అన్వేషించండి

AP Governor: 'నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పాలన' - ఏపీ ప్రభుత్వంపై గవర్నర్ ప్రశంసలు, ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

Andhra News: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా పేదలందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పాలనను ప్రభుత్వం అందిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. విజయవాడలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.

AP Governor Abdul Nazeer Speech: రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా.. ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా పేదలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) ప్రశంసించారు. విజయవాడ (Vijayawada) ఇందిరా గాంధీ స్టేడియంలో ఆయన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్.. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 'ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. నాడు - నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుత పాలన రానున్న రోజుల్లో మంచి ఫలితం ఇస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత. ఐకమత్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అంతా కృషి చేయాలి. సంక్షేమ పాలనకు నా అభినందనలు.' అని పేర్కొన్నారు.

వారికి అభినందనలు

గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదొడుకులను ఎదుర్కొందని.. అలాంటి సమయంలో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలని గవర్నర్ నజీర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 56 నెలలుగా గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు చేపడుతున్నట్లు కొనియాడారు. 'రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుంది. విలేజ్ క్లినిక్స్ తో గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలు అందుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. అమ్మఒడి పథకంతో ప్రతీ పేద విద్యార్థీ చదువుకోగలుగుతున్నాడు. జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా విదేశాల్లో చదివేందుకు అవకాశం కలుగుతుంది. ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ తో వైద్యం అభినందనీయం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నాణ్యమైన వైద్యం ప్రజలకు అందుతుంది. 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. పరిపాలన సంస్కరణల్లో భాగంగానే 13 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతుల ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం.' అని వివరించారు.

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

గణతంత్ర దినోత్సవం సందర్భంగా శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకతను తెలిపేలా ఈ శకటాన్ని రూపొందించారు. గవర్నర్ సహా సీఎం దంపతులు శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అలాగే, సంక్షేమ పథకాల శకటాలు సైతం అబ్బురపరిచాయి.

అసెంబ్లీ వద్ద జెండా ఆవిష్కరణ

రిపబ్లిక్ డే పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ తమ్మినేని సీతారాం జెండా ఆవిష్కరించారు. శాసనమండలి ఆవరణలో ఛైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్ర పటానికి స్పీకర్, మండలి ఛైర్మన్ నివాళి అర్పించారు. అటు, ఏపీ సచివాలయంలో ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read: Padma Awards 2024: చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్ - పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana : తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana : తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Embed widget