అన్వేషించండి

AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Andhra News: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి అభివృద్ధి పనులకు ఆమోదం సహా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపింది.

AP Cabinet Key Decisions: ఏపీ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసేందుకు కేబినెట్ (AP Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మంత్రి పార్థసారథి (Minister Parthasaradhi) వివరాలు వెల్లడించారు. రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులు ఇవ్వగా.. 45 ఇంజినీరింగ్ పనులు రూ.33,137 కోట్లతో పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు, హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. డోన్, ఉద్దానం, పులివెందులలో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. స్థిరమైన నీటి వనరుల వినియోగం ద్వారా తాగునీటి వసతి ఇవ్వాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని.. రూ.26,804 కోట్ల ప్రతిపాదనలు పంపి కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి పార్ధసారధి తెలిపారు. చిన్న రాష్ట్రాలు కూడా రూ.లక్ష కోట్లకు పనులు చేసుకున్నాయని చెప్పారు. గతంలో చేపట్టకుండా నిలిచిపోయిన పనులను పునఃపరిశీలిస్తామన్నారు. అనంతరం ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

కేబినెట్ నిర్ణయాలివే..

  • అమరావతిలో మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం. హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. అలాగే, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా రూ.5 వేల కోట్ల రుణానికి ఆమోదం.
  • బుడమేరు, 10 జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు సర్కారు ఆమోదం.
  • ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌‍ఫెడ్ ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం, పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు అనుమతి.
  • పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు అనుమతి.
  • క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు. దీని ద్వారా 1.06 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి.
  • రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు.
  • ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు పుస్తకాల సరఫరాకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్ర పర్వదినంగా రథసప్తమి

మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమిని రాష్ట్ర స్థాయి పర్వదినంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రథసప్తమితో పాటే 3 రోజులు పర్వదినంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. కాగా.. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి జరగనుండగా.. దేవస్థానం వేడుకలు నిర్వహిస్తుందని వెల్లడించింది.

మంత్రులకు సీఎం కీలక సూచన

అటు, సున్నిత అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా ప్రచారం చేసే వారుంటారని అన్నారు. ఢిల్లీలో అంబేడ్కర్ విషయమై జరిగిన వ్యవహారం కూడా ఈ తరహాలోనిదేనని చెప్పారు. ఈ పరిణామాలపై మంత్రులతో చర్చించారు. 'గతంలో వ్యవసాయం దండగ అనకున్నా.. అన్నట్లుగా నాపై తప్పుడు ప్రచారం చేశారు. కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్‌కు తగిన గౌరవం లభించలేదు. అంబేడ్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఎవరి ద్వారా అంబేడ్కర్‌కు గుర్తింపు వచ్చిందనే దానిపై చర్చించాలి.' అని అమాత్యులకు సూచించారు.

Also Read: Tirumala: తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ - కేసులు నమోదు చేయాలంటున్న భక్తులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
Breaking News: కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Embed widget