అన్వేషించండి

AP Assembly Sessions : 21 నుంచే ఏపీ అసెంబ్లీ - సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ

Andhra News : 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే స్పీకర్ ఎన్నిక పూర్తి చేస్తారు

AP Assembly Sessions From June 21st :     ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను 21, 22 తేదీల్లో నిర్వహించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. మొదట 19వ తేదీ నుంచి అనుకున్నారు.. తర్వాత మంత్రులు ఇంకా  పూర్తి స్థాయిలో  బాధ్యతలు తీసుకోకపోవడం వల్ల 24వ తేదీకి మార్చారు. అయితే ఇప్పుడు ముందుగా సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయడానికి 21, 22 తేదీల్లో అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.  

స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు పేరును చంద్రబాబు ఖరారు చేశారు. అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ పదవికి పోటీ పడే బలం వైసీపీకి లేదు. అందుకే వైసీపీ పోటీ చేసే అవకాశం లేదు. అలాగే అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఉంటే... మద్దతు తెలిపే అవకాశం కూడా ఉండదని అంచనా వేస్తున్నారు. సభా సంప్రదాయాల ప్రకారం.. అసెంబ్లీలోని వివిధ పార్టీలో శానసభాపక్ష నేతలందరూ.. స్పీకర్ ను చెయిర్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. ఈ సారి ఆ సంప్రదాయాన్ని వైసీపీ పాటించడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు. ఆయనే  స్పీకర్ గా ఎన్నికవనుండటంతో.. మరో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా సభ్యులతో ప్రమాణం  చేయించనున్నారు.                 

అసెంబ్లీ సమావేశాల విషయంలో వైసీపీ కూడా కన్ ఫ్యూజ్ అయింది. మొదట 19వ తేదీన అసెంబ్లీ సమావేశాలని ప్రచారం జరగడంతో 18వ తేదీన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలనుకున్నారు. కానీ ఇరవై నాలుగో తేదీకి వాయిదా పడటంతో తమ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్ని కూడా వాయిదా వేసుకున్నారు. 22వ తేదీన నిర్వహించాలనుకున్నారు. సీఎం జగన్ రెండు రోజుల పులివెందుల పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.                                                                

మంగళవారం ఆయన పులివెందులకు వెళ్లి రెండు రోజుల పాటు అక్కడ ఉండి 21వ తేదీన తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. 22వ తేదీన కార్యవర్గ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై  చర్చించాలనుకున్నారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ షెడ్యూల్ రివర్స్ లోకి వచ్చింది. ముందుగు రావడంతో జగన్ ఏం  చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలంటే 20వతేదీలోపే నిర్వహించాలి. 

అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నదానిపై వైసీపీ వైపు నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అయితె ఎమ్మెల్యేగా గెలిచిప్పటికీ ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాణం చేయకపోతే అధికారిక ఎమ్మెల్యేగా గుర్తింప రాదు. అందుకే ప్రమాణ స్వీకారానికి తప్పనిసరిగా వెళ్తారంటున్నారు.             

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 రోజుల్లో నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
10 రోజుల్లో నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
Embed widget