అన్వేషించండి

AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Andhra News: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి అభివృద్ధి పనులకు ఆమోదం సహా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపింది.

AP Cabinet Key Decisions: ఏపీ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసేందుకు కేబినెట్ (AP Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మంత్రి పార్థసారథి (Minister Parthasaradhi) వివరాలు వెల్లడించారు. రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులు ఇవ్వగా.. 45 ఇంజినీరింగ్ పనులు రూ.33,137 కోట్లతో పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు, హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. డోన్, ఉద్దానం, పులివెందులలో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. స్థిరమైన నీటి వనరుల వినియోగం ద్వారా తాగునీటి వసతి ఇవ్వాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని.. రూ.26,804 కోట్ల ప్రతిపాదనలు పంపి కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి పార్ధసారధి తెలిపారు. చిన్న రాష్ట్రాలు కూడా రూ.లక్ష కోట్లకు పనులు చేసుకున్నాయని చెప్పారు. గతంలో చేపట్టకుండా నిలిచిపోయిన పనులను పునఃపరిశీలిస్తామన్నారు. అనంతరం ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

కేబినెట్ నిర్ణయాలివే..

  • అమరావతిలో మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం. హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. అలాగే, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా రూ.5 వేల కోట్ల రుణానికి ఆమోదం.
  • బుడమేరు, 10 జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు సర్కారు ఆమోదం.
  • ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌‍ఫెడ్ ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం, పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు అనుమతి.
  • పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు అనుమతి.
  • క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు. దీని ద్వారా 1.06 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి.
  • రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు.
  • ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు పుస్తకాల సరఫరాకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్ర పర్వదినంగా రథసప్తమి

మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమిని రాష్ట్ర స్థాయి పర్వదినంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రథసప్తమితో పాటే 3 రోజులు పర్వదినంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. కాగా.. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి జరగనుండగా.. దేవస్థానం వేడుకలు నిర్వహిస్తుందని వెల్లడించింది.

మంత్రులకు సీఎం కీలక సూచన

అటు, సున్నిత అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా ప్రచారం చేసే వారుంటారని అన్నారు. ఢిల్లీలో అంబేడ్కర్ విషయమై జరిగిన వ్యవహారం కూడా ఈ తరహాలోనిదేనని చెప్పారు. ఈ పరిణామాలపై మంత్రులతో చర్చించారు. 'గతంలో వ్యవసాయం దండగ అనకున్నా.. అన్నట్లుగా నాపై తప్పుడు ప్రచారం చేశారు. కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్‌కు తగిన గౌరవం లభించలేదు. అంబేడ్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఎవరి ద్వారా అంబేడ్కర్‌కు గుర్తింపు వచ్చిందనే దానిపై చర్చించాలి.' అని అమాత్యులకు సూచించారు.

Also Read: Tirumala: తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ - కేసులు నమోదు చేయాలంటున్న భక్తులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
India vs New Zealand First T20: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
Embed widget