అన్వేషించండి

AP Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినేట్ భేటీ... ఆ పథకాలపై కీలక చర్చ

ఏపీ కేబినేట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఈ ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో కీలకమైన పథకాలపై చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినేట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఈ నెలలో  అమలు చేయనున్న ప్రభుత్వ పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్ ఏర్పాటుపై మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. 

ఆగస్టు 10వ తేదీన అమలు చేయనున్న వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం పథకంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. పోలవరం నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ చెల్లింపులను మంత్రి వర్గ భేటీలో ఆమోదించే అవకాశం ఉంది. రూ.10 లక్షల పరిహారం చెల్లింపునకు రూ.550 కోట్ల విడుదలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ ఆమోదం తెలపనుంది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకాలపై మంత్రి వర్గంలో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

కేబినేట్ సమావేశంలో రహదారులు భవనాల శాఖకు చెందిన ఆస్తుల బదలాయింపు సహా మరిన్ని కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రహదారులు భవనాల శాఖకు చెందిన రూ. 4 వేల కోట్ల ఆస్తులను రహదారుల డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదలాయించే విషయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు, కేంద్రం సహకారంతో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక కారిడార్‌లకు, పోర్టులకు అనుసంధానంగా ఈ లాజిస్టిక్ పార్కులను ఏపీలో ఏర్పాటు చేసే అంశంపై కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. 

నిధుల సమీకరణకు నూతన కార్పొరేషన్!

రాష్ట్రంలో నిధుల సమీకరణకు సంబంధించి నూతన కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రి వర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో నూతన సీడ్ పాలసీ అమలుపై చర్చించనున్నారు. జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో ఏవిధంగా అమలు చేయాలనే అంశంపై ఈ భేటీలో సమీక్షించనున్నారు. నేతన్న నేస్తం, పాఠశాలల్లో నాడు- నేడు పనులకు ఆమోదం తెలిపి అవకాశం ఉంది. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన ఆర్ అండ్ ఆర్ కింద ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షలు అదనంగా ఇచ్చే అంశంపైనా ఈ సమావేశంలో  చర్చించనున్నారు. ఆక్వా రైతులకు లాభం కలిగేలా ఫిష్ మార్కెటింగ్ విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

Also Read: Land Survey, Andhra Pradesh: సమగ్ర భూ సర్వేలో 'సచివాలయ' సర్వేయర్లు.. వందేళ్ల తర్వాత తొలిసారి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget