అన్వేషించండి

AP Governor: 'నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పాలన' - ఏపీ ప్రభుత్వంపై గవర్నర్ ప్రశంసలు, ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

Andhra News: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా పేదలందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పాలనను ప్రభుత్వం అందిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. విజయవాడలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.

AP Governor Abdul Nazeer Speech: రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా.. ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా పేదలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) ప్రశంసించారు. విజయవాడ (Vijayawada) ఇందిరా గాంధీ స్టేడియంలో ఆయన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్.. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 'ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. నాడు - నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుత పాలన రానున్న రోజుల్లో మంచి ఫలితం ఇస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత. ఐకమత్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అంతా కృషి చేయాలి. సంక్షేమ పాలనకు నా అభినందనలు.' అని పేర్కొన్నారు.

వారికి అభినందనలు

గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదొడుకులను ఎదుర్కొందని.. అలాంటి సమయంలో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలని గవర్నర్ నజీర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 56 నెలలుగా గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు చేపడుతున్నట్లు కొనియాడారు. 'రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుంది. విలేజ్ క్లినిక్స్ తో గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలు అందుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. అమ్మఒడి పథకంతో ప్రతీ పేద విద్యార్థీ చదువుకోగలుగుతున్నాడు. జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా విదేశాల్లో చదివేందుకు అవకాశం కలుగుతుంది. ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ తో వైద్యం అభినందనీయం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నాణ్యమైన వైద్యం ప్రజలకు అందుతుంది. 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. పరిపాలన సంస్కరణల్లో భాగంగానే 13 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతుల ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం.' అని వివరించారు.

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

గణతంత్ర దినోత్సవం సందర్భంగా శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకతను తెలిపేలా ఈ శకటాన్ని రూపొందించారు. గవర్నర్ సహా సీఎం దంపతులు శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అలాగే, సంక్షేమ పథకాల శకటాలు సైతం అబ్బురపరిచాయి.

అసెంబ్లీ వద్ద జెండా ఆవిష్కరణ

రిపబ్లిక్ డే పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ తమ్మినేని సీతారాం జెండా ఆవిష్కరించారు. శాసనమండలి ఆవరణలో ఛైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్ర పటానికి స్పీకర్, మండలి ఛైర్మన్ నివాళి అర్పించారు. అటు, ఏపీ సచివాలయంలో ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read: Padma Awards 2024: చిరంజీవి, వెంకయ్యకు పద్మ విభూషణ్ - పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
YS Sharmila: 25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
25 వేల బోడి ప్రోత్సాహకం కోసం మూడో బిడ్డను కనాలనడం ప్రజలను ఎగతాళి చేయడమే - చంద్రబాబుపై షర్మిల విమర్శలు
Sri Ramanavami Brahmotsavams: మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!
మార్చి 26 నుంచి ఏప్రిల్ 05 వరకు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget