అన్వేషించండి

AP Employees Samme : సమ్మెలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. 21న సీఎస్‌కు నోటీసు !

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ఏపీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. 21వ తేదీన సీఎస్‌కు నోటీసులు ఇవ్వనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తగ్గించడం, హెచ్‌ఆర్‌ఏనూ కోత పెట్టడం, ఫిట్‌మెంట్ కన్నా ఎక్కువగా ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయాలని ఆదేశించడం.. డీఏలన్నీ కోత పడిన జీతానికి సరి పెట్టడంతో  ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయి. ఆరేడు డీఏలు కలిసినా పీఆర్సీ వల్ల ఒక్క రూపాయి జీతం పెరగకపోగా హెచ్‌ఆర్‌ఏ భారీగా తగ్గిపోవడంతో .. జీతంలో కోత పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.  దీంతో ఉద్యోగ సంఘ నేతలపై ఒత్తిడి పెరిగింది. 

Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు

మధ్యాహ్నం ప్రెస్‌మీట్ పెట్టిన చీఫ్ సెక్రటరీ ఇక ఎలాంటి మార్పులు చేసేది లేదని ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు లేదని తేల్చేశారు. అంతే కాకుండా ప్రభుత్వం చాలా ఎక్కువగా ఉద్యోగులపై ఖర్చు పెడుతోందన్నారు. ఈ సమాచారంతో ఉద్యోగులు మరితం ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రతి ఒక్క ఉద్యోగికి రూ.6 నుంచి 7వేల వరకు జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందని ఎపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పీఆర్‌సీ వద్దు.. డీఏలతో కూడిన 27శాతం ఐఆర్‌ ఇస్తున్న పాత జీతమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: AP PRC : ఏపీ పీఆర్సీ జీతాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ? - పెన్షనర్లకు లాభమా ? నష్టమా ? ... ఏ టూ జడ్ ఎనాలసిస్ ఇదిగో..

ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టుపెట్టేందుకు తాము సిద్ధంగా లేమని... సమ్మెకు దిగాలని నిర్ణయించాయని బండి శ్రీనివాసరావు ప్రకటించారు. 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగుల ఆశలను వమ్ము చేయమన్నారు. జీవోలను వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ఉద్యోగ సంఘం నేతలు ఇప్పటికే ప్రకటించారు.  

Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు

ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. సమ్మె చేసి ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తే ప్రత్యామ్నాయ చర్యలకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అన్ని పనులు చేయడానికి రెడీగా ఉన్నారు. వారు కూడా సమ్మెలోకి వెళ్తే వాలంటీర్లు రెడీగా ఉన్నారు. ఇంకా కావాలంటే తాత్కాలిక నియామకులు జరుపుకుని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాలనే ఆలోచన చేసే అవకాశం ఉంది. గతంలో సమ్మె చేస్తున్న ఉద్యోగుల్ని ఒక్క కలం పోటుతో డిస్మిస్ చేసి.. తమిళనాడు సీఎం జయలలిత సంచలనం సృష్టించారు. ఆ తరహా పరస్థితులు ఏర్పడతాయేమోనన్న చర్చ ప్రారంభమైంది. 

Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

 

 

టాప్ హెడ్ లైన్స్

Sri Sundararaja Swamy: తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!
తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget