అన్వేషించండి

Chandrababu: ఏపీలో వర్షాలు, వరదలపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు - చంద్రబాబు

Heavy Rains in Andhra Pradesh | ఏపీలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై దుష్ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

AP CM Chandrababu | ఏపీలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ వర్షపాతం (Rains In AP) నమోదైందని.. విజయవాడ, గుంటూరులో వెంటనే చర్యలు చేపట్టామని  సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాలు, వరదల నేపథ్యంలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందన్నారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు అధికారులతో వర్షాలపై తాజా పరిస్థితిని ఆరాతీశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ‘విజయవాడలో కొండచరియలు పడి చనిపోవడం బాధాకరం. వర్షాలు, వరదల్లో 9 మంది చనిపోయారు, ఒకరు గల్లంతయ్యారు. కాజా, టోలేట్, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉంది అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. 

ఏపీలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

రాష్ట్రంలో గరిష్టంగా 32.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగ్గయ్యపేటలో 26.1 సెంటీమీటర్ల వర్షపాతం, తిరువూరులో 26 సెంటీమీటర్లు, గుంటూరులో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అధికారులతో ఎప్పటికప్పుడూ సమీక్ష జరిపి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. అధికారులు కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని మానిటర్ చేయడం వల్ల ప్రాణనష్టం అధికం కాకుండా, చూడగలిగామన్నారు. కానీ విజయవాడలో కొండ చరియలు విరిగిపడటం, గుంటూరులో కారు కొట్టుకుపోవడం ఇలాంటి ఘటనలతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అన్నారు. 

భారీ వర్షాలతో అన్ని జలాశయాలు నిండిపోయాయి. అన్ని నిండితే వరద నీళ్లు ఎక్కువగా వస్తాయి. శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చి నాగార్జున సాగర్ నిండింది, ఆపై పులిచింతలలో పూర్తి స్థాయికి చేరింది. లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి 8 లక్షల 90 వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఇది 10 లక్షలకు చేరుతుంది. 
Also Read: చంద్రబాబు పాలిటికల్ కెరీర్ హైలైట్స్, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు - అప్పట్లోనే విజన్ 2020

తెలుగు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు

ఏపీ, తెలంగాణ మధ్య అటు రోడ్డు మార్గంతో పాటు ఇటు రైలు మార్గంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. విజయవాడ - కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. భారీ వరదలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వేట్రాక్ ధ్వంసమైంది. ఇంటికన్నె, కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ కింద మట్టి, కంకర కొట్టుకుపోవడంతో ట్రాక్ కింద నుంచి, ట్రాక్ పైనుంచి సైతం వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. మచిలీపట్నం, సింహపురి రైళ్లు మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. ఐతవరం వద్ద నీటి ప్రవాహం ఉధృతం కావడంతో ఇదివరకే రైలు సర్వీసులు నిలిపివేయగా.. బస్సులను సైతం తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. బస్సులు వెళ్లకపోవడంతో విజయవాడ బస్టాండ్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Religious Tourism: ఆధ్యాత్మిక యాత్రల స్వర్గధామం! ఉత్తరప్రదేశ్ నంబర్ 1 ట్రావెల్ స్టేట్‌గా ఎందుకు మారింది?
ఆధ్యాత్మిక యాత్రల స్వర్గధామం! ఉత్తరప్రదేశ్ నంబర్ 1 ట్రావెల్ స్టేట్‌గా ఎందుకు మారింది?
Vrusshabha Movie Review - 'వృషభ' రివ్యూ: 'మగధీర' లాంటి కథతో మోహన్ లాల్ సినిమా... పునర్జన్మల కాన్సెప్ట్‌తో హిట్ వచ్చేనా?
'వృషభ' రివ్యూ: 'మగధీర' లాంటి కథతో మోహన్ లాల్ సినిమా... పునర్జన్మల కాన్సెప్ట్‌తో హిట్ వచ్చేనా?
Embed widget