అన్వేషించండి

AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Andhra News: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి అభివృద్ధి పనులకు ఆమోదం సహా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపింది.

AP Cabinet Key Decisions: ఏపీ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసేందుకు కేబినెట్ (AP Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మంత్రి పార్థసారథి (Minister Parthasaradhi) వివరాలు వెల్లడించారు. రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులు ఇవ్వగా.. 45 ఇంజినీరింగ్ పనులు రూ.33,137 కోట్లతో పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు, హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. డోన్, ఉద్దానం, పులివెందులలో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. స్థిరమైన నీటి వనరుల వినియోగం ద్వారా తాగునీటి వసతి ఇవ్వాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందని.. రూ.26,804 కోట్ల ప్రతిపాదనలు పంపి కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి పార్ధసారధి తెలిపారు. చిన్న రాష్ట్రాలు కూడా రూ.లక్ష కోట్లకు పనులు చేసుకున్నాయని చెప్పారు. గతంలో చేపట్టకుండా నిలిచిపోయిన పనులను పునఃపరిశీలిస్తామన్నారు. అనంతరం ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

కేబినెట్ నిర్ణయాలివే..

  • అమరావతిలో మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం. హడ్కో ద్వారా రూ.11 వేల కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. అలాగే, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా రూ.5 వేల కోట్ల రుణానికి ఆమోదం.
  • బుడమేరు, 10 జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు సర్కారు ఆమోదం.
  • ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌‍ఫెడ్ ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం, పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు అనుమతి.
  • పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు అనుమతి.
  • క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు. దీని ద్వారా 1.06 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి.
  • రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు.
  • ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు పుస్తకాల సరఫరాకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్ర పర్వదినంగా రథసప్తమి

మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమిని రాష్ట్ర స్థాయి పర్వదినంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రథసప్తమితో పాటే 3 రోజులు పర్వదినంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. కాగా.. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి జరగనుండగా.. దేవస్థానం వేడుకలు నిర్వహిస్తుందని వెల్లడించింది.

మంత్రులకు సీఎం కీలక సూచన

అటు, సున్నిత అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా ప్రచారం చేసే వారుంటారని అన్నారు. ఢిల్లీలో అంబేడ్కర్ విషయమై జరిగిన వ్యవహారం కూడా ఈ తరహాలోనిదేనని చెప్పారు. ఈ పరిణామాలపై మంత్రులతో చర్చించారు. 'గతంలో వ్యవసాయం దండగ అనకున్నా.. అన్నట్లుగా నాపై తప్పుడు ప్రచారం చేశారు. కాంగ్రెస్ హయాంలో అంబేడ్కర్‌కు తగిన గౌరవం లభించలేదు. అంబేడ్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఎవరి ద్వారా అంబేడ్కర్‌కు గుర్తింపు వచ్చిందనే దానిపై చర్చించాలి.' అని అమాత్యులకు సూచించారు.

Also Read: Tirumala: తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ - కేసులు నమోదు చేయాలంటున్న భక్తులు

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
Vijay Deverakonda: కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Thala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSKKavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్CSK Failures in IPL 2025 | MS Dhoni కెప్టెన్ అయినా రాతను మార్చుకోలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
Vijay Deverakonda: కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
Balochistan War: పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
IPL 2025 KKR VS PBKS Match Abandoned: పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ ర‌ద్దు.. ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్, ప్ర‌భ్ సిమ్రాన్, ప్రియాంశ్ మెరుపులు వృథా
పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ ర‌ద్దు.. ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్, ప్ర‌భ్ సిమ్రాన్, ప్రియాంశ్ మెరుపులు వృథా
AR Rahman: ఏఆర్ రెహమాన్ కాపీ కొట్టారు... రెండు కోట్లు డిపాజిట్ చేయండి... ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు
ఏఆర్ రెహమాన్ కాపీ కొట్టారు... రెండు కోట్లు డిపాజిట్ చేయండి... ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు
Shubman Gill : మూడేళ్లుగా నేను సింగిల్‌, ఆ వ్యక్తి కోసం ఆలుపరాటా తిన్నా: డేటింగ్ రూమర్స్‌పై శుభ్‌మన్‌ గిల్‌
మూడేళ్లుగా నేను సింగిల్‌, ఆ వ్యక్తి కోసం ఆలుపరాటా తిన్నా: డేటింగ్ రూమర్స్‌పై శుభ్‌మన్‌ గిల్‌
Embed widget