలపై పవన్ సీరియస్‌! ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Username Feature:భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget