అన్వేషించండి

Improvement For Inter 2nd Year: ఇకపై ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ రాసే ఛాన్స్.. ఫీజు కట్టేయండి

AP Inter Second Year Students | ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ ఏడాది నుంచే ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మే 21 నుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయవచ్చు.

AP Advanced Supplementary Exams |అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటివరకు కేవలం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్ రాసే అవకాశాన్ని, ఇకపై ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కూడా కల్పిస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచే ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోని బోర్డుల విధానాలను పరిశీలించిన అనంతరం, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ సప్లిమెంటరీ నుంచే అమలు
మే 21వ తేదీ నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఈ కొత్త నిబంధన అమలు కానుంది. గత నెలలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన లేదా ఫెయిల్ అయిన ఇంటర్ సెకండియర్ విద్యార్థులందరూ తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి ఈ Single Attempt అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. విద్యార్థి రాసిన పరీక్షల్లో ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే, వాటినే తుది ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ప్రాక్టికల్ పరీక్షలకు మాత్రం ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశం ఉండదని బోర్డు స్పష్టం చేసింది.

పరీక్ష రాయాలనుకున్న విద్యార్థులు ఏప్రిల్ 20 నుంచి 27వ తేదీలోపు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్ మెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సాధారణ పరీక్ష ఫీజు రూ. 600తో పాటు, ఇంప్రూవ్‌మెంట్ రాసే ప్రతి సబ్జెక్టుకు అదనంగా రూ. 160 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే వరకు ఎన్నిసార్లైనా పరీక్ష రాసే వీలు కల్పించారు. ఈ నిర్ణయం వల్ల ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు తమ పర్సంటేజీని పెంచుకోవడానికి మంచి అవకాశం లభించినట్లయిందని చర్చించుకుంటున్నారు.

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ లో 77 శాతం విద్యార్థులు పాస్ కాగా, సెకండియర్ లో 81 శాతం పాసయ్యారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రీకౌంటింగ్, రివెరిఫికేషన్ తో పాటు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇటీవల విడుదల చేశారని తెలిసిందే. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Idupu Kayitham: ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
Advertisement

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget