అన్వేషించండి

Governer Delhi : ఢిల్లీలో ఏపీ గవర్నర్ మూడు రోజుల పర్యటన ! కేంద్రానికి నివేదికలిస్తారా ?

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మూడు రోజుల పర్యటనకు ఢిల్లీకి వెళ్తున్నారు. ఓ రోజు రాష్ట్రపతి నేతృత్వంలో జరిగే గవర్నర్ల సదస్సులో పాల్గొంటారు. ఏపీలో ఉన్న పరిస్థితులపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే అవకాశం ఉంది.


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన హస్తినలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలో డిల్లీలో గవర్నర్ల సదస్సు జరగనుంది. గురువారం జరిగే ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు అవుతారు.  ఏపీ పరిస్థితులపై గవర్నర్.. రాష్ట్రపతికి నివేదిక అందిస్తారు. ఒక్క బిశ్వభూషణే కాకుండా అన్ని  రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి నివేదికలు సమర్పిస్తారు. ఇదంతా రొటీన్‌గా జరిగే సమావేశమే. 

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ !

అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ .. రాష్ట్రపతితో సమావేశానికి ముందే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అవనున్నారు. మర్యాదపూర్వక భేటీనేనని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. అయితే గవర్నర్ మరికొన్ని ముఖ్యమైన సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇటీవల ఉద్రిక్తంగా మారాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వివిధ అంశాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు ఇచ్చినట్లుగా చెప్పారు. రాష్ట్రపతి పాలన విధించాలని కోరినట్లుగా వారు తెలిపారు. 

Also Read : రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?

ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రాష్ట్రపతిని కలిసి.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఈ పరిణామాల కారణంగా గవర్నర్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడుల విషయంలో కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు చేసినా అటు కేంద్రం కానీ.. ఇటు రాష్ట్రపతి కానీ ఎలాంటి వివరాలను ఆరా తీయలేదని.. అందుకే గవర్నర్ ప్రత్యేకంగా నివేదిక ఇచ్చే అవకాశం లేదని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

Also Read : కేంద్రంపై ఈ దూకుడు 14వ తేదీన చూపిస్తారా ? సదరన్ కౌన్సిల్ భే్టీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటవుతారా ?

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని.. ఆ దిశగా గవర్నర్ ఎలాంటి నివేదికలు ఇవ్వరని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షంపై దాడుల విషయంలోనే కాకుండా ఏపీ ఆర్థిక పరిస్థితి విషయంలోనూ ఇటీవల గవర్నర్ కొన్ని కీలక విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గవర్నర్ సావరిన్ ఇమ్యూనిటీని తాకట్టు పెట్టి రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ కింద రుణం తీసుకోవడం.. దాన్ని బడ్జెట్ పద్దుల్లో చూపించకపోవడం వంటివి గవర్నర్ తన నివేదికలో వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే అధికార పార్టీ వర్గాల్లో గవర్నర్ టూర్‌పై కాస్తంత టెన్షన్ నెలకొంది. 

Also Read : టీటీడీలో కార్పొరేషన్ కలకలం... ఉద్యోగులకు పవన్ కల్యాణ్ బాసట... సుప్రీంతీర్పు ఉల్లంఘనంటూ విమర్శలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

వీడియోలు

రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Maruti Swift Tax Free: మారుతి స్విఫ్ట్ టాక్స్ ఫ్రీ! ఇలా కొనుగోలు చేస్తే వారికి 1.89 లక్షలు ఆదా
మారుతి స్విఫ్ట్ టాక్స్ ఫ్రీ! ఇలా కొనుగోలు చేస్తే వారికి 1.89 లక్షలు ఆదా
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Embed widget