అన్వేషించండి

CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Andhra News: సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన నగరాల నుంచి పల్లెలకు ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులు ఉపయోగించుకోవాలని సూచించారు.

CM Chandrababu Key Orders To APSRTC: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చే వారితో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, బస్టాండ్లు రద్దీగా మారాయి. అటు, హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వందల కొద్దీ వాహనాలతో ట్రాఫిక్ జాం నెలకొంది. గంటకు 900 వాహనాల వరకూ టోల్ ప్లాజాను దాటుతున్నట్లు తెలుస్తోంది. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటు, రద్దీ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కీలక సూచనలు చేశారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులు తీసుకుని ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిట్ నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేసి వాటి ద్వారా ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. రద్దీ తీవ్రంగా ఉన్న మార్గాల్లో ఈ తరహా ఏర్పాట్లతో ప్రజలకు కొంతమేర ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పారు.

ఈ ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు బస్సులు, అవసరమైతే స్కూల్ బస్సులను ఉపయోగించుకొని, గ్రామాలు, పట్టణాలకు అదనపు ట్రిప్స్ నడిపి ప్రజలకు అసౌకర్యం లేకుండా చెయ్యాలని ఆదేశించారు. సొంతూరికి వెళ్లేందుకు ఏ ఒక్క ప్రయాణికుడు ఇబ్బంది పడకుండా చూడాలని అన్ని జిల్లాల ఆర్టీసీ ఆర్ఎంలకు నిర్దేశించారు. 

కాగా, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా పండుగకు సొంతూళ్లకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని ప్రధాన నగరాలైన విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం సహా పలు నగరాల్లో బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. నగరాలు, పట్టణాల నుంచి ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు లక్షలాది మంది వస్తోన్న క్రమంలో ఎన్ని అదనపు బస్సులు, సర్వీసులు వేసినా అవి సరిపోవడం లేదు. ఆర్టీసీ పల్లెవెలుగు, సాధారణ సర్వీసులు నిరంతరం తిప్పుతున్నా రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రత్యమ్నాయంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు.

హైవేపై భారీగా ట్రాఫిక్ జాం

అటు, పండుగకు సొంతూరికి వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్‌ పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. సిబ్బంది హైదరాబాద్‌ వైపు వచ్చే వారిని 6  గేట్ల ద్వారా పంపిస్తుండగా.. మరోవైపు ఏపీ వైపు వెళ్తున్న వారిని 10 టోల్‌బూత్‌ల ద్వారా పంపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు భువనగిరి, రామన్నపేటల మీదుగా చిట్యాల చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆపై నార్కట్‌పల్లి దాటారంటే వీరికి ట్రాఫిక్‌ సమస్యలు తప్పుతాయని తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. శనివారం తెల్లవారుజాము నుంచే నగరంలోని ఎంజీబీస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌‌నగర్‌ బస్టాండ్లు, ఎల్బీనగర్‌ జంక్షన్ ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. 

Also Read: CM Chandrababu: ఏపీలో పెట్టుబడుల వెల్లువ - గ్రీన్ ఎనర్జీ @ రూ.10 లక్షల కోట్లు, సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
CM Vijay manifesto: మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
మొదటి రోజే ముఖ్యమంత్రి విజయ్‌కు మేనిఫెస్టో సెగ - స్టాలిన్ సవాల్‌ను తట్టుకోగలరా?
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
Embed widget