అన్వేషించండి

Governer Delhi : ఢిల్లీలో ఏపీ గవర్నర్ మూడు రోజుల పర్యటన ! కేంద్రానికి నివేదికలిస్తారా ?

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మూడు రోజుల పర్యటనకు ఢిల్లీకి వెళ్తున్నారు. ఓ రోజు రాష్ట్రపతి నేతృత్వంలో జరిగే గవర్నర్ల సదస్సులో పాల్గొంటారు. ఏపీలో ఉన్న పరిస్థితులపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే అవకాశం ఉంది.


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన హస్తినలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలో డిల్లీలో గవర్నర్ల సదస్సు జరగనుంది. గురువారం జరిగే ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు అవుతారు.  ఏపీ పరిస్థితులపై గవర్నర్.. రాష్ట్రపతికి నివేదిక అందిస్తారు. ఒక్క బిశ్వభూషణే కాకుండా అన్ని  రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి నివేదికలు సమర్పిస్తారు. ఇదంతా రొటీన్‌గా జరిగే సమావేశమే. 

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ !

అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ .. రాష్ట్రపతితో సమావేశానికి ముందే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అవనున్నారు. మర్యాదపూర్వక భేటీనేనని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. అయితే గవర్నర్ మరికొన్ని ముఖ్యమైన సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇటీవల ఉద్రిక్తంగా మారాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వివిధ అంశాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు ఇచ్చినట్లుగా చెప్పారు. రాష్ట్రపతి పాలన విధించాలని కోరినట్లుగా వారు తెలిపారు. 

Also Read : రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?

ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రాష్ట్రపతిని కలిసి.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఈ పరిణామాల కారణంగా గవర్నర్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడుల విషయంలో కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు చేసినా అటు కేంద్రం కానీ.. ఇటు రాష్ట్రపతి కానీ ఎలాంటి వివరాలను ఆరా తీయలేదని.. అందుకే గవర్నర్ ప్రత్యేకంగా నివేదిక ఇచ్చే అవకాశం లేదని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

Also Read : కేంద్రంపై ఈ దూకుడు 14వ తేదీన చూపిస్తారా ? సదరన్ కౌన్సిల్ భే్టీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటవుతారా ?

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని.. ఆ దిశగా గవర్నర్ ఎలాంటి నివేదికలు ఇవ్వరని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షంపై దాడుల విషయంలోనే కాకుండా ఏపీ ఆర్థిక పరిస్థితి విషయంలోనూ ఇటీవల గవర్నర్ కొన్ని కీలక విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గవర్నర్ సావరిన్ ఇమ్యూనిటీని తాకట్టు పెట్టి రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ కింద రుణం తీసుకోవడం.. దాన్ని బడ్జెట్ పద్దుల్లో చూపించకపోవడం వంటివి గవర్నర్ తన నివేదికలో వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే అధికార పార్టీ వర్గాల్లో గవర్నర్ టూర్‌పై కాస్తంత టెన్షన్ నెలకొంది. 

Also Read : టీటీడీలో కార్పొరేషన్ కలకలం... ఉద్యోగులకు పవన్ కల్యాణ్ బాసట... సుప్రీంతీర్పు ఉల్లంఘనంటూ విమర్శలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget