అన్వేషించండి

Pawan Kalyan: 'ఆ మొక్కలు పెంచొద్దు' - వన మహోత్సవంలో పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు

Andhra News: రాష్ట్రంలో కోనోకార్పస్ మొక్కలు పెంచడం మానేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. దేశీయ మొక్కలనే ఎక్కువగా పెంచాలని అన్నారు.

AP Deputy CM Pawan Kalyan Comments In Vana Mahotsavam: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతోన్న వన మహోత్సవం (Vana Mahotsavam) ఓ సామాజిక బాధ్యత అని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలని అన్నారు. 'దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం. అరబ్ దేశాలే కోనో కార్పస్ మొక్కలను వద్దనుకున్నాయి. పచ్చదనం కోసం ఆ జాతి మొక్కలు అక్కడ విరివిగా పెంచారు. అనంతరం ఆ మొక్కల వల్ల జరిగే దుష్ప్రభావాన్ని అర్థం చేసుకుని ఈ మొక్కను వద్దనుకుని నిషేధించాయి. దీని వల్ల జరిగే అనర్ధాలు అధికం. భూగర్భ జల సంపదను ఎక్కువగా వినియోగించుకోవడం సహా చుట్టుపక్కల ఉన్న వారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కోనో కార్పస్ మొక్కను పశువులు తినవు. పక్షులు గూడు పెట్టుకోవు. చెట్లను ఆశ్రయించే క్రిమి కీటకాలు రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను మనం పెంచడం సరికాదు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఈ మొక్కను పెంచడం మానేయాలి. మన దేశంలో తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు సైతం కోనోకార్పస్‌ను నిషేధించాయి. అందరికీ మేలు చేసే మొక్కలే మన నేస్తాలు.' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

'జీవోఐఆర్ పునరుద్ధరణ'

పారదర్శక పాలనకు సాక్ష్యంగా జీఓఐఆర్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించామని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో.. ఏ ఉత్తర్వులు వెలువడుతున్నాయో అనేది తెలుసుకోవడం ప్రజల హక్కు అని గురువారం ట్విట్టర్ వేదికగా చెప్పారు. 'ప్రభుత్వ శాఖలు ఏ ఉత్తర్వులు ఇస్తున్నాయో ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. గత పాలకులు వాటిని గోప్యంగా ఉంచి ప్రజలకు సమాచారం అనేదే లేకుండా చేశారు. కానీ, మా ప్రభుత్వం అలాంటి నియంతృత్వ పోకడలను తోసిపుచ్చుతోంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని చెప్పడానికి ఈ వెబ్ సైట్ పనురద్ధరణే ఓ ఉదాహరణ.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: YSRCP Sajjala : సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి - ఆయనను పక్కన పెడితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget