అన్వేషించండి

Governer Delhi : ఢిల్లీలో ఏపీ గవర్నర్ మూడు రోజుల పర్యటన ! కేంద్రానికి నివేదికలిస్తారా ?

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మూడు రోజుల పర్యటనకు ఢిల్లీకి వెళ్తున్నారు. ఓ రోజు రాష్ట్రపతి నేతృత్వంలో జరిగే గవర్నర్ల సదస్సులో పాల్గొంటారు. ఏపీలో ఉన్న పరిస్థితులపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే అవకాశం ఉంది.


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన హస్తినలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలో డిల్లీలో గవర్నర్ల సదస్సు జరగనుంది. గురువారం జరిగే ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు అవుతారు.  ఏపీ పరిస్థితులపై గవర్నర్.. రాష్ట్రపతికి నివేదిక అందిస్తారు. ఒక్క బిశ్వభూషణే కాకుండా అన్ని  రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి నివేదికలు సమర్పిస్తారు. ఇదంతా రొటీన్‌గా జరిగే సమావేశమే. 

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ !

అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ .. రాష్ట్రపతితో సమావేశానికి ముందే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అవనున్నారు. మర్యాదపూర్వక భేటీనేనని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. అయితే గవర్నర్ మరికొన్ని ముఖ్యమైన సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇటీవల ఉద్రిక్తంగా మారాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వివిధ అంశాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు ఇచ్చినట్లుగా చెప్పారు. రాష్ట్రపతి పాలన విధించాలని కోరినట్లుగా వారు తెలిపారు. 

Also Read : రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?

ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రాష్ట్రపతిని కలిసి.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఈ పరిణామాల కారణంగా గవర్నర్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడుల విషయంలో కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు చేసినా అటు కేంద్రం కానీ.. ఇటు రాష్ట్రపతి కానీ ఎలాంటి వివరాలను ఆరా తీయలేదని.. అందుకే గవర్నర్ ప్రత్యేకంగా నివేదిక ఇచ్చే అవకాశం లేదని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

Also Read : కేంద్రంపై ఈ దూకుడు 14వ తేదీన చూపిస్తారా ? సదరన్ కౌన్సిల్ భే్టీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటవుతారా ?

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని.. ఆ దిశగా గవర్నర్ ఎలాంటి నివేదికలు ఇవ్వరని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షంపై దాడుల విషయంలోనే కాకుండా ఏపీ ఆర్థిక పరిస్థితి విషయంలోనూ ఇటీవల గవర్నర్ కొన్ని కీలక విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గవర్నర్ సావరిన్ ఇమ్యూనిటీని తాకట్టు పెట్టి రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ కింద రుణం తీసుకోవడం.. దాన్ని బడ్జెట్ పద్దుల్లో చూపించకపోవడం వంటివి గవర్నర్ తన నివేదికలో వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే అధికార పార్టీ వర్గాల్లో గవర్నర్ టూర్‌పై కాస్తంత టెన్షన్ నెలకొంది. 

Also Read : టీటీడీలో కార్పొరేషన్ కలకలం... ఉద్యోగులకు పవన్ కల్యాణ్ బాసట... సుప్రీంతీర్పు ఉల్లంఘనంటూ విమర్శలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Vallabhaneni Vamsi: బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
Breaking News: రేవూరి పేరును రేవంత్ ఎలా ప్రకటిస్తారు? మంత్రి కొండా సురేఖ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
రేవూరి పేరును రేవంత్ ఎలా ప్రకటిస్తారు? మంత్రి కొండా సురేఖ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
Botsa Anusha Political Entry: రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన
రాజకీయాల్లోకి బొత్స సత్యనారాయణ వారసురాలు అనూష.. ఎన్నికల్లో పోటీపై సైతం ప్రకటన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget